Ramchander Rao: బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? క్లారిటీ ఇచ్చిన బీజేపీ చీఫ్ రామచందర్రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ramchander Rao: గత కొన్ని రోజులుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల భగీరథ్ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఓ పక్క నిందితుడిపై చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్పై పార్టీ చర్యలు తీసుకుంటుందా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ ప్రశ్నకు తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు సమాధానమిచ్చారు. “బండి సంజయ్ తప్పు చేస్తే పార్టీ చర్యలు తీసుకుంటుంది. ఆయన తప్పు చేయలేదు. సంజయ్ కుటుంబసభ్యులు తప్పు చేస్తే న్యాయపరంగా చూసుకుంటారు. ముందస్తు బెయిల్ తీసుకోవడం అనేది హక్కు. పారిపోలేదు. బెయిల్ పెండింగ్లో ఉంది. భగీరథ్ సరెండర్ అయ్యాడు. బీఆర్ఎస్కు ఇంకో పని లేనట్టు ఉంది. కోట్లు ఖర్చు చేసి బండి సంజయ్, ఆయన కుమారుడికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు.” అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్రావు వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా.. పోక్సో కేసులో నిందితుడు భగీరథ్ నేరం అంగీకరించాడని సైబరాబాద్ కమిషనర్ తెలిపారు. లుక్ అవుట్ నోటీసులు, గాలింపు అనంతరం పోలీసులు భగీరథ్ ను అదుపులోకి తీసుకున్నారు. న్యాయవాదుల సమక్షంలో లొంగిపోయాడని బండి సంజయ్ ప్రకటించగా, పోలీసులు అరెస్ట్ చేశామన్నారు. నిందితుడు నేరం అంగీకరించాక అరెస్ట్, 14 రోజుల రిమాండ్ విధించారు. ఇక ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. భగీరథ్ స్నేహితులను పోలీసులు విచారించారు. సిట్ భగీరథ్ స్నేహితుల స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఘటన రోజు ఏం జరిగిందో స్నేహితులు నుంచి వివరాలు తెలుసుకున్నారు. భగీరథ్ను కస్టడీలోకి తీసుకొని విచారించాలని సిట్ భావిస్తోంది. ఈ మేరకు మేడ్చెల్ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనుంది. అరెస్టు రోజు భగీరథ్ను పూర్తి స్థాయిలో విచారించడానికి సమయం దొరకలేదని సిట్ వాదిస్తోంది. కస్టడీలోకి తీసుకొని ఫిర్యాదులో పేర్కొన్న అంశాలపై విచారించాలని సిట్ భావిస్తోంది.
Also Read
- Trump: హార్ముజ్ నుంచి నౌకలు బయల్దేరాయి.. ప్రపంచ దేశాలకు గుడ్న్యూస్ చెప్పిన ట్రంప్
- India A vs Sri Lanka A: వైభవ్ సూర్యవంశీ-శ్రీలంక ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం.. మ్యాచ్ అనంతరం ఉద్రిక్తత..!
- Pawan Kalyan: దేశం ముందా.. పార్టీ ముందా? జనసేన స్పష్టమైన సందేశం
- Karnataka: మైసూర్ పబ్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి.. పలువురికి సీరియస్
తాజావార్తలు
-
Trump: హార్ముజ్ నుంచి నౌకలు బయల్దేరాయి.. ప్రపంచ దేశాలకు గుడ్న్యూస్ చెప్పిన ట్రంప్
-
HYDRAA : హైడ్రా బిగ్ అప్డేట్.. 140 కొత్త వాహనాలకు గ్రీన్ సిగ్నల్.!
-
Samantha: ‘ఇప్పుడు నేను ఒంటరిదాన్ని కాదు’.. సమంత
-
India A vs Sri Lanka A: వైభవ్ సూర్యవంశీ-శ్రీలంక ఆటగాళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం.. మ్యాచ్ అనంతరం ఉద్రిక్తత..!
-
Pawan Kalyan: దేశం ముందా.. పార్టీ ముందా? జనసేన స్పష్టమైన సందేశం
ట్రెండింగ్
-
Rainy Season Tips : వానాకాలంలో తప్పక తినాల్సిన 7 పండ్లు.!
-
Home Remedies : బంగాళాదుంప తొక్కలు పారేయొద్దు.. అందానికి బంగారు చిట్కా.!
-
HMD Vibe 2 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
11,000mAh బ్యాటరీతో రికార్డు దిశగా HONOR X80 Pro Max ఎంట్రీ.!
-
IND vs PAK: భారత్-పాక్ మ్యాచ్లో ఆటగాళ్ల మధ్య గొడవ.. వీడియో వైరల్.. ఇంతకీ ఏం జరిగిందంటే?