Jewellery Missing: ఛీ.. ఛీ.. మృతదేహాల నుంచి ఆభరణాలు కొట్టేయడం ఏంటయ్యా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jewellery Missing: ఉత్తరప్రదేశ్ లోని బరాబంకి జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం ఇప్పుడు ఓ వివాదానికి దారి తీసింది. ఇసేపూర్ రైల్వే క్రాసింగ్ సమీపంలో శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు. అయితే పోస్ట్మార్టం అనంతరం మృతదేహాల నుంచి ఆభరణాలు మాయమైనట్లు కుటుంబ సభ్యులు ఆరోపించడంతో ఘటన కొత్త మలుపు తిరిగింది. మృతి చెందిన మహిళల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు చేసిన ప్రాథమిక పరిశీలనలో ఆభరణాల వివరాలు నమోదు చేసినట్లు వెల్లడించారు.
PSL 2026 Ball Tampering: పాకిస్థాన్ లీగ్లో బాల్ ట్యాంపరింగ్.. బజారున పీఎస్ఎల్ పరువు!
Also Read
- Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
- Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్పై సుప్రీంకోర్టు ఆగ్రహం
- YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
కానీ పోస్ట్మార్టం తర్వాత మృతదేహాలను తీసుకునేందుకు వెళ్లినప్పుడు మహిళల శరీరాలపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలు కనిపించలేదని వారి బంధువులు ఆరోపించారు. ఈ ఘటనపై వారు కోతవాలి పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వక ఫిర్యాదు అందించారు. ఈ ప్రమాదంలో దేవరాణి, జేఠాని ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందగా.. మూడు సంవత్సరాల చిన్నారి తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం ఆ చిన్నారి సమీపంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతోంది. ఆదివారం రోజున మృతదేహాలకు పోస్ట్మార్టం నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
మృతదేహాలు అందుకున్న తర్వాత కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలు తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి. మహిళల చెవులకు ఉన్న జుమ్కీలు, మెడలో ఉన్న మంగళసూత్రం, చైన్ వంటి ఆభరణాలు కనిపించలేదని వారు అందించిన రిపోర్ట్ లో పేర్కొన్నారు. కేవలం ఒక మహిళ పాదాల్లో కాలి గొలుసు (గజ్జె) మాత్రమే మిగిలి ఉందని అన్నారు. మిగతా అన్ని ఆభరణాలు గల్లంతయ్యాయని వారు ఆరోపించారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదని, దీనికి వెనుక ఏదైనా కుట్ర ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఈ ప్రమాదం సీతాపూర్ జిల్లాలోని మహ్ముదాబాద్ ప్రాంతానికి చెందిన ఇంద్రజీత్ వర్మ తన భార్య ఖుషీ వర్మ (18), వదిన పింకీ దేవి (28), మూడు సంవత్సరాల మేనకోడలితో కలిసి బైక్పై బంధువుల ఇంటికి వెళ్తున్న సమయంలో జరిగింది. రైల్వే క్రాసింగ్ తెరుచుకున్న వెంటనే వేగంగా వచ్చిన ట్రక్ వారి బైక్ను ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రస్తుతం పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసుకు సంబంధించి పోస్ట్మార్టంలో పాల్గొన్న సిబ్బందిని విచారించి, ఆభరణాలు మాయమైన ఘటన వెనుక అసలు కారణాలను త్వరలో వెల్లడిస్తామని అధికారులు తెలిపారు. కేసులో దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Oppo A7 Pro 5G: ఒప్పో A7 Pro 5G లాంచ్.. 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
-
Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
-
Trade War: అమెరికాపై యుద్ధం ప్రకటించిన పొరుగుదేశం! అగ్రరాజ్యం వస్తువులపై 50% టారిఫ్..
-
AI Danger Warning: Anthropic పరిశోధకుడు రాజీనామా.. షాకింగ్ వార్నింగ్.. ఈ దశాబ్దం చివరికి AIతో మానవాళికి ముప్పు?
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!