Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Ktr Slams Congress Over Raithubima Renewal Process Telangana Farmers Struggle

KTR Tweet: దరఖాస్తులు తప్పితే దమ్మిడీ ఇచ్చింది లేదు.. కేటీఆర్‌ ట్వీట్ వైరల్!

Published Date :August 11, 2025 , 12:55 pm
By Sampath Kumar
  • ఆగష్టు 13తో రైతు బీమా గడువు పూర్తి
  • ప్రీమియం చెల్లిస్తే ఆగస్ట్ 14 నుంచి కొత్త పాలసీ
  • రైతులు స్వీయ ధ్రువీకరణ తప్పనిసరి
  • తిక్కలోడు తిరనాళ్లకు పోతే అంటూ కేటీఆర్ కౌంటర్
KTR Tweet: దరఖాస్తులు తప్పితే దమ్మిడీ ఇచ్చింది లేదు.. కేటీఆర్‌ ట్వీట్ వైరల్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

KTR Slams Congress Over Rythu Bima Renewal Rules: ‘రైతు బీమా’ పథకం పునరుద్ధరణకు గడువు దగ్గరపడింది. 2024-25 బీమా గడువు ఆగష్టు 13తో ముగుస్తుండగా.. 2025-26కి ప్రీమియం చెల్లిస్తే ఈ నెల 14 నుంచి కొత్త పాలసీ అమల్లోకి వస్తుంది. రైతు బీమా పథకంలో చేరే రైతులు స్వీయ ధ్రువీకరణ (సెల్ఫ్‌ డిక్లరేషన్‌) తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంది. రైతులు తమతో పాటు నామినీకి చెందిన ఆధార్‌ కార్డు, పట్టా పుస్తకం దరఖాస్తుకు జతచేసి స్వయంగా వ్యవసాయశాఖ అధికారులకు ఇవ్వాలి. అర్జీలకు మరో మూడు రోజులే గడువు ఉండడంతో.. రైతులు తమ పనులు మానుకుని అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ ప్రభుత్వంపై కౌంటర్ వేశారు. కాంగ్రెస్ పాలనలో పథకాల కోసం ప్రజలు పదే పదే దరఖాస్తు చేసుకోవడానికే సరిపోతుందని, ఒక్క పథకమూ అమలు కావడం లేదన్నారు.

‘తిక్కలోడు తిరనాళ్లకు పోతే ఎక్కా, దిగా సరిపోయిందని.. అసమర్ద, అవివేక కాంగ్రెస్ పాలనలో పథకాల కోసం ప్రజలు పదే పదే దరఖాస్తు చేసుకోవడానికే సరిపోతుంది తప్ప ఒక్క పథకమూ నిర్ధిష్టంగా అమలు కావడం లేదు. భూమిని నమ్ముకున్న రైతు ఏ కారణం చేత మరణించినా రూ.5 లక్షలు ఆ కుటుంబానికి అందించే రైతుబీమా పథకం 2018 నుండి కేసీఆర్ గారి ప్రభుత్వం అమలుచేస్తూ వస్తున్నది. పథకం ప్రారంభించినప్పటి నుండి 2023 డిసెంబర్ వరకు 1,11,320 రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.5,566 కోట్ల పరిహారం అందించడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబీమా ప్రీమియం చెల్లించకుండా జాప్యం చేయడం మూలంగా వేలాది మంది రైతు కుటుంబాలు బీమా సాయం కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రతి ఏటా ఆగస్టు 14తో రైతుబీమా ప్రీమియం గడువు ముగుస్తుంది. దీంతో ప్రభుత్వం ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించి రెన్యువల్ చేయడం ఆనవాయితీ. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం గడువు దగ్గరకు వచ్చిన తర్వాత రైతుబీమా కోసం రైతు స్వయంగా స్వీయ ధ్రువీకరణ (సెల్ఫ్ డిక్లరేషన్) పత్రం అందజేయాలని, తనతో పాటు నామినీ పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు అందజేయాలని నిబంధన పెట్టారు’ అని కేటీఆర్ మండిపడ్డారు.

Also Read: Hydra: హైడ్రాలో మార్షల్స్ సంచలన నిర్ణయం!

‘రైతుబీమా రెన్యువల్‌కు కేవలం మూడు రోజుల గడువు మాత్రమే ఉన్నది. ప్రస్తుతం వ్యవసాయ పనులు జోరుగా నడుస్తున్నాయి. ఎరువులు దొరక్క రైతులు చెప్పులు, బుక్కులు లైన్లో పెట్టి పడిగాపులు కాస్తున్నారు. ఇలాంటి కీలక సమయంలో రైతుబీమాకు తిరిగి స్వయంగా రైతులు దరఖాస్తు చేయాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం మూర్ఖత్వం. గతంలో చేసినట్లే రైతుబీమా రెన్యువల్ చేయాలి. దరఖాస్తు పేరుతో రైతులను ఇబ్బంది పెట్టవద్దని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నది. కాంగ్రెస్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. ప్రతిపక్షాలు, ప్రజలు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు, నిరుద్యోగులు.. ఎవరి మీద విసురుతారో తెలియని పరిస్థితి నెలకొంది. దండగమారి కాంగ్రెస్ పాలనలో దరఖాస్తులు తప్పితే సామాన్యులకు ఈ సర్కారు దమ్మిడీ విదిల్చింది లేదు. బోగస్ మాటలు, బ్రోకర్ వేషాలు తప్ప 20 నెలల కాంగ్రెస్ పాలనలో సామాన్యులకు, తెలంగాణకు ఒరిగిందేమీ లేదు. జాగో తెలంగాణ జాగో’ అంటూ కేటీఆర్ ఎక్స్‌ వేదికగా పోస్టు చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • brs vs congress
  • ktr
  • ktr tweet
  • Rythu Bima Renewal
  • Rythu Bima Scheme

తాజావార్తలు

  • 3 States Elections: 3 రాష్ట్రాల్లో ముగిసిన ప్రచారం.. ఎల్లుండే పోలింగ్

  • MI Coach Paras Mhambrey: ఆందోళన ఏమీ లేదు.. వైభవ్‌ సూర్యవంశీని అలా బుట్టలో వేస్తాం!

  • Call Off Strike: ప్రభుత్వంతో చర్చలు సఫలం.. తాత్కాలికంగా సమ్మె బ్రేక్..! ఆసుపత్రుల బకాయిల క్లియరెన్స్‌కు గ్రీన్ సిగ్నల్..

  • UP: పొలాల్లో హఠాత్తుగా దిగిన 3 సైనిక హెలికాపర్టు.. బెంబేలెత్తిపోయిన గ్రామస్తులు

  • Highest Grossing Indian Movies: 2 తెలుగు సినిమాలు సహా హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన టాప్ 5 ఇండియన్ సినిమాలివే!

ట్రెండింగ్‌

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions