Bhopal: 10 రోజులుగా కనిపించకుండా పోయిన వ్యక్తి.. కట్చేస్తే లిఫ్ట్లో కుళ్లిన మృతదేహం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhopal: భోపాల్లో జరిగిన ఓ విషాద ఘటన ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది. చినార్ డ్రీమ్ సిటీ అనే అపార్ట్మెంట్లో ప్రీతమ్ గిరి (77) అనే వృద్ధుడు లిఫ్ట్ షాఫ్ట్లో మృతిచెందినట్టు పోలీసులు వెల్లడించారు. ఆయన కనిపించకుండా పోయి దాదాపు 10 రోజులు గడిచిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ అపార్ట్మెంట్లో లిఫ్ట్ దగ్గర నుంచి తీవ్ర దుర్వాసన వస్తోందని స్థానికులు గమనించారు. వెంటనే మెయింటెనెన్స్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. లిఫ్ట్ కారును పైకి ఎత్తగా, కింద షాఫ్ట్లో ఒక శరీరం కనిపించింది. అప్పటికే అది బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. దుస్తులు, చెప్పుల ఆధారంగా కుటుంబ సభ్యులు అది ప్రీతమ్ గిరిదేనని గుర్తించారు. కుటుంబ “మండీదీప్కు వెళ్తున్నాను” అని కుటుంబానికి చెప్పారట. కానీ ఆయన తిరిగి రాలేదు. అదే రోజు రాత్రి ఆయన కుమారుడు మనోజ్ గిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా, మరుసటి రోజు మిస్రోడ్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు.
READ MORE: Dhandoraa : ఎన్టీఆర్ ట్వీట్తో అమెజాన్ ప్రైమ్లో దూసుకెళ్తున్న ‘దండోరా’
Also Read
- CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
- Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
- రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
- Gadikota Srikanth Reddy: కొత్త పెన్షన్ల పేరుతో మళ్లీ మోసం.. గడికోట ఫైర్
మిస్రోడ్ ఏసీపీ రాజనీష్ కశ్యప్ మాట్లాడుతూ.. అసహజ మృతి కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ప్రాథమికంగా లిఫ్ట్ షాఫ్ట్లో పడిపోవడం వల్ల ఛాతీకి గాయాలై మృతి చెందినట్టు అనుమానం ఉందన్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని స్పష్టం చేశారు. పోలీసులు ఇప్పుడు లిఫ్ట్ ఆపరేటర్, అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ టీమ్కు నోటీసులు ఇవ్వనున్నట్టు తెలిపారు. “లిఫ్ట్ ఎప్పటి నుంచి పనిచేయడం లేదు? ఎలాంటి మరమ్మతులు చేశారు? ఎవరి నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగింది?” అనే అంశాలపై విచారణ చేస్తామని చెప్పారు. నిర్లక్ష్యం నిరూపితమైతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
READ MORE: Akshay Kumar: స్టార్ హీరో అక్షయ్ కుమార్ కారుకు ప్రమాదం.. పరిస్థితి ఎలా ఉందంటే..?
అయితే మృతుడి కుమారుడు మనోజ్ గిరి పోలీసుల పనితీరుపై, అలాగే అపార్ట్మెంట్ మెయింటెనెన్స్పై తీవ్ర ఆరోపణలు చేశారు. జనవరి 6న లిఫ్ట్ పనిచేయడం లేదని, గ్రౌండ్ ఫ్లోర్ కంటే రెండు అడుగులు కింద ఆగిపోయి ఉందని చెప్పారు. అందుకే తన తండ్రి లిఫ్ట్ వాడాలేదని తెలిపారు. పోలీసులు సంఘటనా స్థలానికి రాకుండా, మూడు రోజుల తర్వాత స్టేషన్లోనే తన తమ్ముడి స్టేట్మెంట్ తీసుకున్నారని ఆరోపించారు. అలాగే అపార్ట్మెంట్లోని మూడో అంతస్తులో ఉన్న సీసీటీవీ కెమెరాలు ఏళ్లుగా పనిచేయడం లేదన్నారు. లిఫ్ట్ పరిస్థితి బాగోలేదని నివాసితులు ఎన్నిసార్లు చెప్పినా, మెయింటెనెన్స్ టీమ్ మరమ్మతులు వాయిదా వేస్తూ వచ్చిందని ఆరోపించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: 22A భూములు, విద్యుత్, పేదల ఇళ్లపై చర్చ.. సీఎం కీలక వ్యాఖ్యలు.!
-
G2 Release Date: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ రిలీజ్ డేట్ లాక్..
-
Jos Buttler: బట్లర్ విధ్వంసం.. రోహిత్ శర్మ రికార్డు బ్రేక్
-
Ajit Agarkar: భారత క్రికెట్లో కీలక పరిణామం.. థ్యాంక్యూ నోట్.. చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్బై!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
ట్రెండింగ్
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!