Andhrapradesh: నేడు శ్రీకాళహస్తిలో బీజేపీ భారీ బహిరంగ సభ.. హాజరుకానున్న నడ్డా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Andhrapradesh: మోడీ తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన దేశాభివృద్ధిని వివరించేందుకు బీజేపీ తలపెట్టిన సభల్లో ఒకటి శనివారం సాయంత్రం శ్రీకాళహస్తిలోని భేరివారి మండపం వద్ద జరగనుంది. ఇవాళ శ్రీకాళహస్తిలో జేపీ నడ్డా అధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది. సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానుండడంతో పార్టీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా సభ ఏర్పాట్లు చేస్తున్నాయి. బీజేపీ అగ్ర నేతలు సోమువీర్రాజు, పురందేశ్వరి, సుజనా చౌదరి, కిరణ్కుమార్ రెడ్డి,సీఎం రమేష్, జీవీఎల్ నరసింహా రావు, టీజీ వెంకటేశ్, విష్ణువర్ధన రెడ్డి తదితరులు ఇప్పటికే తిరుపతి చేరుకున్నారు. శుక్రవారం రాత్రి 11గంటలకు తిరుపతి విమానాశ్రయం చేరుకున్న జేపీ నడ్డాకు పార్టీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన వెంట తిరుమల వెళ్లారు.శ్రీకృష్ణ గెస్ట్హౌస్లో బసచేసిన నడ్డా శనివారం ఉదయం 10గంటలకు శ్రీవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరుచానూరు రాహుల్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకుని చిత్తూరు జిల్లా బీజేపీ నేతలతో సమావేశమౌతారు.సాయంత్రం 3.40 గంటలకు శ్రీకాళహస్తి చేరుకుని శ్రీకాళహస్తీశ్వరస్వామిని దర్శించుకుంటారు.4.30 నుంచి 5.40గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ప్రత్యేక విమానం ద్వారా ఢిల్లీకి వెళ్తారు.
Read Also: Weather Report: తీవ్రమైన చలి, మండుతున్న వేడి, అకాల వర్షం.. 4 నెలల్లో 233 మరణాలు
Also Read
- Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
- Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
- Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
- Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
ఇదిలా ఉంటే తెలంగాణలోనూ బీజేపీ జాతీయ నేతల పర్యటన ఖరారైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సహా సీనియర్ బీజేపీ నేతలు ఈ నెలలో ఏపీలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 9ఏళ్లలో చేసిన పని గురించి ప్రజలకు తెలియజేయడానికి బహిరంగ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మోడీ ప్రభుత్వం చేస్తున్న పనులపై అవగాహన కల్పించేందుకు పార్టీ మహా జన్ సంపర్క్ అభియాన్, ప్రవాసీ యోజన ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించేందుకు అమిత్ షా జూన్ 15న ఖమ్మంలో పర్యటించనున్నారు. నాగర్కర్నూల్లో జేపీ నడ్డా బహిరంగ సభ నిర్వహించి కేసీఆర్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై దృష్టి సారించి, మోడీ ప్రభుత్వం చేస్తున్న పనులపై ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇటీవలి కర్ణాటక ఎన్నికల ఫలితాలతో కలత చెందిన పార్టీ క్యాడర్ను పునరుద్ధరించడానికి ఈ సమావేశాలు సహాయపడతాయని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీ నాయకులు మరియు క్యాడర్కు ఇప్పుడు కొంత శక్తిని కోరుకుంటున్నారని, జాతీయ నాయకుల రాష్ట్ర పర్యటనల ద్వారా ఇది సాధ్యమవుతుందని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: 33 ఏళ్లలో ఇలాంటి ప్రమాదం జరగలేదు.. ప్రైవేటీకరణ జరగకూడదన్నదే మా ఆకాంక్ష!
-
Hyderabad: మరోసారి రెచ్చిపోయిన నేపాలి గ్యాంగ్.. భారీగా బంగారం, వెండి, వజ్రాభరణాలు లూటీ.!
-
Ben Stokes: ఒక్క తప్పిదం.! కెప్టెన్ గానే కాదు.. జట్టులో స్థానం కూడా ప్రశ్నార్థకం..
-
Explained: లౌకికవాదం నుంచి హిందుత్వ వైపు.. బెంగాలీ మేధావుల మనసు ఎందుకు మారింది?
-
Darecation Explained: డబ్బులిచ్చి మరీ భయాన్ని కొంటున్నారు.. ట్రావెలింగ్లో నయా ట్రెండ్
ట్రెండింగ్
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!
-
7.7 మి.మీ. మందం, 5200mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే కేవలం రూ.11,999లకే.. Infinix Smart 20 లాంచ్.!
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!