BJP: రామ మందిర ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు బీజేపీ సన్నాహాలు..
అయోధ్యలో రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సన్నాహాలు ప్రారంభించింది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ముందు ఉండి నడిపిస్తున్నారు. ప్రధానమంత్రి ఇటీవల చేసిన దాదాపు ప్రతి ప్రసంగంలో ఆలయ నిర్మాణంతో పాటు సంప్రోక్షణ కార్యక్రమం గురించి ప్రస్తావించారు.
Read Also: Gorantla Madhav: వైసీపీలోనే చావో, రేవో.. సీటు ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీలోనే..!
Also Read
కాగా, అయోధ్యలో వివిధ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరిస్తున్నారు. ఇక, ఈ నెల 22న దీపావళిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు వారి ఇళ్లలో దీపాలు వెలిగించాలన్నారు. బాలీవుడ్ గాయని స్వాతి మిశ్రా పాడిన పాటను శ్రీరాముడికి అంకితం చేసింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాల తరబడి సాగిన పోరాటం ఎలా విజయవంతమైందో, రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు మరికొద్ది రోజుల్లోనే సమయం ఉందని ప్రజలకు చెప్పేందుకు బీజేపీ పని చేస్తుంది.
Read Also: Sailesh Kolanu: ఆ యాంగిల్ లో కాలిస్తే బుల్లెట్ అలానే పోతది మావా…
అయోధ్యలో ప్రజల సందర్శనను సులభతరం చేయడానికి జనవరి 25 నుంచి దేశవ్యాప్తంగా ప్రచారం ప్రారంభించనున్నట్లు బీజేపీ నేతలు తెలియజేస్తున్నారు. 60 రోజుల డ్రైవ్ ఉంటుంది.. దీని కోసం 35 రైళ్లు అయోధ్యకు నడపనున్నట్లు తెలిపారు. బీజేపీ కార్యకర్తలకు ప్రయాణ ఖర్చులను తామే భరిస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ర్యాలీల సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు ఇతర నాయకులు ప్రజలకు రామ్లాలా దర్శనం పొందేలా చూస్తామని హామీ ఇచ్చారు. మతపరమైన కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందన్న విపక్షాల ఆరోపణలను కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తోసిపుచ్చారు. అయోధ్య రామమందిరం ట్రస్ట్ అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలకు ఆహ్వానాలు పంపింది.. బీజేపీ హయాంలో రామమందిరం కట్టడం మా తప్పు కాదు అని ప్రహ్లాద్ జోషి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
M. S. Subbulakshmi biopic. : M. S. సుబ్బలక్ష్మి బయోపిక్ నుండి సాయి పల్లవి ఔట్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు చేదు అనుభవం.. హద్దు మీరిన లేడీ ఫ్యాన్, వీడియో వైరల్!
-
Delhi: టేకాఫ్ సమయంలో ఇంజిన్లో మంటలు.. విమానంలోని ఆరుగురికి గాయాలు.!
-
Self-Enumeration: తెలంగాణలో నేటి నుంచి సెల్ఫ్-ఎన్యుమరేషన్ ప్రారంభం..!
-
Rakasa : ‘రాకాస’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!