Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Bandi Sanjay Hot Comments On Cm Kcr

Bandi Sanjay Hot Comments: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో.. సీఎం, హోంమంత్రులను సాక్షిగా చేర్చాల్సిందే

Published Date :November 11, 2022 , 8:49 pm
By Rakesh Reddy
Bandi Sanjay Hot Comments: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో.. సీఎం, హోంమంత్రులను సాక్షిగా చేర్చాల్సిందే
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bandi Sanjay Hot Comments: తెలంగాణలో నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ అలీలను సాక్ష్యులుగా చేర్చాలంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నియమించిన సిట్ ద్వారా వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశమే లేదన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని కోరారు. ఇదే విషయంపై తాము హైకోర్టును ఆశ్రయించామన్నారు. ఈరోజు సాయంత్రం రామగుండం ఎన్టీపీసీ జ్యోతినగర్ లోని మాజీ ఎంపీ జి.వివేక్ వెంకటస్వామి నివాసంలో బండి సంజయ్ మీడియాతో ముచ్చటించారు. రాష్ట్రాభివృద్ధి కోసం వస్తున్న ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకోవాలనుకోవడం మూర్ఖత్వమని.. సీఎం ఆధ్వర్యంలోనే ఈ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రధాని రాష్ట్రానికి వస్తుంటే ముఖ్యమంత్రి హోదాలో స్వాగతం పలకాలనే సంస్కారం కూడా లేని మనిషి కేసీఆర్ అంటూ మండిపడ్డరు. గతంలోనూ ఇంతే.. ఒకసారి కోవిడ్ అంటడు. ఇంకోసారి జ్వరం అంటడు.. మరోసారి ఢిల్లీ అంటడు… ఇట్లా సాకులు చెబుతూ ప్రోటోకాల్ పాటించని మూర్ఖుడని ఆగ్రహం వ్యక్తం చేశాడు బండిసంజయ్.

Read Also: Huzurnagar: నకిలీ జామీన్ తయారీదారుల గుట్టురట్టు.. విచారణలో నమ్మలేని నిజాలు

Also Read

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
  • SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..

తెలంగాణకు అన్యాయం జరిగింది…. కేంద్రం నిధులివ్వడం లేదని పదేపదే దుష్ప్రచారం చేస్తున్న కేసీఆర్… అదే నిజమైతే ప్రధానమంత్రే స్వయగా రాష్ట్రానికి వస్తున్నారు కదా… ఆయనను నేరుగా కలిసి ఎందుకు అడగటం లేదంటూ ప్రశ్నించారు. రాష్ట్ర సమస్యలను ప్రస్తావించడానికైనా ప్రధాని పర్యటనను వేదికగా చేసుకోవచ్చు కదా… అయినా రావడం లేదంటే ప్రధానికి ముఖం చూపలేకనే కమ్యూనిస్టులతో కలిసి ప్రధాన పర్యటనను అడ్డుకునే కుట్ర చేస్తున్నరంటూ బండి వ్యాఖ్యానించారు. గత ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ రైతులందరికీ యూరియా ఫ్రీగా అందిస్తానన్న హామీకి సమాధానం చెప్పాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అతి తక్కువ ధరకు యూరియాను రైతులకు సబ్సిడీపై అందిస్తున్నారని తెలిపారు. అంతేగాకుండా గతంలో మాదిరిగా యూరియా కోసం రైతులు చెప్పులు లైన్లో పెట్టి రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పనిలేకుండా చేస్తున్నారని కితాబిచ్చారు. మోదీ దేశంలో యూరియా కొరత లేకుండా చేసేందుకు రామగుండం ఎరువుల కర్మాగారాన్ని జాతికి అంకితం చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్క టన్ను యూరియాకు 40 వేలు ఖర్చవుతుంటే ఏకంగా 35 వేల సబ్సిడీ ఇస్తూ రైతులకు రూ. 5 వేలకే అందిస్తున్నారని బండి సంజయ్ వెల్లడించారు.

Read Also: MLA Purchasing Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. నాంపల్లి కోర్టులో ముగిసిన వాదనలు

వేల కోట్ల నిధులతో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని వస్తున్నారు? ఆ పని చేయొద్దని అడ్డుకోవాలనుకుంటున్నారా?.. దేనికోసం అడ్డుకోవాలనుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం మోచేతి నీళ్లు తాగుతున్న కమ్యూనిస్టులు ప్రధాని పర్యటనను అడ్డుకోవాలని చూడటం సిగ్గు చేటన్నారు. బిశ్వాల్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మేరకు 1.91 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశారా? జీతాలు, పెన్షన్లు సక్రమంగా ఇస్తున్నారా? దేనికోసం సీఎం మోచేతి నీళ్లు తాగుతున్నారో కమ్యూనిస్టులు సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.

Read Also:Uttar Pradesh: కిడ్నీలో రాళ్లు ఉన్నాయని వెళ్తే.. కిడ్నీనే మాయం చేశారు

గతంలో కేసీఆర్ నయీం కేసు, ఇంటర్మీడియట్ పేపర్ లీక్, మియాపూర్ భూములు, డ్రగ్స్ కేసు వంటి అంశాలన్నింటిపైనా సిట్ వేశారు. కానీ ఆ విచారణలు ఏమయ్యాయి? కేవలం సిట్ నివేదికను అడ్డుపెట్టుకుని బ్లాక్ మెయిల్ చేయడం తప్ప చేసిందేమిటి? ఎవరికి న్యాయం జరిగింది? నలుగురు ఎమ్మెల్యేల వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తున్నాం. కాంగ్రెస్ ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని బండి సంజయ్ అన్నారు. సీఎం అవినీతి, అక్రమాలపై ఆధారాలు సేకరిస్తున్నాం. తప్పకుండా విచారణలు జరుగుతాయి. త్వరలోనే అన్ని విషయాలు బయటకొస్తాయని బండి సంజయ్ వెల్లడించారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bandi sanjay
  • cm kcr
  • high court
  • MLA Purchasing case
  • PM Modi

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions