Bhumana Karunakar: కూటమీ గెలిచే పరిస్థితి లేదు కాబట్టే ఎన్నికలు వాయిదా
- వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు
- కూటమీ గెలిచే పరిస్థితి లేదు కాబట్టే ఎన్నికలు వాయిదా.
- నలుగురు కార్పోరేటర్ల ఎక్కడ ఉన్నారో ..ఎమీ అయ్యారో తెలియదని వ్యాఖ్యలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhumana Karunakar: తిరుపతిలో జరిగిన డిప్యూటీ మేయర్ ఎన్నికలను వాయిదా వేసిన నేపథ్యంలో వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. మా పార్టీ విజయం సాధించేది కాబట్టి, కూటమి గెలిచే పరిస్థితి లేదని భావించి, ఎన్నికలు వాయిదా వేశారు. ఎన్నికల కమిషన్ దీనిపై తక్షణమే స్పందించాలని కోరుతున్నాం అని అన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి, టీడీపీపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఎన్నికల అధికారి టీడీపీ అనుకూలంగా పనిచేశారని చెప్పిన ఆయన, కిడ్నాప్ అయిన కార్పొరేటర్లను తీసుకోవాల్సిన బాధ్యత ఎస్పీ మీద ఉందా? అని ప్రశ్నించారు. తిరుపతి ఎమ్మెల్యే మదన్ గూండాయిజం చేస్తూ రాజకీయ క్షోభను సృష్టించారని ఆయన ఆరోపించారు.
Also Read: AP Elections: తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా
Also Read
- IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
- Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
- Rythu Shankaravam: 'రైతు శంఖారావం'కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
- Arms Theft: మద్రాస్ రెజిమెంట్లోకి దొంగల హల్చల్.. AK-47 సహా 12 ఆయుధాలు మాయం.!
తిరుపతిలో చోటుచేసుకున్న దౌర్జన్యాలు, బెదిరింపులు, గూండాయిజం గురించి మాట్లాడిన భూమన, మా పార్టీ తరపున గెలిచిన 48 కార్పొరేటర్లలో కొందరిని బెదిరించి, భయపెట్టి లాక్కున్నారని అన్నారు. ఉమా, శేఖర్ రెడ్డి, అమరనాథ్ రెడ్డి ఆస్తులపై దాడి చేసిన మంత్రి తిరుపతిలో ఈ దౌర్జన్యాలకు పునాది వేశారని ఆయన పేర్కొన్నారు. కూటమి నేతలపై దాడులు చేసినట్లు, అలాగే కార్పొరేటర్లను బెదిరించి, బస్సులో వెళ్ళిన వారిని కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు. నలుగురు కార్పొరేటర్లు ఎక్కడ ఉన్నారో, ఏమి అయ్యారో తెలియదని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు. చిత్తూరులో ఉన్న మా కార్పోరేటర్లను ఎమ్మెల్యే కోడుకు మదన్ ,ఆయన అనుచరులు ఇష్టం వచ్చినట్లు దాడులు చేస్తూ బెదిరించారని ఆయన అన్నారు. బస్సులో వెలుతున్న కార్పోరేటర్లను అన్నా రామచంద్రా యాదవ్ అనే ఆకు రౌడితో కోట్టి కిడ్నాప్ చేశారని ఆయన అన్నారు. నలుగురు కార్పోరేటర్ల ఎక్కడ ఉన్నారో ..ఎమీ అయ్యారో తెలియదని వాపోయారు. ఈ వ్యాఖ్యలతో భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో జరుగుతున్న దౌర్జన్యాలను బహిరంగంగా ఆరోపించారు. ఈ పరిణామాలు తిరుపతిలో రాజకీయ ఉత్కంఠను మరింత పెంచాయి.
తాజావార్తలు
-
Raaz Actress: అప్పుడు దెయ్యంగా భయపెట్టిన నటి.. ఇప్పుడు ఫామ్స్టే నడుపుతూ ప్రశాంత జీవితం..
-
India Missile Test: సాహో భారత్.. శత్రు దేశాలకు వార్నింగ్ సిగ్నల్! అడ్వాన్స్డ్ అగ్ని సిరీస్లో కీలక టెస్ట్..
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Hardik Pandya Injury: హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్.. మరోసారి గాయం.. ఈ గాయాల గోలేందిరా బాబూ!
-
Bigg Boss 10 Telugu: బోల్డ్ పర్సనాలిటీ.. భారీ ఫాలోయింగ్.. హౌస్లోకి ఈమె ఎంట్రీ ఇస్తే కుర్రాళ్లు చూపు తిప్పుకోలేరు!
ట్రెండింగ్
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!