Mamata Banerjee: S.I.R ఎఫెక్ట్.. సీఎం మమతా బెనర్జీ సొంత నియోజకవర్గంలో 45,000 ఓట్ల తొలగింపు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhawanipur Voters List Controversy: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నియోజకవర్గమైన భవానీపూర్లో దాదాపు 45,000 మంది ఓటర్ల పేర్లను ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా నుంచి పెద్ద సంఖ్యలో పేర్లు తొలగించబడటంపై టీఎంసీ పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. తాజాగా నిర్వహించిన ప్రత్యేక సమీక్ష (SIR) ప్రక్రియలో డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా నుంచి దాదాపు 45 వేల మంది ఓటర్ల పేర్లు తొలగించడంతో ఆ విషయాన్ని సీరియస్గా తీసుకున్న పార్టీ నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలగించిన ప్రతి ఓటర్ పేరును ఇంటింటికి వెళ్లి మళ్లీ పరిశీలించాలని పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లకు (BLAలు) ఆదేశాలు ఇవ్వాలని నిర్ణయించింది. మంగళవారం భవానీపూర్ ప్రాంతంలో స్థానిక పార్టీ నాయకులతో టీఎంసీ సమావేశం నిర్వహించింది.
READ MORE: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- PM Modi: బ్రిక్స్ దేశాలు రెట్టింపు వేగంతో పుంజుకున్నాయి.. బిజినెస్ ఫోరంలో మోడీ కీలక వ్యాఖ్యలు
- Thirukkural: పుతిన్కు మోదీ ‘తిరుక్కురళ్’ గిఫ్ట్.. రష్యాతో ఈ తమిళ గ్రంథానికి ఉన్న లింక్ ఇదే!
- Delimitation Bills: నవరాత్రుల్లో ముహూర్తం.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కసరత్తు!
- Modi-Putin: "కార్ డిప్లమసీ".. ఒకే కారులో మోడీ-పుతిన్..
ఎన్నికల కమిషన్ గణాంకాల ప్రకారం.. 2025 జనవరి నాటికి భవానీపూర్లో మొత్తం 2,06,295 మంది ఓటర్లు ఉన్నారు. అయితే తాజా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో కేవలం 1,61,509 పేర్లే ఉన్నాయి. అంటే 44,787 మంది ఓటర్ల పేర్లు తొలగించారు. ఇది మొత్తం ఓటర్లలో సుమారు 21.7 శాతం. ఈ స్థాయిలో తొలగింపులు జరగడంపై టీఎంసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. చాలా మంది ఓటర్లను “మరణించారు”, “ఇల్లు మార్చారు”, “ వివరాలు లభ్యం కాలేదు” అని గుర్తించి జాబితా నుంచి తీసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. చెల్లుబాటు అయ్యే ఒక్క ఓటర్ పేరు కూడా తొలగించకూడదని, ప్రతి పేరును తప్పనిసరిగా ప్రత్యక్షంగా పరిశీలించాలని పార్టీ నాయకత్వం స్పష్టం చేసినట్లు టీఎంసీ వర్గాలు తెలిపాయి.
READ MORE: Panchayat Elections Live Updates: నేడు చివరి విడత “పల్లెపోరు”.. గ్రామాల్లో పోలింగ్ షురూ..
భవానీపూర్ నియోజకవర్గంలో కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన 63, 70, 71, 72, 73, 74, 77, 82 వార్డులు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా 70, 72, 77 వార్డుల్లో ఎక్కువగా ఓటర్ల పేర్లు తొలగించినట్లు పార్టీ గుర్తించింది. మైనారిటీ జనాభా ఎక్కువగా ఉన్న వార్డు 77పై ప్రత్యేక దృష్టి పెట్టాలని నిర్ణయించింది. భవానీపూర్ ఒక గట్టి నగర ప్రాంతం. ఇక్కడ ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా నుంచి వచ్చినవారు కూడా పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. ఓటర్ల అభ్యంతరాలు, క్లెయిమ్లపై విచారణ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుండటంతో ప్రభావితమైన ఓటర్లకు పార్టీ అండగా ఉండాలని స్థానిక నాయకులకు ఆదేశాలు ఇచ్చింది. పక్కా పక్కన “మే ఐ హెల్ప్ యూ” శిబిరాలను కొనసాగిస్తూ, పత్రాలు సిద్ధం చేయడం, ఫారాలు నింపడం, విచారణలకు హాజరు కావడం వంటి విషయాల్లో ప్రజలకు సహాయం చేయాలని టీఎంసీ తెలిపింది. అవసరమైతే వాలంటీర్లు ఇళ్లకు వెళ్లి కూడా సహాయం చేయాలని సూచించింది. ఈ సమావేశంలో సీనియర్ నేతలు, కౌన్సిలర్లు, ముఖ్య పార్టీ నాయకులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
PM Modi: బ్రిక్స్ దేశాలు రెట్టింపు వేగంతో పుంజుకున్నాయి.. బిజినెస్ ఫోరంలో మోడీ కీలక వ్యాఖ్యలు
-
Thirukkural: పుతిన్కు మోదీ ‘తిరుక్కురళ్’ గిఫ్ట్.. రష్యాతో ఈ తమిళ గ్రంథానికి ఉన్న లింక్ ఇదే!
-
Marpally : పంచాయతీరాజ్ శాఖలో కీలక మార్పు.. మర్పల్లి ఇక వికారాబాద్ డివిజన్లో
-
Hanuman Ansh: త్రివిక్రమ్ చేతుల మీదుగా తెలుగులోకి ‘హనుమాన్ అంశ్’ – సెప్టెంబర్ 18న గ్రాండ్ రిలీజ్!
-
Delimitation Bills: నవరాత్రుల్లో ముహూర్తం.. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్లపై కేంద్రం కసరత్తు!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?