Bhatti Vikramarka : విద్యుత్ కొరత రాకుండా బొగ్గు ఉత్పత్తి చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వేసవిలో విద్యుత్ కొరత రాకుండా రాష్ట్రంలో అన్ని థర్మల్ కేంద్రాలకు, ఇతర రాష్ట్రాల్లోని థర్మల్ కేంద్రాలకు బొగ్గును నిరంతరాయంగా ఉత్పత్తి చేసి రవాణా చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో సింగరేణిలోని అన్ని విభాగాలపై సమగ్రంగా ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. సింగరేణి ఉపరితల భూగర్భగనులు మరియు నూతన ప్రాజెక్టులు, సింగరేణి థర్మల్ ప్రాజెక్టు మరియు సోలార్ ప్రాజెక్టులు, మిషనరీ వినియోగం, బొగ్గు మార్కెటింగ్, రవాణా పై ఆయా విభాగాల డైరెక్టర్ల ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు.
అలాగే సంస్థ ఆర్థిక స్థితిగతులు, ఉద్యోగ కల్పన, కార్మిక సంక్షేమం, సిఎస్ఆర్ నిధుల కేటాయింపు తదితర అంశాల పైన సమీక్షించారు. 2023- 24 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలు ఇప్పటి వరకు సాధించిన ప్రగతి గురించి అధికారులు వివరించారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం వేలం పెట్టిన బొగ్గు బ్లాకుల వివరాలు గురించి క్షుణ్ణంగా తెలుసుకుని దానిపై చేపట్టాల్సిన కార్యాచరణ గురించి దిశ నిర్దేశం చేశారు. అదే విధంగా ఒడిశాలో సింగరేణి కాలరీస్ సంస్థకు కేటాయించిన నైని బొగ్గు బ్లాకు ప్రారంభించడానికి ఎదురవుతున్న అవాంతరాలపై చర్చించారు. ఒడిశా నైనీ బ్లాకులో బొగ్గు ఉత్పత్తి కోసం కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ మరియు ఒడిషా ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సమస్య పరిష్కారం దిశగా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కావలసిన సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా అధికారులకు వెల్లడించారు.
Also Read
- Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
- Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
- Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
- Kesar Mango Record: పండ్ల రాజు గిర్ కేసర్ మామిడి.. 10 ఏళ్ల రికార్డులు బద్దలు
కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో బొగ్గు బ్లాక్ లను వేలం వేయడాన్ని అన్ని కార్మిక సంఘాలు సంయుక్తంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో దీని పైన సంస్థకు మేలు జరిగేలా విధానపరమైన నిర్ణయం తీసుకోవాలని డిప్యూటీ సీఎంకు అధికారులు విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో సింగరేణి ని మరింత విస్తరించడానికి బొగ్గు మైనింగ్ కాకుండా ఇతర ఖనిజ అన్వేషణకు రూపొందించిన ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అని అధికారులను అడిగారు. రాష్ట్ర విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని పేర్కొనడంతో సంబంధిత అధికారుల సూచనల మేరకు బయ్యారం స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సాధ్యా సాధ్యాలపై అధ్యయనం చేయడం జరిగిందని వివరించారు.
సింగరేణి కాలరీస్ సంస్థలు పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం పైన ప్రత్యేక దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని ఆయన ఆదేశించారు. కార్మికులకు సంస్థ ద్వారా అందిస్తున్న అలవెన్స్ లు, వైద్య సదుపాయం అందిస్తున్న ఇతర సంక్షేమ కార్యక్రమాల గురించి ఆరా తీశారు. కారుణ్య నియామకాల నియామకాల కోసం జరుగుతున్న మెడికల్ బోర్డు ప్రక్రియ గురించి కులంకుశంగా తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్. శ్రీధర్ ఐఏఎస్, డైరెక్టర్లు ఎన్.బలరామ్ (పర్సనల్, ఫైనాన్స్), డి.సత్యనారాయణ రావు (ఈ అండ్ ఎం), ఎన్ వి కె శ్రీనివాస్ (ఆపరేషన్స్), జి వెంకటేశ్వర్ రెడ్డి (ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్), ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) జి.ఆల్విన్, జనరల్ మేనేజర్ (కో ఆర్డినేషన్) శ్రీ ఎం.సురేష్, వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Off The Record: గోదావరి పుష్కరాలపై వేల కోట్ల కన్ను..? ఎమ్మెల్యేల కొత్త స్కెచ్ ఇదేనా..!
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Israel-Hezbollah: ఇజ్రాయెల్-హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం! అమెరికా సంకేతాలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
-
Kesar Mango Record: పండ్ల రాజు గిర్ కేసర్ మామిడి.. 10 ఏళ్ల రికార్డులు బద్దలు
ట్రెండింగ్
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!