Karnataka: కర్ణాటక గూండాల రాష్ట్రంగా మారింది.. అసెంబ్లీలో తీవ్ర వాగ్వాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: శాంతిభద్రతల పరిస్థితిపై కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. కర్ణాటక గూండాల రాష్ట్రంగా మారిందని ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బీజేపీ ఆరోపించింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం బతికే ఉందా, చచ్చిందా అని బీజేపీ నేతలు ప్రశ్నించారు.
కర్ణాటక అసెంబ్లీలో వాడివేడి చర్చ
సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ ఎమ్మెల్యేలు ఇచ్చిన వాయిదా నోటీసు ఆధారంగా శాంతిభద్రతలపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత సభలో తీవ్ర వాగ్వాదం జరగగా, బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను బీజేపీ నేత లేవనెత్తారు. ఇటీవల బెళగావిలో మహిళలను నగ్నంగా ఊరేగించడం, హవేరీ గ్యాంగ్ రేప్, సైబర్ క్రైమ్, టెర్రర్ సంబంధిత కార్యకలాపాల కారణంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ అన్నారు. దీనిపై చర్చ జరగాలి. ఈ విషయం గత సెషన్లో జాబితా చేయబడింది, కానీ చర్చించలేకపోయిందని మండిపడ్జారు.
Also Read
- Amit Shah: 'చికెన్ నెక్' కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
- Kapil Dev: "బాధ ఎందుకు.. పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి".. రోహిత్ రిటైర్మెంట్పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
- Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
- NEET Ranker: కన్నీటి నుంచి పుట్టిన సంకల్పం.. తండ్రి మరణాన్ని స్ఫూర్తిగా మార్చుకుని 'నీట్'లో ర్యాంక్..
Read Also: Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల కోసం “ఎంఎస్పీ” చట్టం..
బీజేపీ ఆరోపణలపై ప్రభుత్వం ఏం చెప్పింది?
అసెంబ్లీలో జరిగిన గందరగోళాన్ని చూసిన రాష్ట్ర హోంమంత్రి జి పరమేశ్వర మాట్లాడుతూ.. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తడానికి ప్రభుత్వం వ్యతిరేకం కాదని, ప్రశ్నోత్తరాల సమయం తర్వాత లేవనెత్తాలని అన్నారు. శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయనే ఆరోపణలపై ప్రభుత్వం స్పందిస్తుందని, అలాగే బీజేపీ హయాంలో జరిగిన హత్యలు, సంఘ వ్యతిరేక వ్యక్తులు బహిరంగంగా ఆయుధాలను ఎలా ఉపయోగించారో కూడా తెలుసని ఆయన పేర్కొన్నారు. ఆర్.అశోక్కు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ.. హవేరీ గ్యాంగ్ రేప్ కేసులో సంబంధం లేని వ్యక్తులపై కేసు నమోదైనందున ఈ కేసు చాలా ముఖ్యమైనదని అన్నారు. మాండ్యాలో హనుమాన్ జెండా ఎగురవేసే విషయంలో సరిగ్గా అదే జరిగిందని.. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో అరాచక వాతావరణం కనిపిస్తోందని బీజేపీ నేత అన్నారు.
తాజావార్తలు
-
Amit Shah: ‘చికెన్ నెక్’ కారిడార్ భద్రతపై అమిత్ షా హై లెవల్ రివ్యూ..
-
NBK 111: బిగ్ రిస్క్ లో బాలయ్య?
-
Kapil Dev: “బాధ ఎందుకు.. పండుగలా సెలబ్రేట్ చేసుకోవాలి”.. రోహిత్ రిటైర్మెంట్పై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
-
Anaconda vs Python: అనకొండా, కొండచిలువ ఒకటే అనుకుంటున్నారా? అసలు తేడా ఇదే!
-
Abhijit Deepke: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. అభిజిత్ దీప్కేపై ఇంక్ దాడి..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!