Karnataka: కర్ణాటక గూండాల రాష్ట్రంగా మారింది.. అసెంబ్లీలో తీవ్ర వాగ్వాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka: శాంతిభద్రతల పరిస్థితిపై కర్ణాటక అసెంబ్లీలో మంగళవారం తీవ్ర వాగ్వాదం జరిగింది. కర్ణాటక గూండాల రాష్ట్రంగా మారిందని ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బీజేపీ ఆరోపించింది. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం బతికే ఉందా, చచ్చిందా అని బీజేపీ నేతలు ప్రశ్నించారు.
కర్ణాటక అసెంబ్లీలో వాడివేడి చర్చ
సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ ఎమ్మెల్యేలు ఇచ్చిన వాయిదా నోటీసు ఆధారంగా శాంతిభద్రతలపై చర్చించాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత సభలో తీవ్ర వాగ్వాదం జరగగా, బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యను బీజేపీ నేత లేవనెత్తారు. ఇటీవల బెళగావిలో మహిళలను నగ్నంగా ఊరేగించడం, హవేరీ గ్యాంగ్ రేప్, సైబర్ క్రైమ్, టెర్రర్ సంబంధిత కార్యకలాపాల కారణంగా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ప్రతిపక్ష నేత ఆర్.అశోక్ అన్నారు. దీనిపై చర్చ జరగాలి. ఈ విషయం గత సెషన్లో జాబితా చేయబడింది, కానీ చర్చించలేకపోయిందని మండిపడ్జారు.
Also Read
- Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
- Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
- Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
- PhonePe: ఇంటర్నెట్ లేకున్నా UPI సేవలు.. కొత్త సర్వీస్ ప్రారంభించిన ఫోన్పే..
Read Also: Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల కోసం “ఎంఎస్పీ” చట్టం..
బీజేపీ ఆరోపణలపై ప్రభుత్వం ఏం చెప్పింది?
అసెంబ్లీలో జరిగిన గందరగోళాన్ని చూసిన రాష్ట్ర హోంమంత్రి జి పరమేశ్వర మాట్లాడుతూ.. ఈ అంశాన్ని ప్రతిపక్షాలు లేవనెత్తడానికి ప్రభుత్వం వ్యతిరేకం కాదని, ప్రశ్నోత్తరాల సమయం తర్వాత లేవనెత్తాలని అన్నారు. శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయనే ఆరోపణలపై ప్రభుత్వం స్పందిస్తుందని, అలాగే బీజేపీ హయాంలో జరిగిన హత్యలు, సంఘ వ్యతిరేక వ్యక్తులు బహిరంగంగా ఆయుధాలను ఎలా ఉపయోగించారో కూడా తెలుసని ఆయన పేర్కొన్నారు. ఆర్.అశోక్కు మద్దతుగా బీజేపీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ.. హవేరీ గ్యాంగ్ రేప్ కేసులో సంబంధం లేని వ్యక్తులపై కేసు నమోదైనందున ఈ కేసు చాలా ముఖ్యమైనదని అన్నారు. మాండ్యాలో హనుమాన్ జెండా ఎగురవేసే విషయంలో సరిగ్గా అదే జరిగిందని.. ఇదంతా చూస్తుంటే రాష్ట్రంలో అరాచక వాతావరణం కనిపిస్తోందని బీజేపీ నేత అన్నారు.
తాజావార్తలు
-
Tummala Nageswara Rao : పదవుల కోసం ఎప్పుడూ పాకులాడలేదు
-
Noida: నోయిడాలో నిర్భయ తరహాలో ఘోరం.. బాలికపై గ్యాంగ్రేప్
-
Tilak Varma: ఒత్తిడిలోనూ చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం.. మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసిన తిలక్ వర్మ..
-
Modi-Pezeshkian: మోడీతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!