Divvela Madhuri Controversy: తిరుమలలో రీల్స్ వివాదంతో ఇప్పటికే కేసు ఎదుర్కొంటున్న బిగ్బాస్ కంటెస్టెంట్ మాధురి మరోసారి వివాదంలో నిలిచారు. తిరుమలలో పుట్టినరోజు వేడుకలు నిర్వహించడంతో ఆమెపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ పరిసరాల్లో నిబంధనలకు విరుద్ధంగా కేక్ కట్ చేయడం ఈ వివాదానికి కారణమైంది.
Thala For A Reason: 7 వికెట్లు, 7 పరుగులు.. భారత్ విజయంలో ‘7’ సెంటిమెంట్.. ధోని ఫ్యాన్స్ ఫిదా?
వివరాల ప్రకారం.. బిగ్బాస్ ఫేమ్ తనూజ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాధురి స్వయంగా తనూజతో కేక్ కట్ చేయించారు. అయితే తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిబంధనల ప్రకారం ఆలయ పరిసరాల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అనుమతించబడదు. దీంతో ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది.
Sakshi Dhoni Reaction: ‘సాక్షి’ అత్యుత్సాహం.. ‘కామ్ డౌన్’ అంటూ ధోనీ క్యూట్ రియాక్షన్.. వీడియో వైరల్!
ఇదిలా ఉండగా.. తిరుమలలో రీల్స్ చేసిన కేసులో మాధురి గురువారం తిరుపతి కోర్టులో హాజరయ్యారు. ఆమెతో పాటు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కూడా కోర్టుకు వచ్చారు. ఈ కేసును రెండవ అదనపు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి కోటేశ్వరరావు విచారించారు. తిరుమల వన్టౌన్ పోలీసులు నమోదు చేసిన కేసులో మాధురి కోర్టు ఎదుట హాజరయ్యారు. విచారణ సందర్భంగా కోర్టు మే 12న ఇద్దరు జామీనుదారులతో పాటు జామీను పత్రాలను సమర్పించాలని ఆదేశించింది.