Ramchander Rao: బీజేపీలో అవినీతి పరులకు స్థానం లేదు… కవితను పార్టీ లోకి తీసుకోము..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కవిత, బీఆర్ఎస్ అంశం హాట్ టాపిక్గా మారింది. ఆమె బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో అవినీతి పరులకు స్థానం లేదని… కవితని పార్టీ లోకి తీసుకోమని స్పష్టం చేశారు. గబ్బర్ సింగ్ టాక్స్ అన్న వారి తలలో మెదడు లేదు పెండ(గోబర్) ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే.. ఆ రెండు పార్టీ లు అన్నదమ్ములు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించి కేవలం బ్యారేజీలపైనే కాదు.. మొత్తం ప్రాజెక్ట్ మీద సీబీఐ విచారణ జరపాలన్నారు. ఈ అంశంలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. కవిత గురించి ఎక్కువగా ఆలోచించొద్దని తెలిపారు. యూరియా కొరతపై స్పందించిన ఆయన.. కాంగ్రెస్ పొరపాటు వల్లనే తెలంగాణలో ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు.
READ MORE: Earthquake: ఆప్ఘనిస్థాన్లో మళ్లీ భూకంపం.. హడలెత్తిపోతున్న ప్రజలు
Also Read
- Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
- Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
- Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
- Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
” కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రేట్స్ తగ్గించి అన్ని వర్గాలకు పండుగ బహుమానం కేంద్రం ఇచ్చింది. మోడీ నేతృత్వంలో చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. పన్నుల వ్యవస్థను సరళీకరణ చేశారు. నిత్యావసర వస్తువులపై టాక్స్ ను జీరో చేశారు. మిడిల్ క్లాస్ ప్రజలకు ఎంతో ఊరట లభించింది. మోడీ, నిర్మల సీతారామన్ కి కృతజ్ఞతలు. జీఎస్టీ రేట్స్ తగ్గించినందుకు నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలకు పిలుపునిస్తున్నాం. రాష్ట్ర మంతటా కార్యక్రమాలు చేయాలి.. వన్ నేషన్ వన్ లా వైపు కూడా వెళ్తున్నాం.. ఎల్లుండి అమిత్ షా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి వేడుకల్లో పాల్గొంటారు… అమిత్ షా పార్టీ కార్యక్రమం ఇంకా ఫైనల్ చేయలేదు. అధికారిక కార్యక్రమంతో పాటు మోజన్జాహి మార్కెట్ లో గణేష్ నిమజ్జన వేడుకల్లో పాల్గొంటారు.” అని రామచందర్రావు వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
-
Asaduddin Owaisi: ‘‘ఆరుగురు పిల్లలు ఉన్నంత మాత్రాన..’’ ఓటర్ల జాబితా మ్యాపింగ్పై ఓవైసీ ఆగ్రహం..
-
Bill Gates: నేనెవరినీ వేధించలేదు.. ఎప్స్టీన్ కేసు విచారణలో బిల్గేట్స్ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!