Car Accident: బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి.. ఇద్దరికి గాయాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Car Accident: బీహార్లో మాధేపురా డీఎం కారు ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. కాగా ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఫుల్పరాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతోంది. డీఎం కారు మాధేపురా వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సమయంలో వాహనం అదుపు తప్పింది. దీంతో రోడ్డు పక్కన పనిచేస్తున్న కూలీలను కారు ఢీకొట్టింది. ఈ సమయంలో ఓ కూలీ, మహిళ, చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన అనంతరం డీఎం, డ్రైవర్ కారు వదిలి పారిపోయారు. దీంతో ఆగ్రహించిన గుంపు డీఎం కారును ధ్వంసం చేసింది.
Read Also:Dangerous Travel: బస్సు టాప్ పై కూర్చొని విద్యార్థుల ప్రయాణం.. పట్టించుకోని డ్రైవర్, కండక్టర్
Also Read
- CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
- 600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
- Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
- IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రమాదం జరిగిందని, ప్రమాదం జరిగిన వెంటనే డీఎం, సిబ్బంది బైక్పై పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వాహనం మొదట మహిళ, బిడ్డను ఢీకొట్టిందని తరువాత NH-57లో పనిచేస్తున్న కార్మికులను ఢీకొట్టిందని ఆయన చెప్పారు. కూలీలు రాజస్థాన్ వాసులు. గాయపడిన ఇద్దరినీ చికిత్స కోసం దర్భంగా మెడికల్ కాలేజీ, ఆసుపత్రికి తరలించారు. అందులో ఒకరు మరణించారు. ఈ ప్రమాదంలో మొత్తం ముగ్గురు మృతి చెందారు. ఇందులో 27 ఏళ్ల గురియా దేవి, ఆమె 7 ఏళ్ల కూతురు కూడా ఉన్నారు. డిఎంసిహెచ్లో మృతి చెందిన కార్మికుడిని రాజస్థాన్కు చెందిన అశోక్ సింగ్గా గుర్తించారు.
Read Also:Sandra Venkata Veeraiah: పార్టీలు మారి ఇయ్యాల డైలాగులు కొడుతున్నారు.. తుమ్మల పై సండ్ర ఫైర్….
ప్రమాదం జరిగిన వెంటనే వందలాది మంది గుమిగూడి వాహనాన్ని ధ్వంసం చేసి ఎన్హెచ్-57ను అడ్డుకున్నారు. వాహనంలో ఉన్న వారిని అరెస్ట్ చేయాలని, బాధితులకు తగిన పరిహారం ఇవ్వాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా డీఎంను సంప్రదించలేకపోయారు. అయితే డిఎం కార్యాలయంలోనే ఉన్నారని మాధేపురా జిల్లా ప్రజాసంబంధాల అధికారి తెలిపారు.
తాజావార్తలు
-
CM Chandrababu: సీఎం చంద్రబాబు బంపరాఫర్.. మూడో బిడ్డకు రూ.30 వేలు, నాలుగో బిడ్డకు రూ.40 వేలు..
-
Honda Hybrid Sedan: హోండా నెక్స్ట్ జనరేషన్ హైబ్రిడ్ సెడాన్.. 10% ఎక్కువ మైలేజ్, 30% తక్కువ ఖర్చు!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
-
IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..