Bangladesh: పాకిస్థాన్ బాటలో బంగ్లాదేశ్? భారత్కు ముప్పుగా ఉగ్రవాద గ్రూపులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్ మరోసారి ఉలిక్కిపడింది. భారతదేశాన్ని తీవ్రంగా విమర్శించిన షరీఫ్ ఉస్మాన్ హాది మరణం తరువాత, ఢాకాలో హింస చెలరేగింది. నిరసనకారులు రెండు వార్తాపత్రిక కార్యాలయాలను తగలబెట్టారు. భారత హైకమిషన్ను చుట్టుముట్టారు. కమషన్ భవనంపై రాళ్ళు రువ్వారు. భారత వ్యతిరేక నినాదాలు చేశారు. రాజకీయ అస్థిరతతో పోరాడుతున్న బంగ్లాదేశ్ భారతదేశానికి ఆందోళనకరంగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు. భారత్ ఇప్పటికే పాకిస్థాన్ నుంచి ఉగ్రవాద సవాళ్లను ఎదుర్కొంటోంది. తాజాగా బంగ్లాదేశ్ కూడా సైతం ఉగ్రవాదుల నియంత్రణలోకి వస్తే.. జైష్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు ఎదగడం సులభం అవుతుంది. ఇది మన దేశానికి పెద్ద ముప్పుగా మారే అవకాశం లేకపోలేదు.
READ MORE: TTD Parakamani Case: టీటీడీ పరకామణి కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు
Also Read
- LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
- Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
- Pak vs WI: వెస్టిండీస్పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
ఇటీవలి సంవత్సరాల్లో బంగ్లాదేశ్లో రాడికల్ ఇస్లామిక్ సంస్థల కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ఇది భారత భద్రతా సంస్థలలో ఆందోళనలను రేకెత్తిస్తోంది. సకాలంలో కఠినమైన చర్యలు తీసుకోకపోతే, బంగ్లాదేశ్ క్రమంగా పాకిస్థాన్ మాదిరిగానే ఉగ్రవాద నెట్వర్క్ను అభివృద్ధి చేయగలదని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే.. అక్కడ లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి సంస్థలు భారతదేశానికి వ్యతిరేకంగా స్థావరాన్ని ఏర్పరచుకుంటున్నాయనే వాదనలు సైతం వినిపిస్తున్నాయి. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు గతంలో బంగ్లాదేశ్ రాడికల్ గ్రూపులతో సంబంధాలు కొనసాగించాయని భద్రతా సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఈ పరిచయాలు భారతదేశ తూర్పు ప్రాంతంలో అస్థిరత పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ కూటమి బలపడితే.. భారత్ పశ్చిమ, తూర్పు భాగాల్లో ఉగ్రవాదం నుంచి ద్వంద్వ సవాలును ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్ని నెలల క్రితం.. లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ బంగ్లాదేశ్లోని రాడికల్ సంస్థలతో చేతులు కలిపాయని ఒక నివేదిక పేర్కొంది. భారతీయ యువతను బ్రెయిన్వాష్ చేయడం, రాడికల్గా మార్చడం వారి లక్ష్యంగా చేసుకున్నట్టు నివేదిక స్పష్టం చేసింది.. బంగ్లాదేశ్ రాడికల్ సంస్థలు లష్కరే, జైషే విశ్వవిద్యాలయాలలో ప్రవేశం పొందడానికి సహాయం చేస్తున్నాయని పేర్కొన్నారు.
READ MORE: Aindrita Ray: ఇంట్లో ఊపిరాడడం లేదు.. చెత్తకుప్పలు తగలబెట్టడంపై నటి ఆవేదన
ఇప్పటికే.. బంగ్లాదేశ్లో జమాత్-ఉల్-ముజాహిదీన్ బంగ్లాదేశ్, అన్సరుల్లా బంగ్లా టీమ్, హిజ్బ్-ఉట్-తహ్రీర్ వంటి రాడికల్ సంస్థల సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ సంస్థలు గతంలో బాంబు దాడులు, లక్ష్యంగా హత్యలు, రాడికల్ భావజాలాన్ని వ్యాప్తి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నాయి. షేక్ హసీనా ప్రభుత్వ హయాంలో కఠినమైన అణిచివేత చర్యలు అమలు చేశారు. దీని వలన వారి నెట్వర్క్ బలహీనపడింది. అయితే.. ఇటీవలి రాజకీయ అస్థిరత, పరిపాలనా నిర్లక్ష్యం మధ్య ఆ సంస్థలు మళ్లీ చురుకుగా మారవచ్చనే భయాలు ఉన్నాయి. భారత్కు ప్రధాన ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే.. బంగ్లాదేశ్తో ఉన్న పొడవైన సరిహద్దు ప్రాంతాలు. పశ్చిమ బెంగాల్, అస్సాం, త్రిపుర, మేఘాలయ సరిహద్దులు ఇప్పటికే అక్రమ చొరబాటు, అక్రమ రవాణా, నకిలీ కరెన్సీకి ప్రసిద్ధి చెందాయి. రాడికల్ సంస్థలు తిరిగి పుట్టుకొచ్చే అవకాశం ఇస్తే, పాకిస్థాన్ విషయంలో లాగానే ఈ సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద కదలిక, స్లీపర్ సెల్స్, ఆయుధ అక్రమ రవాణాకు మార్గంగా మారవచ్చు. ఈ ముప్పును అరికట్టడానికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలు భారత్ ఆలోచించాలి.
తాజావార్తలు
-
Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
VrushaKarma : భారీ ధర పలికిన ‘వృషకర్మ’ నైజాం థియేట్రికల్ రైట్స్
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
Huawei MateBook Pro S: హువావే మేట్బుక్ ప్రో ఎస్ విడుదల.. అత్యంత తేలికైన ల్యాప్టాప్.. Kirin XE90 ప్రాసెసర్
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!