Huzurnagar: నకిలీ జామీన్ తయారీదారుల గుట్టురట్టు.. విచారణలో నమ్మలేని నిజాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huzurnagar: హుజూర్ నగర్ నియోజకవర్గంలో నకిలీ జామీనులు తయారు చేసే ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామపంచాయతీలకు సంబంధించి నకిలీ రబ్బర్ స్టాంప్ లు, దొంగ ఇంటి పన్నుల రిసిప్ట్ పేపర్లు సృష్టించి కొత్త దందాకు తెర తీశారు. పంచాయతీ కార్యదర్శుల ఫోర్జరీ సంతకాలతో పలువురు నేరస్తులకు నకిలీ జామీన్లు ఇప్పిస్తూ పోలీసులను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ కేటుగాళ్లకు పలువురు లాయర్లు సహకరించడం కొసమెరుపు. కోదాడ డీఎస్పీ వెంకటేశ్వర రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్ నగర్ పట్టణం ఇందిరా గాంధీ సెంటర్లో తమ పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా కోర్టు దగ్గర నలుగురు వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనిపించారన్నారు. వారిని విచారించడంతో పొంతన లేని సమాధానాలు చెప్పారన్నారు. మరింత లోతుగా విచారిస్తే విస్తుపోయే నిజాలు తెలిసి అవాక్కయ్యారని తెలిపారు.
Read Also: MLA Purchasing Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. నాంపల్లి కోర్టులో ముగిసిన వాదనలు
Also Read
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
- DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
- IND Vs ENG 3rd ODI: లార్డ్స్ ఫైనల్ ఫైట్.. సుందర్ స్థానంలో యువ సంచలనానికి లక్కీ ఛాన్స్..
- Aakash Chopra: కుల్దీప్ యాదవ్ను ఎందుకు బలిపశువును చేస్తున్నారు.. మాజీ క్రికెటర్ సూటి ప్రశ్న..
ఈ దొంగ పత్రాలను సృష్టించడం కోసం కొందరు ఓ ముఠాగా ఏర్పడ్డారని వారిలో ప్రధాన నిందితులైన కస్తాల గోపి, మామిడి భాను ప్రకాష్ ఒక్కో నకిలీ జామీన్లలకు రూ.5వేలు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఈ జామీన్లలను అడ్వకేట్ల ద్వారా నిందితులకు ఇప్పించడం జరుగుతుందన్నారు. చెడు వ్యసనాలకు బానిసలైన కొందరు పేదలు ఇట్టి డబ్బుకి ఆశపడి కరుడుగట్టిన నేరస్తులకు బెయిల్ ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పటివరకు 43 మందికి ఇలా దొంగ జామీన్లు ఇప్పించారని పేర్కొన్నారు. బెయిల్ కు సంబంధించిన అన్ని పత్రాలు కూడా స్వయంగా ఈ అక్రమానికి ఒడిగడుతున్న ముఠానే తయారు చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది… ఇంటి పన్ను తో సహా అగ్రిమెంట్లు, స్టాంపులు అన్నీ కూడా ఈ అక్రమార్కులే తయారు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటి వరకు 22 మందిని అరెస్ట్ చేశామని ఈ కేసులో సంబంధమున్న మిగతా 20 మందిని కూడా అరెస్ట్ చేస్తామని తెలిపారు. నిందితులపై సెక్షన్ 420-417-468 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
-
Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
-
YS Jagan : మహిళల భద్రత ఎక్కడ? చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు
-
DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంపుపై కీలక అప్డేట్..
-
CM Revanth Reddy : గద్దర్, అందెశ్రీలతో పెట్టుకున్న వాళ్లు మట్టిలో కలిసిపోయారు
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!