BJP MPs: ” ఇది పాకిస్థాన్ పనే” ఉగ్రవాద ఘటనపై బీజేపీ ఎంపీల రియాక్షన్..
- పాకిస్థాన్లో అసమర్థ నాయకత్వం ఉంది: కిషన్ రెడ్డి
- పాక్ను ఉగ్రదేశంగా ప్రకటించడం ఖాయం: లక్ష్మణ్
- దాడికి పాల్పడ్డ వారికి మూల్యం తప్పదు: ఈటెల
- నిన్నటి దాడి భారత్ ఐక్యత పై జరిగింది: కొండ
వర్గం పేరు అడిగి దాడి చేయడాన్ని సభ్య సమాజం ఖండిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పాకిస్థాన్లో అసమర్థ నాయకత్వం ఉందని.. ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో పాకిస్థాన్ నిప్పులు పోస్తుందన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన పాకిస్థాన్ను తీవ్రంగా విమర్శించారు. భారత్ను దెబ్బతీయాలని పాక్ చూస్తే అది ఆ దేశ పొరపాటే అన్నారు. ఈ దాడి సిగ్గుమాలిన చర్య అని.. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. దోషులను వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
READ MORE: Pahalgam Terrorist Attack: పహల్గాం ఉగ్ర దాడిలో మరణించిన నెల్లూరు వాసి!
Also Read
- Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా!
- New LPG Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. ఈ పని చేయకపోతే కనెక్షన్ కట్..!
- Tejasvi Surya: రూ.600 కోట్లతో మైనార్టీల కాలనీల్లో రోడ్లా? కర్ణాటక ప్రభుత్వంపై తేజస్వి సూర్య ధ్వజం
- PSL: చివరి ఓవర్ థ్రిల్లర్.. 2 పరుగుల తేడాతో విజయం.. ఫైనల్లోకి అగుడు పెట్టిన హైదరాబాద్ జట్టు..
మరోవైపు ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ ఈ అంశంపై స్పందించారు. “దేశ అభివృద్ధి చూడలేక పాక్ భారత్ ను దొంగ దొబ్బ తీసింది. కశ్మీర్ సంస్కృతిని కాపాడేందుకు మోడీ చేస్తోన్న ప్రయత్నం అడ్డుకునేందుకు కుట్ర చేసింది. పాక్ ఉగ్రవాద చర్యలకు మానుకోకపోతే.. ప్రపంచ దేశాలు పాక్ను ఉగ్రదేశంగా ప్రకటించడం ఖాయం. పాక్ లో ఉన్న ఉగ్రవాదులను ఏరి వేయాలి. బాధిత కుటుంబాలను అన్ని రకాలుగా ఆదుకుంటాం. ఘాతుకం జరిగినప్పుడు నిన్న నేను శ్రీనగర్లో ఉన్నాను. పాక్ దొంగ దెబ్బలు దేశ ప్రజలంతా ఖండించాలి” అని ఆయన వ్యాఖ్యానించారు.
READ MORE: Terror Attack: పాకిస్థాన్ సరిహద్దుల్లో భారీగా సైన్యం, వైమానిక విమానాలు? ఈ వార్తలో నిజమెంత?
“బాధిత కుటుంబాలకు ప్రగడ సానుభూతి. దాడికి పాల్పడ్డ వారికి మూల్యం తప్పదు. పాక్ కుట్రలో బాగానే దాడి జరిగింది. హిందువుల అని అడిగి మరి దాడి చేయడం దుర్మార్గమైన చర్య. టెర్రరిజం ఎక్కడున్నా అంతం చేయాలి. ఇదొక్క పిరికి పంద చర్య” అని ఎంపీ ఈటెల రాజేందర్ ఫైర్ అయ్యారు. నిన్నటి దాడి భారత్ ఐక్యత పై జరిగిందని.. దీని పరిణామాలు చాలా సీరియస్ గా ఉంటాయని ఎంపీ కొండ విశ్వేశ్వర రెడ్డి అన్నారు. ఇజ్రాయెల్ టూరిస్ట్ పై హమాస్ జరిపిన దాడికి మూల్యం చెల్లించుకుంటుందని.. ఇదే విధమైన బుద్ధి భారత్ పాక్ కు చెప్పడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Gold Rates: గోల్డ్ లవర్స్కు మళ్లీ షాక్.. నేటి బంగారం, వెండి ధరలు ఇలా!
-
New LPG Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. అమల్లోకి కొత్త రూల్స్.. ఈ పని చేయకపోతే కనెక్షన్ కట్..!
-
Samsung Galaxy F17e 5G: సామ్ సంగ్ 5G ఫోన్ కేవలం రూ.13,774 కే.. 6000 mAh బ్యాటరీ, 50MP కెమెరా
-
Tejasvi Surya: రూ.600 కోట్లతో మైనార్టీల కాలనీల్లో రోడ్లా? కర్ణాటక ప్రభుత్వంపై తేజస్వి సూర్య ధ్వజం
-
PSL: చివరి ఓవర్ థ్రిల్లర్.. 2 పరుగుల తేడాతో విజయం.. ఫైనల్లోకి అగుడు పెట్టిన హైదరాబాద్ జట్టు..
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!