Bandi Sanjay : ఎంఐఎం ఆగడాలను అడ్డుకునేది బీజేపీ మాత్రమే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజాసంగ్రామ యాత్ర పేరిట తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే.. అయితే నేడు నాగోల్లో ప్రజా సంగ్రామ యాత్రలో సాగుతోంది. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. 2040 నాటికి భారత్ ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు పీఎఫ్ఐ కుట్ర చేసిందన్నారు. ఎంఐఎం కనుసన్నల్లో పీఎఫ్ఐ నడుస్తోందని, జిమ్, స్వచ్ఛంద సంస్థల పేరుతో పీఎఫ్ఐ విస్తరిస్తోందని ఆయన ఆరోపించారు. పీఎఫ్ఐను టీఆర్ఎస్ పెంచి పోషిస్తోందని,
హిందువుల తలలు నరుకుతున్న పీఎఫ్ఐ సంస్థ తెలంగాణలో విస్తరిస్తుంటే కేసీఆర్ కు సిగ్గు లేదా? ఎన్ఐఏ వచ్చి సోదాలు జరిపే వరకు పీఎఫ్ఐ గురించి సర్కార్ కు సోయి ఎందుకు లేదు? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా.. ఎంఐఎం ఆగడాలను అడ్డుకునేది బీజేపీ మాత్రమేనని, హిందూ సమాజ సంఘటితమే బీజేపీ లక్ష్యమన్నారు.
Also Read
కేంద్రం ఇండ్లు మంజూరు చేసినా లెక్క చెప్పని కేసీఆర్.. భూములున్నా పట్టాలివ్వని దుర్మార్గుడని ఆయన మండిపడ్డారు. రిజిస్ట్రేషన్ల బంద్ తో నానా అవస్థలు పడుతున్న వేలాది మంది బాధితులు.. కేసీఆర్ కుటుంబానికి లంచాలిస్తే తప్ప పనులు కాని దుస్థితి ఉందని ఆయన అన్నారు. కుక్క తోక వంకర తరహా కేసీఆర్ తీరు ఉందని, ప్రశ్నిస్తున్న కార్పొరేటర్లను అరెస్ట్ చేసి జైళ్లో పెడతారా? అని ఆయన ధ్వజమెత్తారు. ఏ స్కాం చూసినా కేసీఆర్ కుటుంబానిదే పాత్ర అని, కొడుకు, బిడ్డ తప్పు చేసినా జైల్లో పెడతానన్న కేసీఆర్…. లిక్కర్ స్కాంపై నోరెందుకు మెదపవు? సీబీఐ, ఈడీ దాడులు చూసి క్వారంటైన్ పోతున్న కేసీఆర్ కుటుంబం. సీఎం కుటుంబాన్ని తెలంగాణ పొలిమెర దాటేదాకా తరిమి తరిమి కొట్టేదాకా విశ్రమించబోమని ఆయన అన్నారు. బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండని ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!