Bhumana Karunakar Reddy: 1995 సీబీఎన్ సూపర్.. ఇప్పటి సీబీఎన్ చాలా దారుణం!
- పవన్ కల్యాణ్పై భూమన కరుణాకర్ రెడ్డి సెటైర్లు
- పవన్ కళ్యాణ్ నిద్రపోయి చాలా కాలమైంది
- 1995 సీబీఎన్ సూపర్.. ఇప్పటి సీబీఎన్ చాలా దారుణం
- టీడీపీ, జనసేన పార్టీలు ఏమి చేస్తున్నాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సెటైర్లు వేశారు. రైతులకు న్యాయం చేయకుండా.. పవన్ నిద్రపోతున్నారన్నారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నంత కాలం పవన్ నిద్రపోతానే ఉంటారు ఏమో? అని ఎద్దేవా చేశారు. అసత్య ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట అని పేర్కొన్నారు. వైఎస్ జగన్ అధికారంలో ఉండి ఉంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదున్నారు. 1995లో సీబీఎన్ బాగుండేదని.. ఇప్పటి సీబీఎన్ చాలా దారుణం అని విమర్శించారు. చంద్రబాబు మామిడి రైతుల సమస్యలు తీర్చకుండా వైసీపీ నేతలను తిట్టుకుంటూ కూర్చున్నాడని భూమన మండిపడ్డారు.
తిరుపతిలో మీడియా సమావేశంలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ… ‘రాష్ట్రంలో గిట్టుబాటు ధర లేక మామిడి రైతులు అల్లాడిపోతున్నారు. లక్షల హెక్టార్లలో వేసిన మామిడి పంటను ఎమీ చేసుకోవాలో తెలియక రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది. సీఎం చంద్రబాబు మామిడి రైతులకు తీరని ద్రోహం చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం పైన కేంద్రం ప్రభుత్వం ఉంది, బాబు ఎందుకు అడగలేదు. కర్నాటకలో జేడీఎస్ పార్టీ అధినేత కూమారస్వామీ మామిడి రైతులను ఆదుకోవాలని కేంద్రం మంత్రి శిరాజ్ సింగ్ చౌహన్కు లేఖ రాశారు. 16 రూపాయల లెక్కన రెండున్నర మెట్రిక్ టన్నుల మామిడి కొనటానికి అంగీకరించినట్లుగా తిరిగి లేఖ రాశారు. మరి ఏపీలో ఎంపీలు ఏం చేస్తున్నారు. వారికంటే ఎక్కవగా ఎంపీలు ఉన్న టీడీపీ, జనసేన పార్టీలు ఏమి చేస్తున్నాయి’ అని అన్నారు.
Also Read
- Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
- IPL 2026 Final: ఫైనల్ కు వర్షం గండం.. మరి రిజర్వ్ డే సంగతేంటి.?
- Shubman Gill Vs Vaibhav Suryavanshi: గిల్ మ్యాచ్ గెలిచాడు.. మనస్సులను గెలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశే..!
- Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
Also Read: Ravindra Jadeja: రవీంద్ర జడేజా చరిత్ర.. ప్రపంచంలోనే ‘ఒకే ఒక్కడు’!
‘పవన్ కళ్యాణ్ మాట్లాడటం మానేసి చాలా రోజులు అయ్యింది. 12 రూపాయలని చెప్పడమే కానీ ఇచ్చింది సగం కూడా లేదు. ప్రభుత్వం ప్రకటించిన నాలుగు రూపాయిలు చాలా తక్కువ. అతి తక్కువ ఎంపీలు ఉన్న జేడీఎస్ పార్టీ ఆడిగిన వెంటనే కేంద్రం రెండున్నర మెట్రిక్ టన్నుల మామిడిని 16 రూపాయిలు లెక్కన కొనింది. చంద్రబాబు మాత్రం అబద్దాలు చెబుతూ రైతులను ముంచాడు. 1995 సీబీఎన్ అయినా కొద్దోగొప్పో బాగుండేది. ఇప్పుడు సీబీఎన్ మరింత దారుణం తయారు అయ్యాడు. మామిడి రైతుల సమస్యలు తీర్చకుండా వైసీపీ నేతలను తిట్టుకుంటూ కూర్చున్నాడు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల అల్లాడుతుంటే.. జీడి నెల్లూరు ఎమ్మెల్యే ధామస్ మాత్రం పుట్టిన రోజుకు కోట్లు ఖర్చు పెట్టి చేసుకున్నాడు. పక్కన రైతుల ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకలతో హాంగామా చేశాడు. మీరు ఎన్ని ఆంక్షల పెట్టినా జగన్ జిల్లాకు వచ్చి మామిడి రైతులను పరామర్శిస్తారు. అసత్య ప్రచారం చేయడంలో చంద్రబాబు దిట్ట. జగన్ ఉంటే రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. పవన్ కళ్యాణ్ నిద్రపోయి చాలా కాలం అయ్యింది. చంద్రబాబు సీఎంగా ఉన్నతకాలం పవన్ నిద్రపోతానే ఉంటారేమో’ అని భూమన విమర్శలు చేశారు.
తాజావార్తలు
-
Balka Suman Arrest: బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత!
-
IPL 2026 Final: ఫైనల్ కు వర్షం గండం.. మరి రిజర్వ్ డే సంగతేంటి.?
-
Shubman Gill Vs Vaibhav Suryavanshi: గిల్ మ్యాచ్ గెలిచాడు.. మనస్సులను గెలిచింది మాత్రం వైభవ్ సూర్యవంశే..!
-
Kishan Reddy: సన్న బియ్యం పేరుతో పేదలను మోసం చేస్తున్నారా?.. ప్రభుత్వంపై కిషన్రెడ్డి తీవ్ర విమర్శలు
-
Tamil Nadu: మార్పు మొదలైంది.. అర్చకుల అవినీతిపై మంత్రి స్టింగ్ ఆపరేషన్.! రూ.4 వేలు లంచం ఇచ్చి..
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..