Bridge Collapse: చూస్తుండగానే కుప్పకూలిన బ్రిడ్జీ.. రూ.కోట్లు నీళ్ల పాలు.. వారంలో రెండో ఘటన
- బిహార్లో కుప్పకూలిన మరో బ్రిడ్జీ
- కూలిన గండక్ కెనాల్పై నిర్మించిన వంతెన
- నిలిచిపోయిన పలు గ్రామాలకు రాకపోకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bridge Collapse: బీహార్లో మరో వంతెన కూలింది. సివాన్ జిల్లాలోని గండక్ కెనాల్పై నిర్మించిన వంతెన శనివారం కుప్పకూలింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. వంతెన కూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ వంతెన పాతదని ఓ అధికారి తెలిపారు. వంతెన కూలిపోవడంతో సమీపంలోని డజన్ల కొద్దీ గ్రామాలతో కనెక్టివిటీ కోల్పోయింది. జిల్లాలోని దారుండా బ్లాక్లోని రామ్గర్హ పంచాయతీలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం.. వంతెన చాలా పాతది చెబుతున్నారు.
Read Also:Hungary Govt: మీకు కనీసం నలుగురు పిల్లలుంటే.. జీవితాంతం ట్యాక్స్ కట్టొద్దు..
Also Read
- Housing Scheme: సొంతిళ్లు లేని వారికి శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..
- Oppo New Mobile: 10,000mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. లాంచ్కు ముందే లీకైన ఒప్పో A7 ప్రో మాక్స్ ఫీచర్స్ ఇవే..
- Ruturaj Gaikwad: ఎట్టకేలకు బంపర్ ఆఫర్ కొట్టేసిన రుతురాజ్ గైక్వాడ్.. కెప్టెన్గా నియామకం..
- Telangana Health: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ.. రూ.200 కోట్లు అదనపు నిధులు ప్రకటన..
29 ఏళ్ల క్రితం బీహార్ ప్రభుత్వం ఈ వంతెనను నిర్మించిందని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ శాఖ కొద్ది రోజుల క్రితం కాలువను శుభ్రం చేసింది. అలాగే కాల్వలోని మట్టిని తవ్వి కాల్వ కట్టపై పోశారు. దీంతో వంతెన పునాది బలహీనంగా మారిందని గ్రామస్తులు చెబుతున్నారు. బ్రిడ్జి తెగి కాలువలో పడిపోయింది. ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ విషయంపై ప్రతిపక్షాలు నితీష్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. రాష్ట్రీయ జనతాదళ్ సోషల్ మీడియా వేదికగా.. ప్రతి వారం ఏదో ఒక వంతెన కూలిపోవడం 100శాతం ఖాయం అని రాసుకొచ్చారు.
देख लीजिए डबल इंजन की सरकार के कारनामे!
हर हफ्ते कोई ना कोई पुल गिरना 100% तय ही माना जाता है!
कमीशनखोरी, अफसरशाही और भ्रष्टाचार का ऐसा दुर्लभ प्रदर्शन दुनिया में और कहीं नहीं दिखेगा!
सिवान: pic.twitter.com/LEtlsCafEJ
— Rashtriya Janata Dal (@RJDforIndia) June 22, 2024
Read Also:Budget 2024: రాష్ట్రాల ఆర్థికమంత్రులతో నిర్మలా సీతారామన్ సమావేశం..(వీడియో)
వంతెన కూలిపోవడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. గండక్ కాలువపై నిర్మించిన ఈ వంతెన మహారాజ్గంజ్ బ్లాక్లోని పటేధి బజార్.. దారుండా బ్లాక్లోని రామ్గఢ్ పంచాయతీని కలుపుతుంది. ఈ వంతెన సహాయంతో వేలాది మంది ప్రజలు ఒక వైపు నుండి మరొక వైపుకు వెళ్లేవారు, కానీ ఇప్పుడు ప్రజలు సమీపంలోని గ్రామానికి వెళ్ళడానికి కూడా చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది. పాఠశాలకు వెళ్లేందుకు పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, తక్కువ సమయంలో ఒకవైపు నుంచి మరో వైపుకు వెళ్లే వృద్ధులు ఇప్పుడు దాటలేరని గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వంతెన కూలిపోవడంతో వారు ఒకచోటి నుంచి మరోచోటుకు చాలా దూరం ప్రయాణించాల్సి రావడంతో వారి రోజువారీ పనులకు ఆటంకం ఏర్పడుతోంది. వంతెన కూలిన ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. ఇటీవల అరారియాలోని బక్రా నదికి చెందిన పదరియా ఘాట్పై నిర్మించిన వంతెన కూడా ఒక్కసారిగా కుప్పకూలింది. బక్రా నదిపై నిర్మించిన బ్రిడ్జి ప్రారంభోత్సవం జరగకపోవడం విశేషం.
తాజావార్తలు
-
Nagarjuna: “ఈ అరుపుల కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురుచూశాడు”.. ‘లెనిన్’ సక్సెస్ మీట్లో నాగార్జున ఎమోషనల్!
-
Housing Scheme: సొంతిళ్లు లేని వారికి శుభవార్త.. రేపటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం..
-
Nag Chaitanya: ‘ఆ రోజు నుంచే అఖిల్ నా హీరో’.. తమ్ముడిపై నాగచైతన్య ఎమోషనల్ కామెంట్స్!
-
Public Charging: రైల్వే స్టేషన్లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా? జర జాగ్రత్త.. మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావచ్చు!
-
Akhil Akkineni : మూడో రోజుకి బ్రేక్ ఈవెన్ అవ్వడం చాలా చాలా రోజుల తర్వాత జరిగింది
ట్రెండింగ్
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?
-
Paneer Tikka Recipe: ప్రోటీన్ రిచ్ ఫుడ్.. టేస్టీ “పన్నీర్ టిక్కా”ను ఇంట్లో సులువుగా చేసేయండి ఇలా.!