Rajasthan: బూండీలో విద్యుత్ సెగ.. బీజేపీ కార్యకర్తలు, రైతులపై లాఠీచార్జి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరెంటు కోతలపై రాజస్థాన్లోని బూండీ జిల్లాలో సోమవారం తీవ్ర దుమారం చెలరేగింది. కరెంటు కోతలు, ట్రాన్స్ఫార్మర్లను మార్చడాన్ని నిరసిస్తూ బీజేపీ కార్యకర్తలు, రైతులు ఆందోళన చేపట్టారు. దీంతో వారిపై పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. గత కొన్ని రోజులుగా విద్యుత్ కోతలతో అక్కడి జనాలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ జిల్లాల్లో ప్రజలు ఆందోళన బాటపట్టారు. సోమవారం బూండీలో కరెంటు కోతలపై తీవ్ర దుమారం రేగింది. వాస్తవానికి విద్యుత్ కోతలు ఉండొద్దంటూ.. ట్రాన్స్ఫార్మర్లను మార్చద్దంటూ రైతులతో పాటు బీజేపీ కార్యకర్తలు విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో ఆరుగురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు.
Chandra shekhar: నేను అమిత్ షాకి శాలువా కప్పితే దళితుడ్ని అంటూ నిరాకరించాడు..
Also Read
బూండీ ఎస్డిఎం సోహన్లాల్ మాట్లాడుతూ.. కోట సీనియర్ ఇంజనీర్ గజేంద్ర బెర్వా ఆందోళనకారులతో చర్చలు జరిపినట్లు తెలిసింది. ఆందోళనకారుల డిమాండ్లన్నింటినీ అధికారులు మౌఖికంగా అంగీకరించారు. అయితే నిరసనకారులు రాతపూర్వకంగా డిమాండ్లను అంగీకరించడంపై మొండిగా ఉన్నారు. దీనిపై అధికారులు రాతపూర్వకంగా ఇవ్వలేమని సమాధానం ఇవ్వడంతో అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Putin Dials PM Modi: ప్రధాని మోడీకి పుతిన్ ఫోన్.. ఏం చెప్పారంటే?
మరోవైపు 72 గంటల్లో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లను మారుస్తామని, సామాన్యులకు 24 గంటల గృహ, 8 గంటల వ్యవసాయ విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల హామీని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీజేపీ నేత రూపేష్ శర్మ అన్నారు. గ్రామాల్లో అప్రకటిత విద్యుత్ కోతలు, విద్యుత్ శాఖ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండడంతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోతున్న రైతు వరిపంటకు సరిపడా రోజులలో త్రీఫేజ్ కరెంటు, గ్రామంలో 24 గంటల కరెంటు అవసరమని బిజెపి నాయకుడు అన్నారు.
తాజావార్తలు
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Congress: తుంగతుర్తి కాంగ్రెస్ పంచాయితీకి తెర.. జగ్గారెడ్డితో ఎమ్మెల్యే మందుల సామెల్ భేటీ.!
-
National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
-
Varanasi: రూమరా? నిజమా? రాజమౌళి – మహేష్ బాబు సినిమాతో ఎన్టీఆర్ కొడుకు ఎంట్రీ!
-
Bihar: లవ్ ఎఫైర్.. మహిళా కానిస్టేబుల్ కిడ్నాప్, అత్యాచారం..
ట్రెండింగ్
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?
-
Shreyas Iyer: ఆ తప్పిదాలే మా కొంపముంచాయి.. చాలా చెత్తగా ఆడాం.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్!
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..