BJP: ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మాకొట్టడంపై బీజేపీ విమర్శ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ముచ్చటగా ఐదోసారి ఈడీ విచారణకు డుమ్మాకొట్టారు. గతంలో నాలుగు సార్లు విచారణకు దూరంగా ఉన్నారు. తాజాగా శుక్రవారం కూడా ఆయన విచారణకు హాజరుకాలేదు. లిక్కర్ స్కామ్లో సీఎం కేజ్రీవాల్ను ఈడీ విచారణకు పిలిచింది. కానీ వరుసగా ఐదోసారి కూడా ఆయన విచారణకు హాజరు కాలేదు. దీంతో కేజ్రీవాల్పై బీజేపీ విమర్శలు గుప్పించింది.
లిక్కర్ స్కామ్లో తనకేమీ సంబంధం లేనట్టుగా.. ఒక నిస్సహాయుడిగా కేజ్రీవాల్ చూపించుకునే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ నేత హరీష్ ఖురానా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఒకవేళ ఈడీ సమన్లు చట్ట విరుద్ధమైతే కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు. ఉద్దేశపూర్వకంగా ఈడీ నోటీసులు ఇస్తుంటే.. కోర్టుకెళ్లి ఎందుకు కొట్టివేయించుకోవడం లేదని హరీష్ ఖురానా ప్రశ్నించారు.
Also Read
- Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
- RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
ఈడీ నోటీసులపై గతంలో కేజ్రీవాల్ స్పందిస్తూ.. ఈడీ సమన్లు చట్ట విరుద్ధమని కొట్టిపారేశారు. బీజేపీ ప్రేరేపితంతో ఈడీ నోటీసులు ఇస్తుందని కేజ్రీవాల్ ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల ముందు ఈడీ ద్వారా ఇబ్బంది పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తోందని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
లిక్కర్ స్కామ్లో నాలుగు సార్లు నోటీసులు ఇచ్చింది. గత నవంబర్ 2న, ఆ తర్వాత డిసెంబర్ 21, జనవరి 3, జనవరి 13న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు ఇచ్చింది. మరోసారి శుక్రవారం (2, ఫిబ్రవరి) విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొంది. కానీ ఐదోసారి కూడా కేజ్రీవాల్ డుమ్మాకొట్టారు.
లిక్కర్ కేసులో గత ఏప్రిల్లో దాదాపు 9 గంటల పాటు సీబీఐ కేజ్రీవాల్ను విచారించింది. కానీ నిందితుడిగా మాత్రం చేర్చలేదు. కానీ ఇదే కేసులో ఆప్ ముఖ్య నేతలు ఎంపీ సంజయ్సింగ్, మాజీ మంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేసింది. గతేడాది ఫిబ్రవరిలో సిసోడియా, అక్టోబర్లో సంజయ్సింగ్ అరెస్ట్ చేసి జైలుకు పంపించింది. పలుమార్లు బెయిల్ పిటిషన్లు కూడా రద్దు కావడంతో ఇంకా తీహార్ జైల్లోనే ఉన్నారు.
ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికల ముందు ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ను అరెస్ట్ చేసినట్టుగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేసి పార్టీని బలహీనపర్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు. వరుసగా ఐదోసారి కేజ్రీవాల్ డుమ్మాకొట్టారు. ఈడీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!