BJP Ramchandar Rao : తెలంగాణలో స్వేచ్ఛ పోయింది.. గూండాయిజం నడుస్తోంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రజసంగ్రామ పేరిట పాదయాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే.. ఇటీవల ప్రజా సంగ్రామ యాత్ర మూడో దశ పాదయాత్రను యాదాద్రి నుంచి ప్రారంభించారు. అయితే.. రేపు మూడో దశ పాదయాత్ర ముగింపు నేపథ్యంలో వరంగల్లో బీజేపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. అయితే ఈ క్రమంలో వరంగల్లో ఎలాంటి సభలకు, ర్యాలీలకు అనుమతులు లేవంటూ.. వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి హెచ్చరికలు జారీ చేశారు. దీంతో బీజేపీ నేతలు హైకోర్టులో ఆశ్రయించి పిటిషన్ను దాఖలు చేశారు. అయితే.. దీనిపై బీజేపీ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు.. బీజేపీ సభకు ఆంక్షలతో కూడిన అనుమతులను జారీ చేసింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు మాట్లాడుతూ.. వరంగల్ పోలీస్ కమిషనర్ 30సిటీ పోలీసు యాక్ట్ పెట్టడం చట్ట, రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. రేపు హన్మకొండ ఆర్ట్స్ కళాశాలలో జేపీ. నడ్డా సభ నిర్వహిస్తామని, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. ఏ కార్యక్రమం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం హౌస్ అరెస్టులు చేస్తోందని, తెలంగాణలో ఎవరూ మంటలు పెడుతున్నారో కేసీఆర్ చెప్పాలన్నారు. కేసీఆర్ కుమార్తెను ఓడించాడని ఎంపీ అర్వింద్ ను నియోజకవర్గంలో తిరగనివ్వడం లేదంటూ ఆయన ఆరోపించారు. తెలంగాణలో స్వేచ్ఛ పోయింది… గూండాయిజం నడుస్తోందని ఆయన మండిపడ్డారు.
Also Read
- Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
- CM Revanth Reddy : ఎమ్మెల్యేలు జమీందార్లలా మారొద్దు.. పార్టీ కోసం పనిచేయాల్సిందే
- Ravindra Jadeja: రవీంద్ర జడేజాకు ఏమైంది.. మ్యాచ్ మధ్యలో ఎందుకు వెళ్లిపోవాల్సి వచ్చింది..?
- Russia-Taliban: రష్యా-ఆప్ఘనిస్థాన్ మధ్య సైనిక ఒప్పందం.. ఎవరికి ముప్పు పొంచి ఉందో..!
తెలంగాణలో టీఆర్ఎస్ మంటలు పెడుతుందని, బీజేపీలో చేరితే కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. ఈ వెయ్యి కిలోమీటర్లు పాదయాత్ర జరిగిన ఒక చిన్న సంఘటన జరగలేదని, జనగామ జిల్లాలో ఓ మంత్రి కావాలని పాదయాత్రపై దాడి చేయించారన్నారు. పార్టీకి వస్తున్న ఆదరణ తట్టుకోలేక పోతున్నారని, అమిత్ షా, జేపీ నడ్డా వస్తే ఎందుకు భయపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. ఆర్ట్స్ కళాశాలకు ఐదు లక్షలు కట్టిన తర్వాత బహిరంగ సభకు అనుమతి లేదంటున్నారని, చట్టాన్ని ఉల్లంఘించిన పోలీసు అధికారులపై అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటామన్నారు. హైకోర్టు అనుమతి ఇచ్చిన వరంగల్ కమిషనర్ 30వ తేదీ వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించవద్దు అంటున్నారన్నారు. ట్విట్టర్ టిల్లు జేపీ నడ్డా ఎవరని ప్రశ్నించారు… వొంగొంగి దండాలు పెట్టలేదా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజాస్వామ్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, పోలీసులను, అధికారులను ఉపయోగించుకుంటున్న కేసీఆర్.. బీజేపీపై ఈడీ, సీబీఐలను ఉపయోగించుకుంటోందని విమర్శిస్తున్నారన్నారు.
తాజావార్తలు
-
IPL 2026: క్వాలిఫయర్-2లో రాజస్థాన్పై గుజరాత్ ఘనవిజయం.. ఫైనల్లో బెంగళూరుతో ఢీ.!
-
OTR : తెలంగాణలో పెరిగిపోతున్న ఫ్రంటల్ పైరవీలు!
-
Story Board: కర్ణాటకలో సీఎం మార్పునకు కారణాలేంటి..?
-
Rahul Gandhi: ఆటో అవతారమెత్తిన రాహుల్ గాంధీ.. సమస్యలు పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ
-
Honor Win Turbo: హానర్ విన్ టర్బో రిలీజ్.. 10,000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరా
ట్రెండింగ్
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..
-
షియోమీ నుంచి కొత్త గాడ్జెట్స్ వచ్చేశాయ్.. Xiaomi Watch S5, Smart Band 10 Pro, Buds 6 లాంచ్.!
-
120x AI అల్ట్రా జూమ్ కెమెరాలు, 144Hz AMOLED డిస్ప్లే, 8K వీడియో రికార్డింగ్ వంటి ప్రీమియం ఫీచర్లతో Xiaomi 17T, 17T Pro లాంచ్..