NV Subhash: కనుమరుగైన నేతలకు పునరావాస కేంద్రం ‘బీఆర్ఎస్’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశరాజకీయాల్లో తాము క్రియాశీలక పాత్ర పోషిస్తామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా ఆయన కీలక ఉపన్యాసం చేసిన సంగతి తెలిసిందే. కేసీఆర్ ప్రసంగంపై మండిపడుతోంది బీజేపీ. దేశ రాజకీయాలంటూ కేసీఆర్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా… ప్రజలు పట్టించుకోరని అన్నారు తెలంగాణ బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్. తెలంగాణలోనే ఏమీ చేయని వ్యక్తి ఇక జాతీయ రాజకీయాల్లో ఏం చేస్తాడని ఎద్దేవా చేశారు. ‘టీఆర్ఎస్’ ను ఎప్పుడైతే… ‘బీఆర్ఎస్’ అని ప్రకటించారో… అప్పుడే తెలంగాణ అస్తిత్వం చచ్చిపోయిందని ఆయన పేర్కొన్నారు. ఆ పార్టీ ఎక్కడ ఉన్నా.. దోచుకోవడం, దాచుకోవడం తప్ప, ప్రజలకు ఉపయోగమేమీ ఉండదని పేర్కొన్నారు. కేవలం తన కొడుకు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేయడానికే ‘బీఆర్ఎస్’ పార్టీ అంటూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు.
Read Also: Raj Kahani: అమ్మ ప్రేమ… అమ్మాయి ప్రేమ నేపథ్యంలో చిత్రం!
Also Read
- India vs Sri Lanka: ఒకప్పుడు భారత్కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
- Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
- India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
- Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
‘బీఆర్ఎస్’ పార్టీ, దేశంలోని అవుట్డేటెడ్ పార్టీలు, కనుమరుగైన రాజకీయ నేతలకు పునరావాస కేంద్రంగా మారుతుందే తప్ప, ఆ పార్టీ పీకేది ఏమీ లేదని వెల్లడించారు. ఎంతసేపు ప్రధాని నరేంద్ర మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్న కేసీఆర్ అండ్ బ్యాచ్ కు … గుజరాత్ మోడల్ అంటే ఏంటో ఇప్పటికైనా అర్థమై ఉంటుందని… ఇప్పటికీ అర్థం కాకుంటే టిఆర్ఎస్ నేతలు, కళ్ళుండి చూడలేని కబోదులుగానే పరిగణించాల్సి ఉంటుందని ఎన్వి సుభాష్ వెల్లడించారు. గుజరాత్ లో భారతీయ జనతా పార్టీని ఓడించేందుకు కేసీఆర్ సహా ప్రత్యర్ధులు డబ్బు సంచులను పంపినా… రికార్డ్ విక్టరీ తో అక్కడి ప్రజలు బిజెపిని గెలిపించి, వీళ్ళ చెంప చెల్లు మనిపించారని అన్నారు.
Read Also: Shocking Video: వేరే వ్యక్తితో మాట్లాడుతుండగా రైల్వే టీసీపై తెగిపడిన కరెంట్ వైర్
ఇప్పటికైనా ఈ దొంగల ముఠాకు బుద్ధి వచ్చి, తెలంగాణ అభివృద్ధిపై దృష్టి సారించాలని హితవు పలికారు. దేశం కోసం, ధర్మం కోసం రోజులో 18 గంటలు పనిచేస్తున్న ప్రధాని మోదీ మేనియా ముందు, మీ పప్పులు ఉడకవని, ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలని కేసీఆర్ అండ్ బ్యాచ్ ను హెచ్చరించారు ఎన్వి సుభాష్. మీరు ‘టీఆర్ఎస్’ ను ‘బీఆర్ఎస్’ చేసుకున్నా… ఏమి చేసుకున్నా… మీకు ‘వీఆర్ఎస్’ తప్పదని… లిక్కర్ స్కామ్లలో, అవినీతి కేసులలో… మీరు జైలుకు పోక తప్పదని జోష్యం చెప్పారు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వి సుభాష్.
తాజావార్తలు
-
Kollywood : శంకర్ దర్శకత్వంలో అజిత్ కుమార్ సినిమా?
-
India vs Sri Lanka: ఒకప్పుడు భారత్కు ప్రపంచకప్ అందించాడు.. ఇప్పుడు ఆ జట్టునే ఓడించేందుకు ప్లాన్..!
-
Haryana Viral Video: జుట్టు పట్టుకుని ఈడ్చి.. కింద పడేసి.. భార్యపై నడిరోడ్డుపైనే భర్త ఎలా దాడి చేశాడంటే?
-
VB-G RAM G Scheme: వీబీ-జీ రామ్ జీ పథకం.. తొలి నెలలోనే 50% తగ్గిన గ్రామీణ ఉపాధి..!
-
Maggi Noodles Case: మ్యాగీ లీడ్ వివాదానికి మరో ట్విస్ట్.. కేసులు కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!