BJP: రామ మందిర ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు బీజేపీ సన్నాహాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయోధ్యలో రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సన్నాహాలు ప్రారంభించింది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ముందు ఉండి నడిపిస్తున్నారు. ప్రధానమంత్రి ఇటీవల చేసిన దాదాపు ప్రతి ప్రసంగంలో ఆలయ నిర్మాణంతో పాటు సంప్రోక్షణ కార్యక్రమం గురించి ప్రస్తావించారు.
Read Also: Gorantla Madhav: వైసీపీలోనే చావో, రేవో.. సీటు ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీలోనే..!
Also Read
- Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
- 1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
- AP Rain Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఏపీకి విపత్తుల సంస్థ హెచ్చరిక
- Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
కాగా, అయోధ్యలో వివిధ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరిస్తున్నారు. ఇక, ఈ నెల 22న దీపావళిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు వారి ఇళ్లలో దీపాలు వెలిగించాలన్నారు. బాలీవుడ్ గాయని స్వాతి మిశ్రా పాడిన పాటను శ్రీరాముడికి అంకితం చేసింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాల తరబడి సాగిన పోరాటం ఎలా విజయవంతమైందో, రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు మరికొద్ది రోజుల్లోనే సమయం ఉందని ప్రజలకు చెప్పేందుకు బీజేపీ పని చేస్తుంది.
Read Also: Sailesh Kolanu: ఆ యాంగిల్ లో కాలిస్తే బుల్లెట్ అలానే పోతది మావా…
అయోధ్యలో ప్రజల సందర్శనను సులభతరం చేయడానికి జనవరి 25 నుంచి దేశవ్యాప్తంగా ప్రచారం ప్రారంభించనున్నట్లు బీజేపీ నేతలు తెలియజేస్తున్నారు. 60 రోజుల డ్రైవ్ ఉంటుంది.. దీని కోసం 35 రైళ్లు అయోధ్యకు నడపనున్నట్లు తెలిపారు. బీజేపీ కార్యకర్తలకు ప్రయాణ ఖర్చులను తామే భరిస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ర్యాలీల సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు ఇతర నాయకులు ప్రజలకు రామ్లాలా దర్శనం పొందేలా చూస్తామని హామీ ఇచ్చారు. మతపరమైన కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందన్న విపక్షాల ఆరోపణలను కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తోసిపుచ్చారు. అయోధ్య రామమందిరం ట్రస్ట్ అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలకు ఆహ్వానాలు పంపింది.. బీజేపీ హయాంలో రామమందిరం కట్టడం మా తప్పు కాదు అని ప్రహ్లాద్ జోషి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
The Paradise Tickets: ‘ది ప్యారడైజ్’కు భారీ క్రేజ్.. అప్పుడే 5 వేలకు పైగా టికెట్లు సోల్డ్!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
Father And Daughter Sentiment : టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములాగా ఫాదర్ – డాటర్ సెంటిమెంట్ స్టోరీస్
-
BGauss C12 MaxR: 178KM రేంజ్తో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. BGauss C12 MaxR లాంచ్.. 3.8 kWh బ్యాటరీ
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
ట్రెండింగ్
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?
-
IND vs AFG: టీమిండియాకు బిగ్ షాక్.. అఫ్గానిస్థాన్ టీ20 సిరీస్కు స్టార్ పేసర్ దూరం.. ఇంకెన్నాళ్లు ఈ గాయాలు!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..