Bihar: బీహార్లో బీజేపీ-ఆర్జేడీ సీట్ల సర్దుబాటు.. నితీష్కు ఎన్ని సీట్లంటే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సార్వత్రిక ఎన్నికల ముందు ఇండియా కూటమి నుంచి ఎన్డీఏ కూటమిలోకి ఆర్జేడీ అధినేత నితీష్కుమార్ వెళ్లారు. అంతేకాదు.. బీజేపీ మద్దతుతో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. తాజాగా లోక్సభ ఎన్నికల సీట్ల సర్దుబాటుపై బీజేపీ-ఆర్జేడీ మధ్య ఒప్పందాలు జరిగాయి.
లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) భాగంగా బీహార్ (Bihar)లో ఎన్డీయే (NDA) భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చింది. నితీష్ కుమార్ సారథ్యంలోని జేడీయూకు 14 సీట్లను బీజేపీ ఆఫర్ చేయగా, చిరాగ్ పాశ్వాన్, పశుపతి పరస్కు-6 సీట్లు బీజేపీ ఆఫర్ చేసింది. ఉపేంద్ర కుష్వాహ, మాంఠీ (హెచ్ఏఎం)కు చెరో సీటు ఇవ్వనుంది. బీజేపీ 17 సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది.
Also Read
- Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
- PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
- Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. "డీలిమిటేషన్ బిల్లు" పై ఫోకస్..
- RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
ఎన్డీయే కూటమి పార్టీల మధ్య సీట్ల షేరింగ్ ఫార్ములాపై బీజేపీ ఎన్నికల కమిటీ మంగళవారం సమావేశమైంది. నిత్యానంద రాయ్, గిరిరాజ్ సింగ్, సుశీల్ మోడీ, సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హా, బీహార్ ఇన్చార్జి వినోద్ తావ్డే, రాధా మోహన్ సింగ్, నాగేంద్ర కుమార్, తారాకిషోర్ ప్రసాద్, నందకిషోర్ యాదవ్, ధర్మశీల గుప్తా, ప్రేమ్కుమార్, జానక్ రామ్, ప్రేమ్ రంజన్ పటేల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ, జేడీయూ, చిరాగ్ పాశ్వాన్ ఎల్జీపీలు ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్నారు. ఈసారి 2024లో బీజేపీ, జేడీయూతో పాటు ఉపేంద్ర కుష్వాహ (రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ), జితిన్ రామ్ మాంఝీ (హిందుస్థానీ అవామీ మోర్చా), లోక్ జనశక్తి పార్టీకి చెందిన రెండు వేర్వేరు పార్టీలు (పశుపతి పరస్, చిరాగ్ పాశ్వాన్) ఎన్డీయే భాగస్వామ్య పార్టీలుగా ఉన్నాయి.
ఇదిలా ఉంటే బీహార్లో 14 సీట్లతో పాటు జార్ఖండ్లోని ఛాత్ర సీటు, ఉత్తరప్రదేశ్లో ఫూల్పూర్ సీటును జేడీయూ కోరుతోందని.. దీనిపై చర్చలు జరుగుతున్నాయని బీజేపీ వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే ఇటీవలే 195 మందితో కూడిన తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ప్రధాని మోడీ వారణాసి నుంచి తిరిగి మూడోసారి పోటీ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల నోటిఫికేషన్కు ముందే అభ్యర్థులను ప్రకటించారు. మరోవైపు ప్రధాని మోడీ దేశ వ్యాప్తంగా చుట్టేస్తున్నారు. మరికొద్దిరోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది.
తాజావార్తలు
-
Arunachal Pradesh: ‘‘ఇది 1962 కాదు’’.. చైనాకు అరుణాచల్ సీఎం హెచ్చరిక..
-
PM Surya Ghar: సోలార్ విద్యుత్ దిశగా దేశం.. 40 లక్షల ఇళ్లకు చేరిన ‘పీఎం సూర్య ఘర్’ పథకం
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
-
CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
-
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!