Independence Day:ఒకే చోట స్వాతంత్ర్య దినోత్సవాన్ని చేసుకున్న భారత్, పాక్ పౌరులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజున దేశమంతట సంబరాలు అంబరానంటాయి. అంతేకాకండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరూ తాము ఉన్న చోట స్వాతంత్ర్య దినోత్స వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఇక ఒక చోట మాత్రం చిరకాల ప్రత్యర్థులుగా భావించే భారత్, పాక్ పౌరులు కలిసి స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ అరుదైన సంఘటన బ్రిటన్ లోని లండన్ లో జరిగింది.
భారతదేశం ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటే పాకిస్తాన్ మనకంటే ఒకరోజు ముందే అంటే ఆగస్టు 14న ఇండిపెండెన్స్ డే చేసుకుంటుంది. అయితే భారత్, పాక్ అంటే ఎప్పటికీ ప్రత్యర్థులే అని అనుకుంటూ ఉంటారు. ప్రతి చోటా ఇదే తీరు కనిపిస్తోంది. ఈ క్రికెట్ విషయంలో ప్రత్యర్థులు పోరు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఈ మ్యాచ్ లకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇక స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు కూడా పోటీ పడి మరీ చోటు చేసుకుంటాయి. అయితే ఈ 77వ స్వాతంత్ర్య దినోత్సవం నాడు మాత్రం అరుదైన సంఘటన చోటు చేసుకుంది.
Also Read
- Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
- Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
- Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
- Rahul Gandhi: 152 సార్లు నీట్ పేపర్ లీకైతే ఒక్కరికీ శిక్ష పడలేదు.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
దాయాది దేశాల పౌరులు ఒక చోటే చేరి వేడుకలు చేసుకున్నారు. ఈ అరుదైన ఘట్టానికి వేదికగా మారింది బ్రిటన్ లోని లండన్ లోని ఓ వీధి. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బాలీవుడ్ పాటలతో భారత పౌరులు వేడుకలు చేసుకుంటుంటే అక్కడే ఉన్న పాక్ పౌరులు కూడా వారితో పాటు పాల్గొని డ్యాన్స్ చేశారు. లండన్లోని పికాడిల్లీ సర్కస్లో ఈ అత్యంత అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. పాక్, భారత్ పౌరులందరూ తమ జాతీయ జెండాలు పట్టుకొని పాటలు పాడారు. భారత్కు చెందిన మ్యుజిషియన్, ఇన్స్టాగ్రామ్ సెలబ్రెటీ అయిన విష్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని భారత్, పాక్ పౌరులను తాను కోరినట్లు విష్ తెలిపారు.
Also Read: Tourist Sleep On Eiffel Tower: అరే ఏంట్రా ఇది….తాగి ఈఫిల్ టవర్ పైకెక్కి నిద్రపోయిన టూరిస్ట్లు
బాలీవుడ్ పాటలైన ‘తేరీ మిట్టి’, ‘జై హో’, ‘మా తుజే సలామ్’, ‘సందేసే ఆతే హై’ వంటి పాటలను పాడారు విష్. ఈ పాటలకు అక్కడి భారతీయులు ఆనందంతో డ్యాన్స్ లు చేశారు. సింగర్ తో కలిసి పాటలు పాడారు. దీంతో అక్కడే ఉన్న పాకిస్థానీయులు కూడా ఆ గుంపులో చేరి సంబరాలు జరుపుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో పలువురు దీనిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇలా చూడటం ఆనందంగా ఉందంటూ పేర్కొంటున్నారు. కేవలం భారత్, పాక్ పౌరులు మాత్రమే కాకుండా వేరే దేశం వారు కూడా ఇలా చూడటం ఆనందంగా ఉందంటూ పేర్కొంటూ కామెంట్స్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Schools Closed: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎల్లుండి స్కూల్స్, కాలేజీలు బంద్..
-
Toxic: ‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
-
Petrol Price: పెట్రోల్ ధరలు తగ్గనున్నాయా? నిపుణులు ఏమంటున్నారంటే..?
-
Anupama – Dhruv Vikram: మోస్ట్ వైలెంట్ బ్రేకప్.. అసలు ఇద్దరూ ఎందుకు విడిపోయారు?
-
Pakistan: మధ్యవర్తిత్వం చేశాం కదా $10 బిలియన్లు ఇవ్వండి.. అమెరికాను కోరిన పాకిస్తాన్..
ట్రెండింగ్
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!