Bandi Sanjay : ఈ ప్రభుత్వంలో హిందువుల పండుగలు వస్తే పర్మిషన్లు తీసుకోవాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ 2018 లో మీటింగ్ పెట్టి 100 పడకల ఆసుపత్రి కడతా అన్నాడు, డిగ్రీ కాలేజ్ అన్నాడు, చిల్పూర్ గుట్ట అభివృద్ధి అన్నాడు, దళిత బంధు అన్నాడు, దళితులకు 3 ఎకరాలు అన్నాడు , ఇచ్చారా, డబుల్ బెడ్ రూములు ఇచ్చారా అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఓట్లు వేసి గెలిపిస్తే, గెలిచినోడు ప్రగతి భవన్ కు వెళ్లి గళ్ళ పట్టి తన్నాలి అంటూ వ్యాఖ్యానించారు. దేశంలో ఉన్న నాయకులు అందరూ వచ్చి, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ముఖ్యమంత్రి తిరుగుతున్నాడా, కనబడుతున్నాడా. ఈడీ అనగానే దడ పుట్టి చద్దరి కప్పుకొని పడుకున్నాడు. మునుగోడు అనగానే భయపడితే, ఇంట్లొళ్ళు వాళ్ళు బయటకి నెట్టి మీటింగ్ కు పంపిస్తే, మీటింగ్ ఫెయిల్ అయింది. ముఖ్యమంత్రి ఏమి ఇవ్వకనే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. హుజురాబాద్ ఎలెక్షన్లలో మోటర్లకు, మీటర్లు పెడుతున్నారు అని అంటున్నాడు, ఎక్కడైనా పెట్టామా.. మునుగోడు లో కూడా అన్నాడు, పెట్టామా.. తాగి బండి నడిపితే నేరం అయినప్పుడు, తాగి రాష్ట్రాన్ని నడిపితే నేరమా, కాదా… మోటర్లకు మీటర్లు పెడతామని కేంద్రం అన్నట్టైతే భద్రకాళి గుడి దగ్గరికి రా…ప్రమాణం చేద్దాం.. ఓల్డ్ సిటీకి వెళ్లి కరెంటు బిల్లు వసూలు చేస్తే దమ్ము లేని చేతకాని దద్దమ్మ కేసీఆర్.. వినాయక చవితి వస్తే పోలీస్, రెవిన్యూ కరెంట్ పర్మిషన్ తీసుకోవాలి, ఓల్డ్ సిటీ లో అడిగే దమ్ముందా..? తెలంగాణలో రైతులు చనిపోతే ఒక రూపాయి ఇయ్యని కేసీఆర్ పంజాబ్ లో చనిపోయిన రైతులకు ఒక్కొక్కరికి మూడు లక్షల ఇచ్చిన దద్దమ్మ కేసీఆర్. ఈ ప్రభుత్వం లో హిందువుల పండుగలు వస్తే పర్మిషన్లు తీసుకోవాలి.
Also Read
- Pawan Kalyan: పార్టీ బలోపేతంపై పవన్ కల్యాణ్ ఫోకస్.. 25 మంది పరిశీలకుల ప్రకటన
- X Down: ‘ఎక్స్’కు అంతరాయం.. లక్షలాది మంది యూజర్లకు ఇక్కట్లు
- నల్గొండలో దారుణం.. ఒకే ఇంట్లో కుళ్ళిన స్థితిలో నాలుగు మృతదేహాలు..
- Sanju Samson: ధోనీ, కోహ్లీని టెన్నిస్ స్టార్లతో పోల్చిన సంజూ శాంసన్.. ఆయన ఫెడరర్.. ఈయన అల్కరాజ్..!
టీఆర్ఎస్, సీపీఎం, కాంగ్రెస్ వాళ్ళు గుంటనక్కలు, నేను హిందువును, బిజెపి వాళ్లు సింహం లాంటోళ్లు ,నేను నా ధర్మం కోసం కొట్లాడుతా. టీఆర్ఎస్ కాంగ్రెస్ గుంపులు గుంపులుగా వస్తారు బీజేపీ మాత్రం సింగిల్ గా వస్తది.. 15 నిమిషాలు సమయమిస్తే హిందువులను చంపుతా అన్న ఒవైసీతో స్నేహం చేస్తున్నాడు. అందరూ భగవద్గీత మీద ప్రమాణం చేస్తే, ట్విట్టర్ టిల్లు మాత్రం అతని మనస్సాక్షి గా ప్రమాణం చేస్తాడట… దేవుడిని నమ్మని నాస్తికుడు కేసీఆర్ కొడుకు కేటీఆర్. మనం రోజుకో దేవుణ్ణి మొక్కుతాం… గోమాత ను చంపి బిర్యానిసుకునుని తింటారట. బీజేపీ ఏ మతాన్ని కించపరుచదు. హిందూ ధర్మాన్ని కించపరిస్తే చూస్తూ ఉరుకొము, హిందువులు ఓటు బ్యాంకు గా మారాలి. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ కు అవకాశం ఇచ్చారు, ఒక్కసారి బీజేపీ కి అవకాశం ఇవ్వండి, నిజాయితీ వంత పాలన చేస్తాము. అవినీతి, రజాకార్ల పాలనను తరిమికొట్టుతాము. పేదోళ్ళు అమరులైతే, పెద్దోళ్ళు గడ్డనెక్కారు, మాది పేదోళ్ల పార్టీ అంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: పార్టీ బలోపేతంపై పవన్ కల్యాణ్ ఫోకస్.. 25 మంది పరిశీలకుల ప్రకటన
-
X Down: ‘ఎక్స్’కు అంతరాయం.. లక్షలాది మంది యూజర్లకు ఇక్కట్లు
-
నల్గొండలో దారుణం.. ఒకే ఇంట్లో కుళ్ళిన స్థితిలో నాలుగు మృతదేహాలు..
-
Sanju Samson: ధోనీ, కోహ్లీని టెన్నిస్ స్టార్లతో పోల్చిన సంజూ శాంసన్.. ఆయన ఫెడరర్.. ఈయన అల్కరాజ్..!
-
World Cup 2027: ఆ కాటేరమ్మ కొడుకు అంటే గంభీర్కు ఎంతో ఇష్టం.. వరల్డ్ కప్లో స్థానం పక్కా.
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!