Bhatti Vikramarka : బీసీ సంక్షేమ శాఖ పై బడ్జెట్ సన్నాహక సమీక్షా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన బీసీ సంక్షేమ శాఖపై బడ్జెట్ సన్నాహక సమీక్షా సమావేశం జరిగింది.. సమీక్షా సమావేశానికి రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రామకృష్ణ రావు, ఫైనాన్స్ జాయింట్ సెక్రెటరీ హరిత, బీసీ వెల్ఫెర్ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం హాజరయ్యారు..
గతంలో బీసీ సంక్షేమానికి కేటాయించిన నిధులు ప్రస్తుతం బడ్జెట్ లో కటాయించాల్సిన అంశాల పై చర్చ జరిగింది. ప్రధానంగా బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ , కల్యాణ లక్ష్మి, బీసీ విద్యార్థుల స్కాలర్ షిప్ లకి సంబంధించి కేటాయించాల్సిన నిధులు పై మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.. బీసీ గురుకులాలకు సొంత భవనాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని. ప్రస్తుతం సంవత్సరానికి 300 మందికి ఓవర్సిస్ స్కాలర్ షిప్ మంజూరు చేస్తుండగా వాటిని మరింత మందికి పెంచాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి విజ్ఞప్తి చేశారు.
Also Read
- Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
- BJP Presidents: నాలుగు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించిన బీజేపీ.!
- Siddaramaiah Resignation: ముగిసిన సిద్ధరామయ్య శకం.. భారతీయ లోక్ దళ్ నుంచి కాంగ్రెస్ దాకా.. 43 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఇదే..
- RK Roja: మరోసారి విరుచుకుపడ్డ రోజా.. టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు..
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కల్యాణ లక్ష్మి కి అదనంగా తులం బంగారం ఇస్తామని హామీ ఇవ్వడంతో కళ్యాణ లక్ష్మి పథకానికి అదనంగా బడ్జెట్ లో కేటాయించాల్సిన నిధులు పై చర్చించారు.. బీసీ హాస్టల్ లని మరింత అభివృద్ధి చేయాలని… తెలంగాణ బీసీ కుల గణన చేస్తామని హామీ ఇవ్వడంతో దానికి బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరారు. పాత జిల్లాలకి బీసీ స్టడీ సర్కిల్ లకి పక్కా భవనాలు ఉండడంతో కొత్త జిల్లాలకి బిల్డింగ్స్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.. సావిత్రి భాయ్ అభ్యుదయ యోజన కింద బాలికల విద్య మరింత ముందుకు తీసుకుపోవాలని అధికారులను ఆదేశించారు.
కుల వృత్తుల్లో చదువుకున్న వారు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని వారికి స్కిల్ డెవలప్మెంట్ కి శిక్షణ కార్యక్రమాల పై అధ్యయనం చేయాలని సూచించారు.. గీతా వృత్తిదారులకు అదునాతన సేఫ్టీ మోకులు సబ్సిడీతో అందించేలా చూడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. బీసీ డిక్లరేషన్ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉండని దానికి అనుగుణంగా బడ్జెట్ లో నిధులు కేటాయించాలని ఆర్థిక శాఖ మంత్రి డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్కకి మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు..
తాజావార్తలు
-
Left Parties Protest: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై వామపక్షాల పోరాటం.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన..
-
Jofra Archer: వైభవ్ సూర్యవంశీ విధ్వంసంను ఎలా ఆపాలి.. ఆర్ఆర్ పేసర్ ఆర్చర్ ఏం చెప్పాడంటే?
-
BJP Presidents: నాలుగు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించిన బీజేపీ.!
-
Siddaramaiah Resignation: ముగిసిన సిద్ధరామయ్య శకం.. భారతీయ లోక్ దళ్ నుంచి కాంగ్రెస్ దాకా.. 43 ఏళ్ల రాజకీయ ప్రస్థానం ఇదే..
-
RK Roja: మరోసారి విరుచుకుపడ్డ రోజా.. టీడీపీ మహానాడుపై తీవ్ర విమర్శలు..
ట్రెండింగ్
-
Dondakaya Roti Pachadi: పల్లీల స్పెషల్ టచ్తో ‘దొండకాయ రోటి పచ్చడి’.. టేస్ట్ చేస్తే లొట్టలేసుకుంటూ తింటారంతే.!
-
144Hz OLED డిస్ప్లే, 7500mAh బ్యాటరీతో గేమింగ్ మాన్స్టర్ REDMAGIC 11S Pro గ్లోబల్ లాంచ్.!
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..