Odisha News: రెండు కిలోల టమాటాల కోసం పిల్లలను తాకట్టు పెట్టిన నీచుడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha News: ఒడిశాలోని కటక్లో ఇద్దరు పిల్లలను టమాటాల కోసం తాకట్టు పెట్టిన షాకింగ్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఓ వినియోగదారుడు ఇద్దరు పిల్లలను దుకాణంలో కూర్చోబెట్టి టమాటాలతో పరారయ్యాడు. ఈ ఘటన కటక్లోని చత్రాబజార్ ప్రాంతంలో జరిగింది. సమాచారం ప్రకారం.. నందు కటక్లోని చత్రబజార్ కూరగాయల మార్కెట్లో కూర్చుని, తన కూరగాయల దుకాణాన్ని ప్రతిరోజూ లాగానే అలంకరిస్తున్నాడు. ఇంతలో ఓ వ్యక్తి ఇద్దరు మైనర్ పిల్లలతో కస్టమర్గా నటిస్తూ తన దుకాణానికి చేరుకున్నాడు. దుకాణదారుడు నందుతో టమోటాల కోసం బేరం కుదుర్చుకున్నాడు.
టమాటా టోకు ధర కిలో రూ.130గా నిర్ణయించారు. రెండు కిలోల టమాటాలు తీసుకున్న తర్వాత తాను ఇంకా 10 కిలోలు కొనాలని దుకాణదారునితో చెప్పాడు. కారులో పర్సు మర్చిపోయాను. తీసుకుని వస్తా.. అప్పటివరకు మా పిల్లలను చూసుకోమని.. ఈ లోగా కారునుంచి పర్సు తీసుకు వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. అక్కడే పిల్లలు, దుకాణదారు ఇద్దరూ అతని కోసం వేచి ఉన్నారు.
Also Read
- CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
- Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
- Iran Oil: భారీ డిస్కౌంట్తో ఇరాన్ చమురు ఆఫర్.. అయినా భారత్ ఎందుకు కొనడం లేదు?
Read Also:Police Bike Stunts: యూనిఫాంలో పోలీస్ బైక్ స్టంట్స్.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన అధికారులు!
అయితే ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో దుకాణదారుడు నందుకు అనుమానం వచ్చింది. ఇద్దరు పిల్లలను విచారించారు. విచారించగా అతడు మోసానికి గురైనట్లు తెలిసింది. నందు పిల్లలిద్దరినీ తన షాపులో కూర్చోబెట్టాడు. అప్పటికి సమీపంలోని దుకాణదారులు కూడా అతని వద్దకు చేరుకున్నారు. జనాన్ని చూసి మైనర్ పిల్లలిద్దరూ ఏడవడం మొదలుపెట్టారు. తాము బరంగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నందన్కానన్ స్థానికులమని ఇద్దరూ చెప్పారు. పిల్లల పేర్లు బబ్లూ బారిక్, ఎస్కార్ మహంతి. తమను ఇక్కడికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరో తెలియదని పిల్లలిద్దరూ చెప్పారు. పని ఇప్పిస్తానని చెప్పి రూ.300 ఇస్తానని చెప్పి ఇద్దరినీ తీసుకొచ్చాడని చిన్నారులు తెలిపారు.
అయితే కటక్ చేరుకున్న తర్వాత ఇద్దరినీ ఛతర్ బజార్ కూరగాయల మార్కెట్కు తీసుకొచ్చి రెండు కిలోల టమాటాలు, 5 పండని అరటిపండ్లు తీసుకుని కూరగాయలు అమ్మే వ్యక్తిని కారులో ఉంచమని చెప్పి వెళ్లిపోయాడు. అతను తిరిగి రావడం కోసం ఇద్దరూ ఎదురు చూస్తున్నారు, కానీ అతను మళ్లీ తిరిగి రాలేదు. అక్కడ దుకాణదారుడు ఈ పిల్లలిద్దరినీ పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టాడు. అయితే ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఎలాంటి ఫిర్యాదు అందలేదు. కొన్ని గంటల తర్వాత, వ్యాపారి నందు తనకు జరిగిన నష్టాన్ని తెలుసుకుని.. మైనర్ పిల్లలిద్దరినీ విడిపించాడు.
Read Also:Kodanda Reddy: రాజకీయాల కోసమే తప్పితే.. ప్రజల సమస్యలు పట్టవు
ఆకాశాన్నంటుతున్న టమాటా ధరలు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమాటా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఢిల్లీ-ఎన్సీఆర్లో కిలో రూ.140 వరకు లభిస్తుంది. మరోవైపు పెరిగిన టమాటా ధరల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల్లో కొన్ని దుకాణాల నుంచి టమాటాల దొంగతనాల ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఒడిశాలో పిల్లలను తనఖా పెట్టి టమాటాలతో పారిపోయిన ఈ వ్యక్తి తెలివితేటలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ రోజుల్లో ఈ కూరగాయల ధరల సమస్య కూడా రాజకీయాలలో ముదురుతోంది.
తాజావార్తలు
-
Aadarsha Kutumbam: అక్టోబర్ 2న ‘ఆదర్శ కుటుంబం’.. రిలీజ్ డేట్ లాక్! వెంకీ ఫ్యాన్స్కు పూనకాలే..
-
CM Vijay: ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా ‘జన నాయకన్’ నిర్మాత నియామకం.. తమిళనాడులో రాజకీయ దుమారం
-
Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
-
Ketan Agarwal Case: దర్యాప్తులో సంచలన ట్విస్ట్.. వేళ్లన్నీ సియా తల్లిదండ్రుల వైపే..!
-
Sergei Ivanov: పుతిన్ రైట్ హ్యాండ్ మృతి.. అది సహజ మరణమా? లేక పక్కా స్కెచా? అసలు నిజమేంటి!
ట్రెండింగ్
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..