Bhatti Vikramakra : కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్లగొండ జిల్లాలో భట్టి విక్రమార్క పాదయాత్ర కొనసాగుతోంది. అయితే.. దేవరకొండలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో బీఆర్ఎస్ పార్టీ విఫలమైందని, అందరి సహకారం వల్లే వెయ్యి కిలోమీటర్లు పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేశానన్నారు. నాపాదయాత్ర సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టుకున్నారని, 2014లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే.. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తయ్యేదన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేయకుండానే సాగు నీళ్లు ఇస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ చెప్పుకుంటుందన్నారు. నల్లగొండ జిల్లాకు అతి ఎక్కువ నష్టం చేసింది బీఆర్ఎస్ పార్టీని.. నల్లగొండ జిల్లాకు చేసిన అన్యాయంపై క్షమాపణైనా చెప్పండి లేదా బహిరంగ చర్చకైనా రండి అని ఆయన సవాల్ చేశారు.
Also Read : Amit Shah: ఏపీపై బీజేపీ స్పెషల్ ఫోకస్.. వైజాగ్ లో అమిత్ షా పర్యటన..
Also Read
- Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ 'గట్ ఫీల్' గురించే అంటూ వ్యాఖ్యలు..
- WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
- IPL 2027: గంగూలీ మాస్టర్ ప్లాన్.. ఐపీఎల్ 2027లో ఆ జట్టుకు కోచ్గా యువరాజ్ సింగ్..
- Supreme Court: ఫుట్పాత్పై నడవడం ప్రాథమిక హక్కు.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి సూచన
అంతేకాకుండా.. ‘కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ఏం చేసిందో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చర్చకు రావడానికి, సవాల్ స్వీకరించడానికి బీఆర్ఎస్ నేతలు సిద్ధంగా ఉన్నారా. ధనిక రాష్ట్రం, సంపన్న రాష్ట్రం రేషన్ షాప్ లో ఇవ్వాల్సిన నిత్యవసర సరుకులు ఎందుకు ఇవ్వలేక పోతుంది. మీరు ప్రారంభించిన థర్మల్ పవర్ ప్లాంట్ లు ప్రారంభించకుండానే 24 గంటల విద్యుత్ ఎలా ఇస్తున్నారో చెప్పాలి. బీఆర్ఎస్ మాయమాటలు గుర్తించిన దేవరకొండ ప్రజలు పీపుల్స్ మర్చ్ కు బ్రహ్మరథం పట్టారు. 2023లో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే డబల్ బెడ్ రూమ్ లకు 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తాం. 500 రూపాయలకే కే సిలిండర్లు ఇస్తాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాం.
భూమిలేని నిరుపేదలకు సంవత్సరానికి ₹12 వేల రూపాయలు ఇస్తాం. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. చేసేదే చెప్తాం.. చెప్పిందే చేస్తాం.. మాయమాటలు చెప్పే అలవాటు కాంగ్రెస్ పార్టీకి లేదు.’ అని భట్టి వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Sunil Gavaskar: గిల్ కెప్టెన్సీ ఇన్నింగ్స్పై గవాస్కర్ ప్రశంసలు.. ఆ ‘గట్ ఫీల్’ గురించే అంటూ వ్యాఖ్యలు..
-
Gandhi Sarovar Project : మూసీ ప్రక్షాళనకు బిగ్ బూస్ట్.. గాంధీ సరోవర్కు గ్రీన్ సిగ్నల్
-
WhatsApp Subscription India: ఉచిత వాట్సాప్ యుగానికి ముగింపు?.. భారత్లో చెల్లింపు సేవల ఆరంభం
-
KTR : హామీల ఊసే లేదు.. రాష్ట్రాన్ని మాఫియా నడుపుతోంది
-
Thaman S: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తమన్.. ఆ పిల్లల స్కూల్ ఫీజులు కట్టేసిన మ్యూజిక్ డైరెక్టర్!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?