BJP: రామ మందిర ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు బీజేపీ సన్నాహాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయోధ్యలో రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సన్నాహాలు ప్రారంభించింది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ముందు ఉండి నడిపిస్తున్నారు. ప్రధానమంత్రి ఇటీవల చేసిన దాదాపు ప్రతి ప్రసంగంలో ఆలయ నిర్మాణంతో పాటు సంప్రోక్షణ కార్యక్రమం గురించి ప్రస్తావించారు.
Read Also: Gorantla Madhav: వైసీపీలోనే చావో, రేవో.. సీటు ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీలోనే..!
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
కాగా, అయోధ్యలో వివిధ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరిస్తున్నారు. ఇక, ఈ నెల 22న దీపావళిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు వారి ఇళ్లలో దీపాలు వెలిగించాలన్నారు. బాలీవుడ్ గాయని స్వాతి మిశ్రా పాడిన పాటను శ్రీరాముడికి అంకితం చేసింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాల తరబడి సాగిన పోరాటం ఎలా విజయవంతమైందో, రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు మరికొద్ది రోజుల్లోనే సమయం ఉందని ప్రజలకు చెప్పేందుకు బీజేపీ పని చేస్తుంది.
Read Also: Sailesh Kolanu: ఆ యాంగిల్ లో కాలిస్తే బుల్లెట్ అలానే పోతది మావా…
అయోధ్యలో ప్రజల సందర్శనను సులభతరం చేయడానికి జనవరి 25 నుంచి దేశవ్యాప్తంగా ప్రచారం ప్రారంభించనున్నట్లు బీజేపీ నేతలు తెలియజేస్తున్నారు. 60 రోజుల డ్రైవ్ ఉంటుంది.. దీని కోసం 35 రైళ్లు అయోధ్యకు నడపనున్నట్లు తెలిపారు. బీజేపీ కార్యకర్తలకు ప్రయాణ ఖర్చులను తామే భరిస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ర్యాలీల సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు ఇతర నాయకులు ప్రజలకు రామ్లాలా దర్శనం పొందేలా చూస్తామని హామీ ఇచ్చారు. మతపరమైన కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందన్న విపక్షాల ఆరోపణలను కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తోసిపుచ్చారు. అయోధ్య రామమందిరం ట్రస్ట్ అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలకు ఆహ్వానాలు పంపింది.. బీజేపీ హయాంలో రామమందిరం కట్టడం మా తప్పు కాదు అని ప్రహ్లాద్ జోషి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!