BJP MLA Payal Shankar: గత ప్రభుత్వం తప్పులను శ్వేతపత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వివరించలేకపోయింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత ప్రభుత్వం ఏం తప్పులు చేసిందో శ్వేతపత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పలేదన్నారు బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియాలో సమావేశంలో ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, పైడి రాకేష్ రెడ్డి, దన్ పాల్ సూర్యనారాయణ గుప్త పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. అసెంబ్లీ సమావేశాలపై స్పందించారు. అసెంబ్లీలో తమకు మాట్లాడే సమయంలో ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. MIM కి గంటల తరబడి సమయం ఇచ్చారు… 8 మంది ఉన్న మాకు మాత్రం సమయం ఇవ్వలేదన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వము ఎక్కడ తప్పులు చేసిందో శ్వేత పత్రంలో చెప్పలేదు. లోతైన చర్చ జరగలేదు… జరిగిన అవినీతి పై సమగ్రంగా కాంగ్రెస్ ప్రభుత్వం వివరించలేక పోయింది. లక్షల కోట్ల అవినీతి జరిగిందని చెప్పిన కాంగ్రెస్ కాళేశ్వరం మీద ఎందుకు చర్చ పెట్టలేదు.
ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తన దగ్గర ఉన్న ఆధారాలన్నీటిని సీబీఐకి ఇవ్వాలి. సీబీఐ విచారణకు కేంద్రానికి లేఖ రాయాలి. మా పైన మోటార్లకు మీటర్లు పెడతారని కుట్రతో ఆ పార్టీ దుష్ప్రచారం చేసింది. మోటార్లకు మీటర్లు పెట్టి డబ్బులు వసూల్ చేయాలని కేంద్రం ఎప్పుడు చెప్పలేదని సభలో ఉత్తం కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికైనా brs నేతలు బుద్ది తెచ్చుకొని రాష్ట్ర ప్రజలకి క్షమాపణ చెప్పాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడారు. ‘ఆరోగ్యశ్రీ పథకం లో మోడీ బొమ్మ పెట్టాలి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి. శ్వేత పత్రం ల ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏమీ చెప్పదలచుకుంది. అక్బరుద్దీన్ ఒవైసీ బీజేపీ పై అక్కసు వెళ్లగక్కుతున్నారు’ అని పేర్కొన్నారు.
Also Read
- Uttam Kumar Reddy: ఖరీఫ్ కు సంబంధించిన అంశాలపై కేంద్ర మంత్రికి మంత్రి ఉత్తమ్ లేఖ
- Congress Mega Rally: ‘ఓట్ చోరీ’ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ.. హాజరుకానున్న ప్రముఖ నేతలు
- Raja Singh: టీడీపీ ఎమ్మెల్యేపై మండిపడ్డ తెలంగాణ ఎమ్మెల్యే
- Elections: జూబ్లీహిల్స్ ఎన్నికలకు సిద్ధమైన.. 407 పోలింగ్ బూత్ లు
తాజావార్తలు
-
Tickets Prices Hike: మరి ఇంత దారుణమా.. SRH vs RCB మ్యాచ్ టికెట్ ధరలు అంతలా పెంచేసారేంట్రా బాబు..!
-
AIADMK Crisis: అన్నాడీఎంకేలో మరింత ముదిరిన సంక్షోభం.. స్పీకర్తో విడివిడిగా ఇరు వర్గాల భేటీ
-
Jayam Ravi: 14 ఏళ్లు బానిసలా బతికా.. ‘నా పిల్లలను కూడా చూడనివ్వట్లేదు’ అంటూ ఏడ్చేసిన జయం రవి..
-
Minister Seethakka: 32 లక్షల మహిళలకు రుణాలు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు స్త్రీనిధి అండ
-
NEET Paper Leak Case: నీట్ పేపర్ లీక్ కేసు.. ఎన్టీఏను రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..