Bhatti Vikramarka : రాష్ట్ర వనరులు, సంపద ప్రజలకే పంచుతాం
- ఖమ్మం కలెక్టరేట్లో రైతు భరోసా పథకంపై మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం. రాష్ట్ర వనరులు
- సంపద ప్రజలకే పంచుతామన్న భట్టి విక్రమార్క
ఖమ్మం కలెక్టరేట్లో రైతు భరోసా పథకంపై మంత్రి వర్గ ఉప సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వర రావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ర్ట వనరులు, సంపద ప్రజలకే పంచుతామన్నారు. రైతు బంధు పేరుతో ఒకే సారి నిధులు విడుదల చేశామని, రైతు భరోసా అమలుకు బడ్జెట్ సమావేశం లో నిధులు కేటాయించనున్నామన్నారు భట్టి విక్రమార్క. శాసనసభ లో చర్చ కు పెడతామని, ప్రజలు ఇచ్చే ప్రతి సూచన చాలా విలువైనదన్నారు భట్టి. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. నిజమైన రైతుకి భరోసా ఉండాలన్నారు. రైతు కానీ వాళ్ళ వద్దని, గతంలో జరిగిన లోపాలు, జరిగిన ఆర్థిక నష్టం పై కూడా ఆలోచించాలన్నారు. రైతులకి ఇచ్చిన అన్ని హామీలు కూడా అమలు చేస్తామన్నారు మంత్రి తుమ్మల. రైతు బంధు మీ ఖాతా లో వేశామని, రుణ మాఫీ చేస్తున్నామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు. న్యాయమైన సహాయం రైతులకు అందివ్వాలి అన్న ఓపెన్ మైండ్ తో ప్రభుత్వం వుందని, బక్క , చిన్న కారు రైతులకి న్యాయం చేయాలి అన్న లక్ష్యం తో వున్నామన్నారు. పేపర్ లో మీడియా లో వచ్చేది ఏది నిజం కాదు ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోలేదు ఎవ్వరూ అటువంటి వాటిని నమ్మవద్దన్నారు మంత్రి తుమ్మల.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ఖర్చు పెట్టే ప్రతి రూపాయ ప్రజలదే అని, గత ప్రభుత్వం ఏ స్కీం ప్రజల అభిప్రాయం స్వీకరించ లేదన్నారు. నాలుగు గోడల మధ్య గత ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుని ప్రజల మీద రుద్దారని, ప్రతి పైసా కు అకౌంట్ చెప్పాల్సిన బాధ్యత మాపై వుందన్నారు. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం ఇప్పటి వరకు తీసుకోలేదన్నారు మంత్రి పొంగులేటి. 9 జిల్లాలో రైతు లు ప్రజలు, మెదవుల ఆలోచనలను తీసుకుంటాం రైతులను ఆదుకోవాలని ప్రధాన ప్రతిపక్షం అని చెప్పేవాళ్లు మాట్లాడుతున్నారని, ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే పెడతాం… అది ప్రధాన ప్రతిపక్షం గమనించాలన్నారు మంత్రి పొంగులేటి.
Also Read
- Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే...
- MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
- Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
- Chairmans Desk : ఐదు రాష్ట్రాల ఎన్నికలు పొలిటికల్ ట్రెండ్ మార్చయా? రాజకీయాలు అంటే యుద్ధాలేనా ?
తాజావార్తలు
-
Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే…
-
Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
-
MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
-
Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
-
Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!