Uttarpradesh : 33గంటల పాటు ప్రాణాలతో పోరాడి ఓడిన టీచర్.. స్టూడెంట్ చేతిలో హతం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarpradesh : ఉత్తర్ప్రదేశ్లోని బిజ్నోర్లో ఓ విద్యార్థి దారుణానికి ఒడిగట్టాడు. తన టీచర్ను తుపాకీతో కాల్చాడు. ఆ తర్వాత ఆమె ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడింది. కానీ 33 గంటల తర్వాత మహిళా ఉపాధ్యాయురాలు మరణించింది. నిజానికి ఆపరేషన్ తర్వాత కూడా గాయపడిన టీచర్ శరీరం నుంచి బుల్లెట్ ను వైద్యులు బయటకు తీయలేకపోయారు. దీంతో టీచర్ ప్రాణాలొదిలింది. తన పై వన్ సైడ్ లవ్ ఉన్న తన విద్యార్థి ప్రతిపాదనను ఆమె అంగీకరించకపోవడమే తప్పు.
బిజ్నోర్లోని ఓ కంప్యూటర్ సెంటర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ 25 ఏళ్ల కోమల్ కంప్యూటర్ సెంటర్లో బోధించేవారు. రోజూలాగే శుక్రవారం కూడా క్లాస్కి చేరుకుంది. ఆమె పూర్వ విద్యార్థి ఒకరు కూడా తరగతికి హాజరయ్యేందుకు అక్కడికి వచ్చారు. క్లాస్ జరుగుతుండగా ఒక్కసారిగా ప్రశాంత్ టీచర్ పై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయాడు. రక్తంతో తడిసిన టీచర్ ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో మీరట్కు తరలించారు. శుక్రవారం నాడు ఆమెకు ఆపరేషన్ జరిగింది. రక్తస్రావం ఎక్కువ కావడంతో రక్తాన్ని ఎక్కించారు.
Also Read
- 'The Hundred'లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
- AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
- CM Vijay and Trisha Controversy: ఆలయ ఉత్సవాల్లో త్రిష, విజయ్ ఫొటోలతో వివాదాస్పద ఫ్లెక్సీ.. ఇద్దరిపై కేసు
- Lalit Kumar Modi: ఐపీఎల్ 2009 ఫెమా కేసులో క్లీన్ చిట్.. ఆనందంతో డాన్స్ చేస్తూ రచ్చ రచ్చ.!
Read Also:PBKS vs CSK: పంజాబ్తో పోరుకు సిద్ధమైన చెన్నై.. ప్లేఆఫ్ రేసులో నిలిచెదెవ్వరో..
చికిత్స సమయంలో రక్తస్రావం ఆగిపోయింది. కానీ బుల్లెట్ బయటకు రాలేదు. దాదాపు 32 గంటల 51 నిమిషాల పాటు చావుబతుకుల మధ్య పోరాడి కోమల్ మృతి చెందారు. మరోవైపు నిందితుడు విద్యార్థి ప్రశాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేరానికి ఉపయోగించిన పిస్టల్ను యువకుడు రచిత్ నుంచి నాలుగేళ్ల క్రితం కొన్నట్లు నిందితుడు ప్రశాంత్ తెలిపాడు. నిందితుడు ప్రశాంత్ తండ్రి లవకుష్ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ప్రశాంత్ 2022లో కంప్యూటర్ సెంటర్లో కోర్సు చేస్తున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ సమయంలో అతను కోమల్తో ప్రేమలో పడ్డాడు. తన టీచర్ కోమల్ కు కూడా చాలాసార్లు ప్రపోజ్ చేశాడు. కానీ కోమల్ అతని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇదొక్కటే ప్రశాంత్ని కలవరపెట్టింది. ఆమెను ద్వేషించడం మొదలుపెట్టాడు. తిరస్కరణకు ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ఆ తర్వాత హత్య చేసి తన కోపాన్ని బయట పెట్టుకున్నాడు. ప్రస్తుతం అతడు పోలీసుల అదుపులో ఉన్నాడు. అతడిని నిరంతరం విచారిస్తున్నారు. మరోవైపు కంప్యూటర్ సెంటర్ క్లాస్రూమ్లోకి ప్రవేశించిన టీచర్పై కాల్పులు జరపడంతో విద్యార్థుల్లో భయం నెలకొంది. దీంతో శనివారం కంప్యూటర్ సెంటర్లో విద్యార్థుల హాజరు తక్కువగా నమోదైంది.
Read Also:Bharateeyudu 2 : శంకర్ సార్.. ఇంకెన్ని షాక్ లు ఇస్తారు..?
తాజావార్తలు
-
SPIRIT Karnataka Rights : ‘స్పిరిట్’ కన్నడ రైట్స్ కొనుగోలు చేసిన బడా నిర్మాణ సంస్థ
-
‘The Hundred’లో రోహిత్ శర్మ.! MI లండన్ ఘన విజయం.!
-
Trump 200% Tariff: ట్రంప్ సంచలన నిర్ణయం.. జెనరిక్ మందులపై 200% టారిఫ్.. భారత ఫార్మా పరిశ్రమపై భారీ ప్రభావం?
-
AP Coronavirus Cases: ఏపీలో భయపెడుతోన్న కరోనా..! పర్యాటకులపై ఆంక్షలు
-
NBK : ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్కు బాలయ్య.. షూటింగ్ కు బ్రేక్
ట్రెండింగ్
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!