Bihar Elections 2025: బీహార్ ఎన్నికల్లో ఫ్యామిలీ వార్.. అభ్యర్థులను ప్రకటించిన లాలూ పెద్ద కుమారుడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bihar Elections 2025: దేశ వ్యాప్తంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. ఇప్పటికే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు జోరందుకున్నాయి. ఆ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పులు సంచలనాలు సృష్టిస్తున్నాయి. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ నుంచి తన పెద్ద కుమారుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపింది. ఆర్జేడీ నుంచి సస్పెండ్ చేయడంతో తేజ్ ప్రతాప్ యాదవ్ ఏకంగా సొంత పార్టీ పెట్టుకొని ఈ ఎన్నికల బరిలోకి దిగారు. తాజాగా ఆయన తన పార్టీ జనశక్తి జనతాదళ్ పార్టీ నుంచి పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో ఆయన ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారో కూడా ఉంది.
READ ALSO: Delhi : పీఎం మోడీతో సీఎం చంద్రబాబు కీలక భేటి
Also Read
- Noam Shazeer: గూగుల్కు బిగ్ షాక్.. జెమిని ఏఐ కీలక రూపశిల్పి రాజీనామా.. ఓపెన్ AI గూటికి టెక్ జీనియస్!
- Pakistan: బంగాళాఖాతంపై పాకిస్థాన్ కన్ను.. భారత్కు సముద్ర సరిహద్దుల్లో కొత్త సవాల్?
- Kakatia Hills Land Case: మాదాపూర్ కాకతీయ హిల్స్ భూ వివాదం.. అయ్యన్న ఇన్ఫ్రా ఎండీ శ్రీధర్ అరెస్ట్!
- Ragi Ganji: శరీరానికి చల్లదనం, ఎముకలకు బలం.. సాంప్రదాయ 'రాగి గంజి' తయారీ చేసుకోండి ఇలా.!
మహువా అసెంబ్లీ నుంచి బరిలో దిగిన తేజ్ ప్రతాప్ యాదవ్
తేజ్ ప్రతాప్ యాదవ్ పార్టీ జనశక్తి జనతాదళ్ నుంచి 21 మంది అభ్యర్థులు పోటీ చేయనున్న అసెంబ్లీ స్థానాలను తెలిపారు. ఆయన స్వయంగా మహువా అసెంబ్లీ స్థానానికి పోటీ చేయనున్నట్లు ఈ జాబితాలో ప్రకటించారు. తేజ్ ప్రతాప్ యాదవ్ గతంలో మహువా అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. తాజా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా ఆయన ఈ స్థానం నుంచే బరిలో దిగనుండటంతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. జనశక్తి జనతాదళ్ (జెడి) పార్టీ అనేక మంది కొత్త, యువ ముఖాలతో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఎన్నికల్లో ప్రజా సమస్యలను ప్రశ్నిస్తూ పోటీ చేస్తామని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈసందర్భంగా తేజ్ ప్రతాప్ యాదవ్ మాట్లాడుతూ.. యువతకు రాజకీయాల్లో కొత్త దిశానిర్దేశం చేయడం, బీహార్ను అభివృద్ధి పథంలో నడిపించడమే తమ పార్టీ లక్ష్యమని చెప్పారు. జనశక్తి జనతాదళ్ సామాన్య ప్రజల గొంతుకగా ఉంటుందని, అవినీతి, నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యలపై బహిరంగంగా పోరాడుతుందని పేర్కొన్నారు.
తేజ్ ప్రతాప్ యాదవ్ అభ్యర్థాల జాబితా విడుదల చేయడం అనేది బాహాటంగా తన తండ్రికి, ఆర్జేడీకి సవాలు విసరడమే కాకుండా బీహార్ ఎన్నికల డైనమిక్స్పై కూడా ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తేజ్ ప్రతాప్ యాదవ్ 2015లో తొలిసారిగా ఎమ్మెల్యేగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నియోజకవర్గం మహువా. ఈ కొత్త జనశక్తి జనతాదళ్ (జెడి) జాబితా విడుదలతో, బీహార్ రాజకీయాల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని అంటున్నారు. తేజ్ ప్రతాప్ తాజాగా నిర్ణయం రాజకీయ వర్గాల్లో పెద్ద సంచలనం అంటున్నారు. ఆయన అభ్యర్థులతో ఏ కూటమికి నష్టం వస్తుందో ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
READ ALSO: Victor Noir Grave: మతితప్పినదా.. మదమెక్కినదా? సమాధిపై ఆ పాడు పనులు ఏంటి!
తాజావార్తలు
-
Noam Shazeer: గూగుల్కు బిగ్ షాక్.. జెమిని ఏఐ కీలక రూపశిల్పి రాజీనామా.. ఓపెన్ AI గూటికి టెక్ జీనియస్!
-
MRP Violation Case: MRP కంటే రూ.20 ఎక్కువ వసూలు.. దుకాణదారుడు, కంపెనీకి కోర్టు రూ.10 లక్షల జరిమానా
-
Diwali Clash : దీపావళికి మాజీ మామతో పోటీ పడుతున్న అల్లుడు
-
Pakistan: బంగాళాఖాతంపై పాకిస్థాన్ కన్ను.. భారత్కు సముద్ర సరిహద్దుల్లో కొత్త సవాల్?
-
India Women History: టీ20 ప్రపంచకప్లో భారత్ చరిత్రాత్మక ఘనత.. రికార్డు పుస్తకాల్లో హర్మన్ సేన!
ట్రెండింగ్
-
Shubman Gill: డబుల్ సెంచరీపై కన్నేశా కానీ.. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kitchen Tips : చపాతీ ఎక్కువ సేపు మెత్తగా ఉండాలంటే.. పిండి కలిపేటప్పుడు ఈ చిట్కాలను పాటించండి.!
-
Chicken Bones : చికెన్ తిన్నాక ఎముకలను పారేస్తున్నారా.? వాటితో ఎన్నో ప్రయోజనాలు.!
-
Hair Care Tips : జుట్టు త్వరగా జిడ్డుగా మారుతోందా? ఈ సింపుల్ టిప్స్తో రోజంతా ఫ్రెష్గా!
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!