Bellamkonda Sai Sreenivas To Act in Garudan Remake: టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుస ఫ్లాఫులతో సతమతం అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ‘ఛత్రపతి’ రీమేక్తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. అది పెద్దగా వర్కవుట్ కాలేదు. ఛత్రపతి డిసాస్టర్గా నిలవడంతో షార్ట్ గ్యాప్ తీసుకున్న సాయి శ్రీనివాస్.. మళ్లీ బిజీ అవుతున్నారు. టాలీవుడ్లో వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా.. కంటెంట్ డ్రివెన్ సబ్జెక్ట్స్ను పిక్ చేసుకుంటున్నారు.
ప్రస్తుతం టైసన్ నాయుడు సినిమా చేస్తున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు సిద్ధమయ్యారు. నేడు ఈ సినిమా షూటింగ్ మొదలవనుంది. ఇక బెల్లంకొండ హీరో మరో సినిమాను కూడా లైన్లో పెట్టారని తెలుస్తోంది. రీసెంట్ తమిళ బ్లాక్బస్టర్ మూవీ ‘గరుడన్’ రీమేక్లో బెల్లంకొండ హీరో నటించనున్నారట. ఈ సినిమా హక్కులను కేకే రాధామోహన్ తీసుకున్నారని, విజయ్ కనకమేడల డైరెక్షన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తమిళ్ చిత్రం రాచ్చసన్ను తెలుగులో రాక్షసుడు పేరుతో రిలీజ్ చేసి సాయి శ్రీనివాస్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ తమిళ్ సినిమాను రీమేక్ చేసేందుకు రెడీ అయ్యారట.
Also Read: Srichakra Milk Products: ‘శ్రీచక్రా మిల్క్ ప్రొడక్ట్స్’ బ్రాండ్ అంబాసిడర్గా స్టార్ హీరో!
గరుడన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ. ఈ సినిమాకు కోలీవుడ్ అగ్ర దర్శకుడు వెట్రిమారన్ కథను అందించగా.. ఆర్ఎస్ దురై సెంథిల్కుమార్ దర్శకత్వం వహించాడు. ఇందులో సూరి, శశికుమార్తో పాటు ఉన్ని ముకుందన్ హీరోలుగా నటించారు. మే 31న థియేటర్లలో రిలీజైన గరుడన్ పెద్ద హిట్గా నిలిచింది. దాదాపు 20 కోట్ల బడ్జెట్తో రూపొందిన ఈ చిత్రం.. యాభై కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. చెన్నై సిటీలో మధ్యలో ఉన్న కోట్ల విలువైన భూమిని తన సొంతం చేసుకోవడానికి మినిస్టర్ ప్రయత్నిస్తుండగా.. మినిస్టర్ను ఎదురించే క్రమంలో ముగ్గురు స్నేహితులు ఎందుకు శత్రువులుగా మారారు?, ఈ పోరాటంలో వారు ఎలాంటి కష్టాలు పడ్డారు? అన్నదే ఈ మూవీ కథ.