BJP MLA Payal Shankar: గత ప్రభుత్వం తప్పులను శ్వేతపత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వివరించలేకపోయింది
గత ప్రభుత్వం ఏం తప్పులు చేసిందో శ్వేతపత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పలేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియాలో సమావేశంలో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పైడి రాకేష్ రెడ్డి, దన్ పాల్ సూర్యనారాయణ గుప్త పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలపై స్పందించారు. అసెంబ్లీలో తమకు మాట్లాడే సమయంలో ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. MIM కి గంటల తరబడి సమయం ఇచ్చారు… 8 మంది ఉన్న మాకు మాత్రం సమయం ఇవ్వలేదన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వము ఎక్కడ తప్పులు చేసిందో శ్వేత పత్రంలో చెప్పలేదు. లోతైన చర్చ జరగలేదు… జరిగిన అవినీతి పై సమగ్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం వివరించలేక పోయింది. లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన కాంగ్రెస్ కాళేశ్వరం మీద ఎందుకు చర్చ పెట్టలేదు.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన దగ్గర ఉన్న ఆధారాలన్నీటిని సీబీఐకి ఇవ్వాలి. సీబీఐ విచారణకు కేంద్రానికి లేఖ రాయాలి. మా పైన మోటార్లకు మీటర్లు పెడతారని కుట్రతో ఆ పార్టీ దుష్ప్రచారం చేసింది. మోటార్లకు మీటర్లు పెట్టి డబ్బులు వసూల్ చేయాలని కేంద్రం ఎప్పుడు చెప్పలేదని సభలో ఉత్తం కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికైనా brs నేతలు బుద్ది తెచ్చుకొని రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడారు. ‘ఆరోగ్యశ్రీ పథకం లో మోడీ బొమ్మ పెట్టాలి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. శ్వేత పత్రం ల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏమీ చెప్పదలచుకుంది. అక్బరుద్దీన్ ఒవైసీ బీజేపీ పై అక్కసు వెళ్లగక్కుతున్నారు’ అని పేర్కొన్నారు.
Also Read
- Uttam Kumar Reddy: ఖరీఫ్ కు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రికి మంత్రి ఉత్తమ్ లేఖ
- Congress Mega Rally: ‘ఓట్ చోరీ’ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.. హాజరుకానున్న ప్రముఖ నేతలు
- Raja Singh: టీడీపీ ఎమ్మెల్యేపై మండిపడ్డ తెలంగాణ ఎమ్మెల్యే
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!