Bandi Sanjay : ఓల్డ్ సిటీలో ఎక్కడైనా అంబేద్కర్ విగ్రహం పెట్టారా..?
- వక్ఫ్ భూములపై బండి సంజయ్ ఆగ్రహం
- కాంగ్రెస్-ఎంఐఎం అంబేద్కర్ ను అవమానించారు
- రైతుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన బండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay : పెద్దపల్లిలో కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన స్థలంలో దారుసలామ్ మీటింగ్ పెట్టడం అన్యాయమే కాదు, పేద ముస్లింలకు గుణపాఠం చెబుతోందని మండిపడ్డారు. ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు కలిసి పేద ముస్లింల పొట్ట కొట్టే విధంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు.
వక్ఫ్ బిల్లును పేద ముస్లింల కోసం తీసుకువచ్చినట్లు చెప్పిన సంజయ్, “బడాబాబులు, బడా చోర్లు కలిసి హైదరాబాద్లో పెద్ద మీటింగ్ పెట్టారు. ఎవరి కోసం? పేదల కోసం కాదు!” అని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. అలాగే, బాబా సాహెబ్ అంబేద్కర్ పై అవమానం చేసిన పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. “ఎంఐఎం ఏదైనా ఒక్కసారైనా అంబేద్కర్ జయంతి, వర్థంతి చేసింది? ఓల్డ్ సిటీలో ఎక్కడైనా అంబేద్కర్ విగ్రహం పెట్టారా?” అంటూ ప్రశ్నించారు. వక్ఫ్ భూములపై వివరణ ఇస్తూ, “హర్యానాలో సిక్కుల దేవాలయం, రైల్వే స్టేషన్, పార్లమెంటు భవనాలపై వక్ఫ్ హక్కులు అంటున్నారు. అయోధ్యలో రాముడి పుట్టిన స్థలానికి ఆధారం అడుగుతున్నారు. మీ జాతికి ఒక న్యాయం, మా జాతికి ఇంకో న్యాయమా?” అని కేంద్ర మంత్రి నిలదీశారు.
Also Read
- Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
- Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
- Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ 'ఎ' ట్రై-సిరీస్ పోరు..
- Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
సుప్రీంకోర్టుపై తమకున్న నమ్మకాన్ని వ్యక్తం చేసిన బండి సంజయ్, “మేము ఎప్పటికీ సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా వెళ్లం,” అని అన్నారు. తెలంగాణ సీఎం విదేశీ పర్యటనలపై సెటైర్లు వేసిన సంజయ్, “జపాన్, దావోస్ వెళ్లి లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయని చెబుతున్నారు. వాటిలో ఒక్కటి అన్న చూపించండి,” అని సవాల్ విసిరారు. ఇకపోతే, ఇటీవల వడగళ్ల వానలతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్న ఆయన, “ఎంత మంది రైతులకు పరిహారం ఇచ్చారు? గతంలో ఎంత ఇచ్చారు? ఇప్పుడేం చేస్తున్నారు?” అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులను ఆదుకోవాలంటూ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!