BCCI: టీమిండియా ప్రక్షాళన కోసం ‘10 పాయింట్ల’ పాలసీ తీసుక రానున్న బీసీసీఐ!
- టీమిండియా ప్రక్షాళనను మొదలు పెట్టిన టీమిండియా.
- 10 పాయింట్ల’ పాలసీ తీసుకరాబోతున్న బీసీసీఐ.
- జట్టులో సానుకూల వాతావరణాన్ని సృష్టించడం కోసమే బీసీసీఐ నిర్ణయం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BCCI: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 10 కొత్త నిబంధనలను జారీ చేసేందుకు సన్నద్ధమైంది. ఇది టీమిండియా ఆటగాళ్లందరూ తప్పనిసరిగా అనుసరించాలి. వీటిని ఉల్లంఘించిన ఆటగాళ్లకు కఠిన శిక్షలు కూడా విధించబోనుంది బీసీసీఐ. నిబంధనలను ఉల్లంఘిస్తే ఐపీఎల్ నిషేధం, జీతం కోత వంటి అంశాలు తీసుకురానున్నారు. నిజానికి ఇదంతా జట్టులో సానుకూల వాతావరణాన్ని సృష్టించడం కోసమే అంటూ సమాచారం. ఇక బీసీసీఐ జారీ చేసిన మొత్తం 10 నియమాలు ఏమిటో ఒకసారి చూద్దాం.
Also Read
* భారత జాతీయ జట్టుకు ఆడుతున్న ఆటగాళ్లందరూ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో ఉన్నారు. వీరంతా దేశవాళీ క్రికెట్తో క్రమం తప్పకుండా అనుబంధం కలిగి ఉండాలి. ఒకవేళ ఆటగాడికి సమస్య ఉన్నట్లయితే, అతను చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నుండి అనుమతి తీసుకోవాలి.
* మ్యాచ్ల కోసం లేదా ప్రాక్టీస్ సెషన్ కోసం ప్రయాణించే ఆటగాళ్లందరూ కలిసి ప్రయాణించడం తప్పనిసరి. ఆటగాళ్లు తమ కుటుంబాలతో కలిసి ప్రయాణించేందుకు అనుమతించబోమని బోర్డు స్పష్టం చేసింది.
* ప్రయాణ సమయంలో ఆటగాళ్లు అధికంగా లగేజీని తీసుకోకుండా నిషేధించబడతారు. ఆటగాళ్ళు ఇప్పుడు 150 కిలోల వరకు లగేజీని, సహాయక సిబ్బందిని 80 కిలోల వరకు ఒకే ప్రయాణంలో తీసుకెళ్లవచ్చు. ఎవరైనా ఆటగాడు ఈ నిబంధనను ఉల్లంఘిస్తే, అతను స్వయంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.
* బీసీసీఐ అనుమతి లేకుండా ఆటగాళ్లు తమతో వ్యక్తిగత సిబ్బందిని (మేనేజర్, కుక్ మొదలైనవి) ఏ పర్యటన లేదా సిరీస్కు తీసుకెళ్లలేరు.
* ఇప్పటి దాకా స్టార్ క్రికెటర్లకు వ్యక్తిగత రూమ్లు ఇచ్చింది బీసీసీఐ. ఇకపై కేవలం సహచర ప్లేయర్లతో కలిసి ఉండేలా రూమ్ను షేర్ చేసుకోవాలి. అయితే కుటుంబం వచ్చినప్పుడు మాత్రం ప్రత్యేకంగా ఉండేందుకు అనుమతి వస్తుంది.
* ఆటగాళ్లందరూ ప్రాక్టీస్ సెషన్లలో పాల్గొనాలి. బస చేసిన ప్రదేశం నుండి మైదానానికి కలిసి ప్రయాణించాలి. జట్టులో ఐక్యతను తీసుకురావడానికి దీనిని తీసుక రానున్నారు.
Also Read: IPL 2025: ఢిల్లీకి కెప్టెన్గా రాహుల్ కాదా? ఆ ఆటగాడికి పట్టం కట్టడానికి సిద్ధమైన టీం మేనేజ్మెంట్!
* ఏదైనా సిరీస్ జరుగుతున్నా లేదా జట్టు విదేశీ పర్యటనలో ఉన్నా.. ఆ సమయంలో, ఆటగాళ్లకు వ్యక్తిగత ప్రకటన షూట్లు చేయడానికి లేదా స్పాన్సర్లతో పని చేయడానికి స్వేచ్ఛ ఉండదు.
* భారత జట్టు 45 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు విదేశీ పర్యటనలో ఉంటే. అటువంటి పరిస్థితిలో, ఆటగాడి కుటుంబం అతనితో 2 వారాలు మాత్రమే ఉండగలదు. విజిటింగ్ పీరియడ్ ఖర్చులను బీసీసీఐ భరిస్తుందని, మిగతా ఖర్చులను ఆటగాళ్లే భరించాల్సి ఉంటుంది.
* షూట్లు, బీసీసీఐ నిర్వహించే అన్ని ఇతర కార్యక్రమాలకు ఆటగాళ్లు అందుబాటులో ఉండాలి. ఇది జట్టు పట్ల ఆటగాళ్ల ఐక్యతను పెంపొందించడంతో పాటు క్రికెట్ ఆటను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది.
* నిర్ణీత సమయానికి ముందే మ్యాచ్ ముగిసినా.. మ్యాచ్ లేదా సిరీస్ ముగిసే వరకు ఆటగాళ్లందరూ కలిసి ఉండాలి.
తాజావార్తలు
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
-
Shreyas Iyer: చరిత్రను లిఖించనున్న శ్రేయస్ అయ్యర్.. 2028 వరకు కెప్టెన్గా సర్పంచ్ సాబ్..
-
Hyderabad: బంధాల్ని తెంచుతున్న వివాహేతర సంబంధాలు.. తెలుగు రాష్ట్రాల్లో కలకలం
-
NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
-
Natural gas: భారత్కు జాక్పాట్.. అండమాన్లో గ్యాస్ నిల్వలు..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!