UP: వరకట్న హత్య కేసులో భర్త, అత్తమామలకు జీవిత ఖైదు
- వరకట్న హత్య కేసులో భర్త.. అత్తమామలకు జీవిత ఖైదు
- ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో స్థానిక కోర్టు తీర్పు
- దీంతో పాటు ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున జరిమానా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్తరప్రదేశ్లోని బరేలీలోని స్థానిక కోర్టు వరకట్న హత్య కేసులో మరణించిన మహిళ భర్త, అత్తమామలకు జీవిత ఖైదు విధించింది. దోషిగా తేలిన భర్త దర్శన్ సింగ్ (29), అతని తల్లి కమలేష్ దేవి (63)లకు ఒక్కొక్కరికి రూ.15,000 జరిమానా విధిస్తూ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి అభయ్ శ్రీవాస్తవ తీర్పు చెప్పారు.
READ MORE: CP Srinivas Reddy: గుజరాత్లో 10 రోజుల పాటు ఆపరేషన్.. వెయ్యి కేసుల్లో నిందితులు అరెస్ట్
Also Read
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
- కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
బరేలీ నగరంలోని సిబిగంజ్ ప్రాంతానికి చెందిన ప్రమోద్ కుమార్.. తన కుమార్తెకు చనేటా గ్రామానికి చెందిన దర్శన్ సింగ్తో 2020లో వివాహం జరిపించారు. పెళ్లయినప్పటి నుంచి కూతురిని భర్త, అత్తగారు వేధించేవారని బాధితురాలి తండ్రి ప్రమోద్ పేర్కొన్నారు. రిఫ్రిజిరేటర్, రూ.2 లక్షలు ఇవ్వాలని వేధించారు. దీంతో బాధితురాలు ఆందోళన చెందుతూ ఉండేది. వరకట్న డిమాండ్ నెరవేరకపోవడంతో.. నిందితులు ఫిబ్రవరి 6, 2021న బాధితురాలిని హత్య చేశారు. పోస్టుమార్టంలో బాధితురాలి మెడపై తాడు గుర్తులు కనిపించడంతో అసలు నిజం బయటకు వచ్చింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ ఏడుగురు సాక్షులను హాజరుపరిచింది. అనంతరం కోర్టు శిక్షను ఖరారు చేసింది. ఈ మేరకు 2021లో ఫతేగంజ్ వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు జిల్లా ప్రభుత్వ అసిస్టెంట్ అడ్వకేట్ అనూప్ కొహర్వాలా తెలిపారు. ఈ కేసుకు సంబంధించి నేడు జీవిత ఖైది విధిస్తూ.. తీర్పు వెలువడిందని పేర్కొన్నారు.
READ MORE: Rajini: 15,000 అడిగిన రజనీకి 1,10,000 చెల్లించిన నిర్మాత.. ఏ సినిమానో తెలుసా?
కాగా.. ఉత్తరప్రదేశ్లోని బల్లియా జిల్లా నుంచి గత వారం మరో వరకట్న మరణ కేసు వెలుగులోకి వచ్చింది. కట్నం డిమాండ్తో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేశాడు. ఈ కేసులో నిందితుడైన భర్తతో పాటు అతని ఇద్దరు కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు, బాధితురాలు 2019 సంవత్సరంలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కట్నం కోసం డిమాండ్ మొదలైంది. నెరవేరకపోవడంతో ఇటీవల హత్య చేశాడు.
తాజావార్తలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
IND vs SL Test: శ్రీలంకలో టీమిండియా ల్యాండ్.. స్టార్ ప్లేయర్ మిస్సింగ్.. మొదటి టెస్ట్ డౌటే!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
Varanasi: మహేష్ పుట్టినరోజుకు ‘వారణాసి’ గిఫ్ట్ ఉంటుందా?.. 80% షూటింగ్ పూర్తయినా పోస్టర్ తో సరిపెట్టుకుంటారా ?
ట్రెండింగ్
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!
-
50 గంటల బ్యాటరీ, 1.69 అంగుళాల డిస్ప్లే, పాప్-అప్ డిజైన్తో Lava Probuds Xplore 25° TWS ఇయర్బడ్స్ లాంచ్..!
-
POCO M8 Power 5G లాంచ్.. 8000mAh భారీ బ్యాటరీ, 120Hz OLED డిస్ప్లేతో అదిరిపోయే ఫోన్.!