BHU MTech Student Died: అర్ధరాత్రి వరకు చదువుకుని.. బీహెచ్యూలో పరీక్షకు ముందే విద్యార్థి మృతి..
- అర్ధరాత్రి వరకు చదువుకుని
- బీహెచ్యూలో పరీక్షకు ముందే ఎంటెక్ విద్యార్థి మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐఐటీ స్టూడెంట్ ఆకస్మిక మరణం.. తోటి విద్యార్థులతో పాటు కుటుంబీకులను షాక్ కు గురిచేసింది. తెల్లవారితే పరీక్ష ఉందని అర్థరాత్రి వరకు చదువుకున్న విద్యార్థి.. కానీ పరీక్షకు ముందే ఉదయం వేళ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన వారణాసిలోని IIT-BHUలో చోటుచేసుకుంది. MTech విద్యార్థి అనూప్ సింగ్ చౌహాన్ బుధవారం ఉదయం పరీక్ష రాయాల్సి ఉంది. మంగళవారం రాత్రి, అతను తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఒక గదిలో చదువుకున్నాడు. ముగ్గురు తెల్లవారుజామున 3 గంటల వరకు చదివి, ఆపై నిద్రపోయారు. అతని స్నేహితులు ఉదయం 6 గంటల ప్రాంతంలో అనూప్ను నిద్రలేపడానికి ప్రయత్నించగా, అతను మేల్కొనలేదు.
Also Read:Ramchander Rao: బీజేపీలో అవినీతి పరులకు స్థానం లేదు… కవితను పార్టీ లోకి తీసుకోము..
Also Read
- SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
- Machilipatnam: కామర్స్ లెక్చరర్ 'కామ లీలలు'.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
- Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
- Shocking: అది ఆహారం కాదు ఆత్మహత్య.. ప్లేట్లో విషాన్ని పెట్టుకుని తింటున్న హైదరాబాద్ యువత.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
అనుప్ శరీరం కొద్దిగా వెచ్చగా ఉంది. విద్యార్థులు అతనికి CPR కూడా చేశారు. కానీ ఫలితం లేదు. వారు వెంటనే IIT మేనేజ్ మెంట్ కు సమాచారం అందించారు. కానీ అప్పటికి చాలా ఆలస్యం అయింది. అనుప్ను బిహెచ్యులోని సర్ సుందర్ లాల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అతను చనిపోయినట్లు ప్రకటించారు. అనుప్ మరణానికి కారణం బహుశా గుండెపోటు అని వైద్యులు తెలిపారు. అయితే, పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి ఖచ్చితమైన కారణం తెలుస్తుందన్నారు.
పోలీసులు పోస్ట్మార్టం నిర్వహించిన తర్వాత మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించారు. అనూప్ సింగ్ చౌహాన్ అజంగఢ్ నివాసి. అతని తండ్రి వృత్తిరీత్యా న్యాయవాది. ఈ కేసులో తండ్రి ఎవరిపైనా ఎటువంటి ఆరోపణలు చేయలేదు. అనుప్ తండ్రి వినోద్ సింగ్ మాట్లాడుతూ, అనుప్ తన పెద్ద కొడుకు అని అన్నారు. చిన్న కొడుకు ఢిల్లీలో UPSC కి ప్రిపేర్ అవుతున్నాడని తెలిపాడు. రాత్రి 11:30 గంటలకు అనుప్ తన తమ్ముడితో ఫోన్లో మాట్లాడినట్లు వెల్లడించాడు. ఇంతలోనే కానరానిలోకాలకు వెళ్లిపోయాడని కన్నీటి పర్యంతమయ్యాడు.
తాజావార్తలు
-
SRH vs RCB: 300+ లోడింగ్.. మొదట బ్యాటింగ్ చేయనున్న కాటేరమ్మ కొడుకులు.!
-
CM Chandrababu : ఏపీలో ఎండల బీభత్సం.. లోకల్ సెలవులపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
-
KTR : అసెంబ్లీ రద్దు చెయ్.. ప్రజల తీర్పు ఏంటో చూద్దాం
-
Machilipatnam: కామర్స్ లెక్చరర్ ‘కామ లీలలు’.. ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపిన వైనం.. సడెన్గా భార్య ఎంట్రీ..!
-
Education Commission Chairman: విద్యా కమిషన్ చైర్మన్ పదవికి ఆకునూరి మురళి రాజీనామా.. సీఎస్కు లేఖ..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!