ROKO Jodi: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అభిమానులకు శుభవార్త.. ఒక్క నెలలో మళ్లీ బరిలోకి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాంగ్లాదేశ్ యువజన, క్రీడా శాఖ సహాయ మంత్రి అమీనుల్ హక్ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే సెప్టెంబర్లో భారత క్రికెట్ జట్టుకు ఆతిథ్యమిచ్చేందుకు తమ దేశం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తోందని ఆయన తెలిపారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఎలాంటి విభేదాలనైనా, దూరాలనైనా ‘స్పోర్ట్స్ డిప్లొమసీ’ (క్రీడా దౌత్యం) ద్వారా సమర్థవంతంగా తొలగించవచ్చని తాను బలంగా నమ్ముతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఆగస్టు-సెప్టెంబర్ 2026 మధ్యకాలంలో భారత జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్ల సిరీస్ను నిర్వహించనున్నట్లు బాంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఈ ఏడాది ఆరంభంలోనే ప్రకటించింది. వాస్తవానికి ఈ పర్యటన 2025లోనే జరగాల్సి ఉన్నప్పటికీ, రెండు దేశాల మధ్య తలెత్తిన దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా వాయిదా పడింది. గతంలో ఏర్పడిన పరిస్థితులు, భద్రతా కారణాల దృష్ట్యా అప్పటి యూనస్ ప్రభుత్వం భారతదేశంలో జరిగిన టీ20 ప్రపంచకప్లో పాల్గొనకుండా వెనక్కి తగ్గింది. దీంతో ఈ ద్వైపాక్షిక సిరీస్ నిర్వహణపై తీవ్ర అనుమానాలు వ్యక్తమయ్యాయి.
Also Read
- Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
- Vaibhav Sooryavanshi-Brett Lee: అవును, వైభవ్ సూర్యవంశీ వయసు 18 ఏళ్లు అయినా ఎవరికి నష్టం?
- Lal Darwaza Bonalu: పాతబస్తీలో బోనాల పండుగ శోభ.. అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- Ravindra Jadeja: ఎట్టకేలకు గంభీర్ ముఖంలో నవ్వులు పూయించిన జడేజా.. ఏం చేశాడో చూడండి (వీడియో)
అయితే ఈ నెల ప్రారంభంలో భారత్ సిరీస్ కోసం బీసీబీ టెలివిజన్, మీడియా హక్కుల విక్రయాన్ని ప్రారంభించడంతో పర్యటన మళ్లీ పట్టాలెక్కినట్లు సంకేతాలు వచ్చాయి. ఆగస్టులో భారత జట్టు శ్రీలంక పర్యటన షెడ్యూల్లో టీ20 మ్యాచ్లు లేకపోవడం కూడా బాంగ్లాదేశ్ టూర్కు మార్గం సుగమం చేస్తుందని భావించారు. అంతేకాకుండా, అవసరమైతే భారత జట్టు కోసం భద్రతా ఏర్పాట్లను మరింత కట్టుదిట్టం చేస్తామని బీసీబీ స్పష్టం చేసింది. కానీ, హఠాత్తుగా మీడియా హక్కుల విక్రయ ప్రక్రియను బీసీబీ నిలిపివేయడంతో మళ్లీ అయోమయం నెలకొంది.
ఈ నేపథ్యంలో మంత్రి అమీనుల్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం క్రీడా దౌత్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని వివరించారు. విశ్వక్రీడలలో క్రికెట్ బాంగ్లాదేశ్కు ఒక ప్రత్యేక గౌరవాన్ని తెచ్చిపెట్టిందని, భారత్కు స్వాగతం పలికేందుకు ఇప్పటికే భారత రాయబార కార్యాలయంతో చర్చలు జరిపినట్లు చెప్పారు. గతంలో జరిగిన చిన్న చిన్న సంఘటనల వల్ల ఏర్పడిన ఉద్రిక్తతలను ఈ సిరీస్ ద్వారా తొలగించుకుంటామని, పొరుగు దేశంతో క్రీడలు, కమ్యూనికేషన్ బంధాలు కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో ప్రపంచకప్ నుండి వైదొలగడానికి దౌత్యపరమైన వైఫల్యమే కారణమా కాదా అనే అంశంపై విచారణకు బాంగ్లాదేశ్ క్రీడా మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ఈ సిరీస్ కన్ఫామ్ అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరో నెలలోనే గ్రౌండ్లో కనిపించనున్నారు.
తాజావార్తలు
-
Ashmita Chaliha: కొరియాలో భారత త్రివర్ణం రెపరెపలు.. చైనా షట్లర్ను చిత్తు చేసిన అష్మిత చాలిహా.. తొలి BWF టైటిల్ సొంతం!
-
Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ
-
Himanshi Khurana Murder: కెనడాలో భారత సంతతికి చెందిన యువతి హ*త్య కేసులో కీలక పరిణామం.. 7 నెలల తర్వాత నిందితుడి అరెస్ట్
-
Adnan Sami: ఆరు నెలలే బ్రతుకుతానన్నారు.. తండ్రికిచ్చిన మాటకోసం 110 కిలోలు తగ్గినా: అద్నాన్ సమి
-
TVS Apache RTR 160 Price Hike: టీవీఎస్ Apache RTR 160 ధర పెంపు.. 2V, 4V కొత్త ధరలు, పూర్తి వివరాలు ఇవే!
ట్రెండింగ్
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!