Independence Day:ఒకే చోట స్వాతంత్ర్య దినోత్సవాన్ని చేసుకున్న భారత్, పాక్ పౌరులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశమంతట సంబరాలు అంబరానంటాయి. అంతేకాకండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ తాము ఉన్న చోట స్వాతంత్ర్య దినోత్స వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇక ఒక చోట మాత్రం చిరకాల ప్రత్యర్థులుగా భావించే భారత్, పాక్ పౌరులు కలిసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ అరుదైన సంఘటన బ్రిటన్ లోని లండన్ లో జరిగింది.
భారతదేశం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటే పాకిస్తాన్ మనకంటే ఒకరోజు ముందే అంటే ఆగస్టు 14న ఇండిపెండెన్స్ డే చేసుకుంటుంది. అయితే భారత్, పాక్ అంటే ఎప్పటికీ ప్రత్యర్థులే అని అనుకుంటూ ఉంటారు. ప్రతి చోటా ఇదే తీరు కనిపిస్తోంది. ఈ క్రికెట్ విషయంలో ప్రత్యర్థులు పోరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఈ మ్యాచ్ లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కూడా పోటీ పడి మరీ చోటు చేసుకుంటాయి. అయితే ఈ 77వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు మాత్రం అరుదైన సంఘటన చోటు చేసుకుంది.
Also Read
- AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
- SRH Player: ‘టీమిండియా ప్లేయర్ల రహస్యాలను తెలుసుకున్నాను.. ఇదంతా ఐపీఎల్ ఆడటం వల్లనే’..
- AP Govt: కీలక నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్.. ఉద్యోగుల బదిలీలపై నిషేధం పొడిగింపు..
- SIR: కొన్ని గంటల్లో ముగియనున్న SIR ఫారమ్ల సమర్పణ.. 60 శాతం నమోదు..
దాయాది దేశాల పౌరులు ఒక చోటే చేరి వేడుకలు చేసుకున్నారు. ఈ అరుదైన ఘట్టానికి వేదికగా మారింది బ్రిటన్ లోని లండన్ లోని ఓ వీధి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ పాటలతో భారత పౌరులు వేడుకలు చేసుకుంటుంటే అక్కడే ఉన్న పాక్ పౌరులు కూడా వారితో పాటు పాల్గొని డ్యాన్స్ చేశారు. లండన్లోని పికాడిల్లీ సర్కస్లో ఈ అత్యంత అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. పాక్, భారత్ పౌరులందరూ తమ జాతీయ జెండాలు పట్టుకొని పాటలు పాడారు. భారత్కు చెందిన మ్యుజిషియన్, ఇన్స్టాగ్రామ్ సెలబ్రెటీ అయిన విష్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని భారత్, పాక్ పౌరులను తాను కోరినట్లు విష్ తెలిపారు.
Also Read: Tourist Sleep On Eiffel Tower: అరే ఏంట్రా ఇది….తాగి ఈఫిల్ టవర్ పైకెక్కి నిద్రపోయిన టూరిస్ట్లు
బాలీవుడ్ పాటలైన ‘తేరీ మిట్టి’, ‘జై హో’, ‘మా తుజే సలామ్’, ‘సందేసే ఆతే హై’ వంటి పాటలను పాడారు విష్. ఈ పాటలకు అక్కడి భారతీయులు ఆనందంతో డ్యాన్స్ లు చేశారు. సింగర్ తో కలిసి పాటలు పాడారు. దీంతో అక్కడే ఉన్న పాకిస్థానీయులు కూడా ఆ గుంపులో చేరి సంబరాలు జరుపుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పలువురు దీనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలా చూడటం ఆనందంగా ఉందంటూ పేర్కొంటున్నారు. కేవలం భారత్, పాక్ పౌరులు మాత్రమే కాకుండా వేరే దేశం వారు కూడా ఇలా చూడటం ఆనందంగా ఉందంటూ పేర్కొంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Jharkhand Protest: జార్ఖండ్ నిరసనల్లో ‘పుష్ప’.. విద్యార్థుల ఆందోళనలో వైరల్గా మారిన యువకుడు!
-
AP Rain Alert: ఏపీలో రానున్న మూడు గంటలు పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల వారు జాగ్రత్త..
-
Varuna Yagam : ముగిసిన వరుణయాగం.. పాల్గొన్న సీఎం రేవంత్ దంపతులు
-
Kumari Aunty: సినిమాల్లోకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదు!
-
Director Arrested: డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి రేప్.. దర్శకుడు అరెస్ట్
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!