Bhatti Vikramarka : ఆగస్టు కాదు అంతకన్నా ముందే చేసి చూపిస్తాం.. రైతు రుణమాఫీని ఎవరు ఆపలేరు
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గురువారం కొత్తగూడెంలో పర్యటిస్తున్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావులతో కలిసి కొత్త గూడెంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు. వర్ష కాలం నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తుగా గోదావరి వరదలపై కలెక్టరేట్ సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఆ తరువాత సహచర మంత్రులతో కలిసి మనుగూరు బయలుదేరి వెళ్లి మాతృవియోగం పొందిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లను పరామర్శించారు. అదే విధంగా ఇటీవల స్వర్గస్థులైన పద్మశ్రీ ఆవార్డు గ్రహీత సకిన రాంచంద్రయ్య కుటుంబ సభ్యులను పరమార్శించి ప్రగాఢ సంతాపం సానుభూతి తెలియజేశారు.
అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రెండు లక్షల రుణమాఫీ చేసి చూపిస్తామన్నారు. ఆగస్టు కాదు అంతకన్నా ముందే చేసి చూపిస్తాం. రైతు రుణమాఫీని ఎవరు ఆపలేరన్నారు. ప్రజాభిప్రాయం సేకరించి, విధి విధానాలు రూపొందించి, అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అమలు చేస్తామని, గత పాలకులు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి 50 వేల కోట్లు అప్పు తెచ్చి మిషన్ భగీరథ చేపట్టారు.. రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసాన్ని సృష్టించారు.. అయినా ఇంటింటికి తాగు నీటిని ఇవ్వలేకపోయారు
Also Read
- AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
- Tamil Cinema : కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ కుదుపు.. హీరోలకు రెమ్యునరేషన్ ఇచ్చేది లేదని నిర్ణయం
- Rajya Sabha: బీజేపీలో ఆప్ ఎంపీల విలీనం.. రాజ్యసభ ఛైర్మన్ ఆమోదం
- Jowar Chilla Recipe: జొన్న పిండితో 10 నిమిషాల్లో కరకరలాడే హెల్దీ చిల్లా.. పిల్లలు, పెద్దలు ఎవరూ విడిచిపెట్టరు అంతే..!
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేరుస్తాం, రాష్ట్ర ప్రజల డబ్బుకు జవాబుదారీగా ఉంటాం గత పదేళ్లు పాలించిన వారు రాష్ట్ర సంపదను దోపిడీ చేసి, ఎవరికి పడితే వారికి పంచారు, 7 లక్షల కోట్ల అప్పు చేసి.. పారిపోయారు. రామగుండం లో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ తో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మించేందుకు ప్రణాళికలు చేస్తున్నాం త్వరలో శుభవార్త వింటారు. కొత్తగూడెం పాల్వంచ రెండు పట్టణాలు కలిపి కార్పొరేషన్ ఏర్పాటు చేసే ఆలోచనను పరిశీలిస్తాం’ అని భట్టి విక్రమార్క అన్నారు.
తాజావార్తలు
-
Sheikh Yusuf Afridi: ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో దుండగుల కాల్పులు.. లష్కర్-ఎ-తోయిబా అగ్ర కమాండర్ షేక్ అఫ్రిది హతం
-
Tollywood : మే 1 నుంచి థియేటర్ల బంద్?
-
The India Story: జూలై 24న కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరి’
-
AP Petrol Shortage: పెట్రోల్, డీజిల్ కొరతపై సర్కార్ అలర్ట్.. కీలక ఆదేశాలు జారీ
-
Tamil Cinema : కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ కుదుపు.. హీరోలకు రెమ్యునరేషన్ ఇచ్చేది లేదని నిర్ణయం
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!