BJP: రామ మందిర ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు బీజేపీ సన్నాహాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయోధ్యలో రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సన్నాహాలు ప్రారంభించింది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ముందు ఉండి నడిపిస్తున్నారు. ప్రధానమంత్రి ఇటీవల చేసిన దాదాపు ప్రతి ప్రసంగంలో ఆలయ నిర్మాణంతో పాటు సంప్రోక్షణ కార్యక్రమం గురించి ప్రస్తావించారు.
Read Also: Gorantla Madhav: వైసీపీలోనే చావో, రేవో.. సీటు ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీలోనే..!
Also Read
- IndiGo Flights Suspended: విదేశీ ప్రయాణికులకు అలర్ట్.. కీలక రూట్లలో ఇండిగో సర్వీసులు రద్దు
- Religious Conversion: ‘‘ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి’’.. TCS తర్వాత విప్రోపై ఆరోపణలు..
- Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
- Women Living Alone in India: వితంతువులు, విడాకులు, ఒంటరి మహిళల సంఖ్యపై షాకింగ్ రిపోర్ట్.. దక్షిణాదిలో ఎందుకు ఎక్కువ?
కాగా, అయోధ్యలో వివిధ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరిస్తున్నారు. ఇక, ఈ నెల 22న దీపావళిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు వారి ఇళ్లలో దీపాలు వెలిగించాలన్నారు. బాలీవుడ్ గాయని స్వాతి మిశ్రా పాడిన పాటను శ్రీరాముడికి అంకితం చేసింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాల తరబడి సాగిన పోరాటం ఎలా విజయవంతమైందో, రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు మరికొద్ది రోజుల్లోనే సమయం ఉందని ప్రజలకు చెప్పేందుకు బీజేపీ పని చేస్తుంది.
Read Also: Sailesh Kolanu: ఆ యాంగిల్ లో కాలిస్తే బుల్లెట్ అలానే పోతది మావా…
అయోధ్యలో ప్రజల సందర్శనను సులభతరం చేయడానికి జనవరి 25 నుంచి దేశవ్యాప్తంగా ప్రచారం ప్రారంభించనున్నట్లు బీజేపీ నేతలు తెలియజేస్తున్నారు. 60 రోజుల డ్రైవ్ ఉంటుంది.. దీని కోసం 35 రైళ్లు అయోధ్యకు నడపనున్నట్లు తెలిపారు. బీజేపీ కార్యకర్తలకు ప్రయాణ ఖర్చులను తామే భరిస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ర్యాలీల సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు ఇతర నాయకులు ప్రజలకు రామ్లాలా దర్శనం పొందేలా చూస్తామని హామీ ఇచ్చారు. మతపరమైన కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందన్న విపక్షాల ఆరోపణలను కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తోసిపుచ్చారు. అయోధ్య రామమందిరం ట్రస్ట్ అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలకు ఆహ్వానాలు పంపింది.. బీజేపీ హయాంలో రామమందిరం కట్టడం మా తప్పు కాదు అని ప్రహ్లాద్ జోషి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Ram Charan: ‘చిట్టిబాబు’ వర్సెస్ ‘పెద్దిగాడు’: రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ ఏది?
-
IndiGo Flights Suspended: విదేశీ ప్రయాణికులకు అలర్ట్.. కీలక రూట్లలో ఇండిగో సర్వీసులు రద్దు
-
Hema : షూటింగ్లకే మూడ్ ఉండదు.. పవన్ కళ్యాణ్ను విమర్శిస్తారా?
-
Religious Conversion: ‘‘ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి’’.. TCS తర్వాత విప్రోపై ఆరోపణలు..
-
Twisha Sharma: భోపాల్ జైల్లో ట్విషా శర్మ నిందితులకు రాజభోగం.. భర్త, అత్తకు వీఐపీ ట్రీట్మెంట్
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!