Sonusood: సోనూ సూద్ పేరిట మోసం.. రూ.69వేలు స్వాహా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sonusood: కరోనా కాలంలో నటుడు సోనూ సూద్ ఎంతో మందికి సాయం అందించారు. నేటికీ తన సంస్థ ద్వారా ఎంతో మంది నిరుపేదలకు ఆర్థిక సాయం చేస్తున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని నటుడు సోనూ సుద్ పేరిట 69 వేల రూపాయలను స్వాహా చేసిన షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది.
సరస్సులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. ఎంతో మంది ఈ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు. ఆ తర్వాత సోనూసూద్ తన ఆఫీసు నుంచి మాట్లాడుతున్నాడని సైబర్ నేరగాళ్లు సాయం సొమ్మును స్వాహా చేశారు. Any Desk app డౌన్ లోడ్ చేసుకోమని చెప్పి మొత్తం ఓటీపీలు తీసుకుని ఆన్ లైన్ లో రూ.69 వేల 566 దోచుకున్నట్లు తేలింది. ఈ మేరకు బీడ్ సైబర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
Also Read
- Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
- Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
- North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
- Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
Read Also: Immoral Relationship : కొత్త ప్రేమకు మాజీ ప్రియుడు అడ్డంకి.. షాకింగ్ డెసిషన్ తీసుకున్న ప్రియురాలు
మార్చి 21న జైరామ్ హరిభౌ చౌదరి కుమారుడు, ఇద్దరు మేనల్లుళ్లు బీడ్లోని కేజ్ తాలూకాలో సరస్సులో మునిగి చనిపోయారు. చౌదరి కుటుంబంలో శోకసంద్రంలో మునిగిపోవడంతో సామాజిక బాధ్యతగా బంధువులు, స్నేహితులు ఆర్థికంగా ఆదుకున్నారు. ఈ డబ్బుపైన సైబర్ నేరగాళ్ల కన్ను పడింది. మార్చి 30న సోనూసూద్ ఫౌండేషన్ కార్యాలయం నుంచి జైరామ్కు కాల్ వచ్చింది. ‘‘నేను నీకు రూ.3 లక్షల రూపాయల సాయం చేస్తా.. అందుకు నేను అడిగిన సమాచారం చెప్పాలి.. Any Desk appను మొబైల్లో డౌన్లోడ్ చేసుకోమని చెప్పి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఏటీఎం కార్డ్, బ్యాంక్ పాస్బుక్ తదితర సమాచారం తీసుకున్నాడు.
Read Also: Mp Margani Bharat: జగన్ ముందస్తుకి వెళ్ళే ఛాన్స్ లేదు
వివిధ ఓటీపీలు తీసుకుని వారి ఖాతా వరుసగా ఆపై 10 వేలు, 9,999, 18,321, 18,297, 5 వేలు, 4,800, 3049 మొత్తం రూ.69,566 రూపాయలు ఆన్లైన్లో డ్రా అయ్యాయి. డబ్బు కట్ అయిందని తెలుసుకున్న చౌదరి మళ్లీ అదే నంబర్కు ఫోన్ చేశాడు. కానీ, ఆ నంబర్ స్విచ్ఛాఫ్ అయింది. తాను మోసపోయానని తెలుసుకున్న చౌదరి మొదట యూసుఫ్వాద్గావ్ను ఆశ్రయించి సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కాగా, ఈ వ్యవహారంపై సైబర్ ఠాణాలో కేసు నమోదైంది.
తాజావార్తలు
-
Sugar Price Hike: పండుగల వేళ చక్కెర ధరకు రెక్కలు.. తాజాగా ఎంత పెరిగిందంటే..!
-
Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
-
North Korea: కిమ్ జోంగ్ ఉన్ ఎక్కడ? రెండు నెలలుగా కనిపించని ఉత్తర కొరియా అధినేత
-
Medico Priyanka : కిమ్స్లో కూతురు మృత్యుపోరాటం.. తండ్రి కన్నీటి వేడుకోలు.!
-
Mrunal Thakur-Yashasvi Jaiswal Dating: యశస్వితో రిలేషన్షిప్.. మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్.. నిజమెంత?
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!