BJP: రామ మందిర ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మకంగా నిర్వహించేందుకు బీజేపీ సన్నాహాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అయోధ్యలో రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సన్నాహాలు ప్రారంభించింది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారాన్ని స్టార్ట్ చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ముందు ఉండి నడిపిస్తున్నారు. ప్రధానమంత్రి ఇటీవల చేసిన దాదాపు ప్రతి ప్రసంగంలో ఆలయ నిర్మాణంతో పాటు సంప్రోక్షణ కార్యక్రమం గురించి ప్రస్తావించారు.
Read Also: Gorantla Madhav: వైసీపీలోనే చావో, రేవో.. సీటు ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీలోనే..!
Also Read
- Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
- AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
కాగా, అయోధ్యలో వివిధ ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరిస్తున్నారు. ఇక, ఈ నెల 22న దీపావళిని జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరు వారి ఇళ్లలో దీపాలు వెలిగించాలన్నారు. బాలీవుడ్ గాయని స్వాతి మిశ్రా పాడిన పాటను శ్రీరాముడికి అంకితం చేసింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాల తరబడి సాగిన పోరాటం ఎలా విజయవంతమైందో, రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు మరికొద్ది రోజుల్లోనే సమయం ఉందని ప్రజలకు చెప్పేందుకు బీజేపీ పని చేస్తుంది.
Read Also: Sailesh Kolanu: ఆ యాంగిల్ లో కాలిస్తే బుల్లెట్ అలానే పోతది మావా…
అయోధ్యలో ప్రజల సందర్శనను సులభతరం చేయడానికి జనవరి 25 నుంచి దేశవ్యాప్తంగా ప్రచారం ప్రారంభించనున్నట్లు బీజేపీ నేతలు తెలియజేస్తున్నారు. 60 రోజుల డ్రైవ్ ఉంటుంది.. దీని కోసం 35 రైళ్లు అయోధ్యకు నడపనున్నట్లు తెలిపారు. బీజేపీ కార్యకర్తలకు ప్రయాణ ఖర్చులను తామే భరిస్తామని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే, ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ర్యాలీల సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు ఇతర నాయకులు ప్రజలకు రామ్లాలా దర్శనం పొందేలా చూస్తామని హామీ ఇచ్చారు. మతపరమైన కార్యక్రమాన్ని బీజేపీ రాజకీయం చేస్తోందన్న విపక్షాల ఆరోపణలను కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి తోసిపుచ్చారు. అయోధ్య రామమందిరం ట్రస్ట్ అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖ నేతలకు ఆహ్వానాలు పంపింది.. బీజేపీ హయాంలో రామమందిరం కట్టడం మా తప్పు కాదు అని ప్రహ్లాద్ జోషి చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Supreme Court: X, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ పోస్టుల తొలగింపుపై వైసీపీ పిటిషన్.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
AP Liquor Case: ఏపీ లిక్కర్ రవాణా కేసు.. కారుమూరి రిమాండ్లో కీలక అంశాలు..
-
Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
-
Rishabh Pant: ఒక్కరోజే మూడు అరుదైన రికార్డులు.. ధోనీ, గిల్, గిల్క్రిస్ట్లను వెనక్కి నెట్టిన రిషభ్ పంత్!
-
Reservation Roster: డాక్టర్ల నియామకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం!
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?