Bandi Sanjay: తెలంగాణ విమోచన దినోత్సవాలను జరిపేందుకు భయమెందుకు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీఆర్ఎస్ నాయకులారా.. మీరు నిజమైన తెలంగాణ వాదులైతే.. మీ ఒంట్లో తెలంగాణ రక్తమే ప్రవహిస్తే తక్షణమే ఆ పార్టీని వీడి రండి అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ అన్నారు. కేసీఆర్ కు భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించేందుకు భయపడుతున్న బీఆర్ఎస్ నేతలను చవట దద్దమ్మలు అంటూ ఆయన విమర్శించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఈరోజు పరేడ్ మైదానంలో నిర్వహించిన కార్యక్రమాల్లో బండి సంజయ్ పాల్గొన్నారు.
Read Also: Bigg Boss 7 Telugu : వైల్డ్ కార్డ్ ఎంట్రీకి రెడీ అవుతున్న ఆ ఇద్దరు ఎవరో తెలుసా?
Also Read
- Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ఈ రోజు బీజేపీ కార్యకర్తలకు మూడు పండగలు వచ్చాయని బండి సంజయ్ పేర్కొన్నారు. ఒకటి తెలంగాణ విమోచన దినోత్సవం అయితే, మరోకటి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుట్టిన రోజు, ఇంకోటి విశ్వకర్మ జయంతి అని ఆయన చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గతేడాది నుంచి అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణలో అధికారంలో లేకపోయినా ప్రజల అభిమతాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాలు జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు. బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు దగుల్బాజీ పార్టీలు.. విమోచన దినోత్సవాలను వ్యతిరేకిస్తున్నాయని బండి సంజయ్ అన్నారు.
Read Also: Kuhasini Gnanaseggaran: రెడ్ సారీ లో అందాలు ఆరబోస్తున్న కుహాసిని జ్ఞానసెగ్గరన్
తెలంగాణ ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాలను ఎందుకు జరుపుకోవడం లేదని తిట్టిన కేసీఆర్ ఇప్పుడెందుకు స్పందించడం లేదు అని బండి సంజయ్ అన్నారు. ఆ నోరేమైంది? సిగ్గుండాలే… అధికారంలోకి వచ్చాక నిజాం సమాధి ముందు మోకరిల్లిన నీచుడు కేసీఆర్.. అప్పుడే అర్ధమైంది.. తెలంగాణలో మళ్లీ నయా నిజాం పాలన అమలు కాబోతోందని.. ఆనాడు భయపడినట్లే ప్రస్తుతం జరుగుతోంది అని బండి సంజయ్ విమర్శలు గుప్పించాడు.
Read Also: Maharashtra: వాస్తుదోషాల పేరుతో మహిళపై పదేపదే అత్యాచారం..
పాతబస్తీలో నల్ల జెండాలు ఎగరేసి నిరసన తెలిపిన ఒవైసీకి భయపడి కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాలను నిర్వహించడం లేదు అని బండి సంజయ్ అన్నారు. జాతీయ సమైక్యత దినోత్సవం పేరుతో కొత్త రాగం అందుకున్నాడు.. కేసీఆర్ పార్టీ పుట్టక ముందే తెలంగాణ కోసం 1997లో ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని తీర్మానించిన పార్టీ బీజేపీ.. కేసీఆర్ అంతటి మోసగాడు, దగుల్బాజీ మరొకరు లేరు అని ఆయన విమర్శించారు. మంత్రి పదవి కోసం అజయ్ రావుగా ఉన్న తన కొడుకు పేరును తారక రామారావుగా మార్చిన మోసగాడు కేసీఆర్.. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదని తెలంగాణ ఉద్యమ పార్టీ పెట్టి ప్రజలను మోసం చేస్తున్న దుర్మార్గుడు కేసీఆర్ అంటూ బండి సంజయ్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Off The Record : గుంటూరు జిల్లాలో ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు అందినకాడికి దోచేస్తున్నారా..?
-
Jitan Ram Manjhi: కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంఝీపై రాళ్ల దాడి.. ఇద్దరు అరెస్ట్
-
Off The Record : అన్నిటికీ సీఎం మాత్రమేనా.. మంత్రులు స్పందించరా..?
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!