BC Janardhan Reddy: కాటసాని రామిరెడ్డికి భారీ షాక్.. టీడీపీలో చేరిన కొలిమిగుండ్ల కీలక వైసీపీ నేతలు…!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి నాయకత్వానికి మద్ధతుగా ఇతర పార్టీల నుంచి వలసలు షురూ అయ్యాయి. తాజాగా కొలిమిగుండ్లలో అధికార వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. ఈరోజు (ఆదివారం) బనగానపల్లె టీడీపీ కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమంలో వైసీపీ కీలక నేత, కొలిమిగుండ్ల పట్టణ ఉపసర్పంచ్ పెద్ద నాగయ్య ఆధ్వర్యంలో గిత్తన్న గారి నాగేశ్వరావు, కుళ్ళే నాగకుళాయి, తలారి శ్రీనివాసులు, తలారి చెన్నకేశవ, తలారి చంద్రగోపాల్, తలారి వెంకట సుధాకర్, తలారి చెన్నయ్య వంటి ద్వితీయ శ్రేణి వైసీపీ నాయకులతో సహా మరో 50 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్థన్ రెడ్డి సమక్షంలో వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్నారు.
Coimbatore Car Blast: కోయంబత్తూర్ పేలుడు కేసు.. 21 చోట్ల ఎన్ఐఏ దాడులు, నలుగురి అరెస్ట్..
Also Read
- Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
- Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
- RAW NTR Controversy: NTR అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ..! RAW NTR గిఫ్ట్పై సస్పెన్స్..
- 185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
ఈ సందర్భంగా కొలిమిగుండ్ల ఉపసర్పంచ్ పెద్ద నాగయ్య మాట్లాడుతూ.. బీసీ జనార్దన్ రెడ్డి మంచితనం మూర్తీభవించిన వ్యక్తి అని కొనియాడారు. బనగానపల్లె నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే అది ఒక్క బీసీ జనార్దన్ రెడ్డితోనే సాధ్యమని, అందుకనే వైసీపీని వీడి టీడీపీలో చేరడం జరిగిందని తెలిపారు. 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడుని, బనగానపల్లె శాసన సభ్యులుగా బీసీ జనార్ధన్ రెడ్డిని గెలిపించుకోవడమే తమ ధ్యేయమని కార్యకర్తల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు.
Sundeep Kishan: ముగ్గురు హీరోయిన్స్ తో బ్రేకప్ గ్రేట్ కాదు.. సీక్రెట్ గా మెయింటైన్ చేశావ్ చూడు
అనంతరం బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికి ఏ కష్టం వచ్చిన అండగా ఉంటామని, పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. చంద్రబాబుతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు సంక్షేమం.. ఇటు అభివృద్ధి సాధ్యమని తెలిపారు. మనం అందరం కలిసికట్టుగా చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుందాంమని పిలుపునిచ్చారు. మొత్తంగా ఎన్నికలకు ముందు బీసీ జనార్థన్ రెడ్డి రాజకీయ చాణక్యంతో రోజురోజుకీ వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు షురూ అవుతున్నాయి. దీంతో టీడీపీ క్యాడర్ కదనోత్సాహంతో ఎన్నికల క్షేత్రంలోకి దూసుకువెళుతుండగా.. ఇన్నాళ్లు కాటసాని రామిరెడ్డి వంట నడిచిన కీలక నేతలు సైకిలెక్కడంతో వైసీపీ క్యాడర్ డీలా పడిందని, రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి ఎదురీత తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తాజావార్తలు
-
Aditya Dhar: ‘ధురందర్’ తర్వాత ఆదిత్య ధర్కు మరో భారీ ఛాన్స్.. అస్సాం వీరుడి జీవితకథపై సినిమా?
-
Boss Scam: వాట్సాప్, ఏఐ వాయిస్తో మోసం.. ‘బాస్ స్కామ్’పై సెబీ హెచ్చరిక..
-
Anna Lezhneva: అప్పుడు కొడుకు కోసం.. ఇప్పుడు భర్త కోసం.! కాలినడకన తిరుమల కొండెక్కిన డిప్యూటీ సీఎం భార్య.!
-
Vikram-1: విక్రమ్-1 రాకెట్లో అంతరిక్షంలోకి ప్రధాని మోడీ చేతిరాత పోస్ట్కార్డ్.. చరిత్ర సృష్టించనున్న మిషన్ ఆగమన్
-
Illicit Relationship: భార్య వివాహేతర సంబంధం.. మరో భర్త బలి.! పామునే ఆయుధంగా..
ట్రెండింగ్
-
185Hz OLED డిస్ప్లే, లిక్విడ్ కూలింగ్తో పవర్ఫుల్ గేమింగ్ ట్యాబ్లెట్ REDMAGIC Astra 2 లాంచ్..!
-
9000mAh బ్యాటరీ, 12.2 అంగుళాల 2.8K 144Hz OLED డిస్ప్లేతో రాబోతున్న ASUS ప్యాడ్ (T3201).!
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!