GVL Narasimha Rao: SBI-CSR నిధులతో సంక్రాంతి వేడుకలు.. సీపీఎంపై జీవీఎల్ కౌంటర్ ఎటాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
GVL Narasimha Rao: మహాసంక్రాంతి వేడుకల విరాళాలపై రాజకీయ విమర్శలకు ఎంపీ జీవీఎల్ నరసింహారావు కౌంటర్ ఎటాక్కు దిగారు.. SBI-CSR నుంచి 65 లక్షల రూపాయలు తీసుకోవడంపై సీపీఎం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం విదితమే కాగా.. సీపీఎం నేతలపై మండిపడ్డారు జీవీఎల్.. కనుమరుగైన వామపక్ష పార్టీలవి చౌకబారు విమర్శలు.. సాంస్కృతిని మరిచి పోయిన కమ్యూనిస్టులు.. చైనా వేడుకలు ఇక్కడ నిర్వహించాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసే నైజం వామపక్షాలదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర సంప్రదాయాలు కొనసాగించాలని పార్టీలకు అతీతంగా సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నాం.. ఇవాళ జరగనున్న మహాసంక్రాంతి ముగింపు వేడుకల్లో 10 మందికి పైగా ఎంపీలు పాల్గొంటున్నారని తెలిపారు. ఛాలెంజ్ చేస్తున్నా ఈ సంక్రాంతి వేడుకల్లో ఒక్క రూపాయి అవినీతి జరిగినట్టు నిరూపించగలరా..? అంటూ సవాల్ విసిరారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.
Read Also: Suriya: కంగువ సెకండ్ లుక్ రిలీజ్… పీరియాడిక్ కాదు సెమీ పీరియాడిక్
Also Read
- తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
- Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
- Prakash Chik Baraik: టీఎంసీకి మరో ఎదురు దెబ్బ.. మూడో రాజ్యసభ సభ్యుడు రాజీనామా..
- Vaibhav Sooryavanshi: మరోసారి అదే నిర్లక్ష్యం.. మళ్లీ బొక్కబోర్లా పడ్డ వైభవ్.!
కాగా, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ప్రతిపక్షాలకు టార్గెట్ అయ్యారు. SBI-CSR నిధులతో సంక్రాంతి సంబరాలు చేయడం విమర్శలకు కారణం అయ్యింది. నాలుగు రోజుల వేడుక కోసం సుమారు 65 లక్షలు SBI కేటాయించడాన్ని సీపీఎం ఆక్షేపిస్తోంది. అయితే, వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేయాలనే బలమైన కోరికతో ఉన్న జీవీఎల్.. దాదాపు ఏడాదిన్నర క్రితమే సాగర తీరంలో స్థిరనివాసం ఏర్పరుచుకుని పార్టీ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అయితే ఢిల్లీ లేకపోతే వైజాగ్ అనేంతగా జీవీఎల్ వ్యవహారం ఉంది. ఎన్నికల్లో పోటీపై కాన్ఫిడెంట్ గా ఉన్న ఈ ఎంపీ.. కలిసి వచ్చిన ప్రతీ వేదికను తనకు అనుకూలంగా మలుచుకుని విశాఖ ఓటర్లకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ దిశగా ఎదురయ్యే రాజకీయ విమర్శలను ఇగ్నోర్ చేయడం ద్వారా ఎంపీ అవ్వాలనే టార్గెట్ రీచ్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో మహా సంక్రాంతి పేరుతో ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్లో ట్రెడిషనల్ ఫెస్ట్ నిర్వహించారు జీవీఎల్. ఉత్తరాంధ్ర జానపద కళారూపాలకు, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా నిలిచే అనేక కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేయగా.. నగర వాసుల నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. కేంద్ర న్యాయ శాఖ సహాయ మంత్రి మేఘావల్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మహా సంక్రాంతి నిర్వహణ, ప్రమోషన్ ద్వారా వచ్చే ఎన్నికల కోసం జీవీఎల్ ప్రచారం ప్రారంభించినట్టే లెక్క. రాజకీయాలకు అతీతంగా ఈ వేడుకలు జరుగుతున్నట్టు చెబుతున్నప్పటికీ ఎంపీ జీవీఎల్ చుట్టూ విమర్శలు ముసురుకుంటున్నాయి. దీనికి కారణం, మహా సంక్రాంతి సంబరాల నిర్వహణ నిధుల్లో సింహాభాగం SBI నుంచి రావడమే. కార్పోరేట్ సోషల్ రెస్పాన్సి బులిటీ కోసం కేటాయించిన సుమారు 65 లక్షల రూపాయలను జీవీఎల్ కోరిక మేరకు సంబరాల కోసం ఖర్చు పెట్టారనేది సీపీఎం అభ్యంతరం. బడ్జెట్ కేటాయింపులు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుండగా.. టీమ్ జీవీఎల్ కౌంటర్ ఎటాక్ ప్రారంభించింది.. CSR నిధులను సాంస్కృతిక కార్యక్రమాలకు ఇవ్వ కూడదని ఎక్కడా లేదని.. అనవసర రాజకీయాలతో బురదజల్లొద్దని హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
తెలంగాణ Inter Advanced Supplementary Results విడుదల.. ఫస్ట్ ఇయర్లో 68.84%, సెకండ్ ఇయర్లో 49.29% ఉత్తీర్ణత.!
-
Intelligent Bird : ప్రపంచంలోనే అత్యంత తెలివైన పక్షి! దీనికి 5 ఏళ్ల పిల్లాడి తెలివితేటలు…
-
Mahabharat Facts: మహాభారత యుద్ధంలో పాల్గొనని ఈ నలుగురు మహా యోధులు.. వీళ్లు తలుచుకుంటే ఫలితం వేరేలా ఉండేది!
-
Israel-Shivaji statue: ఇజ్రాయెల్లో శివాజీ విగ్రహం..14మంది యూదులతో మొదలైన 2000ఏళ్ల చరిత్ర!
-
Fact Check: హీరోయిన్తో టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
ట్రెండింగ్
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!