NTV Telugu Site icon

Bandi Sanjay : నిరుద్యోగ సమస్యల కొసం బీజేపీ పొరాటం చేస్తే జైలుకు పంపారు

Bandi Sanjay Telangana Congress

Bandi Sanjay Telangana Congress

కరీంనగర్ అసెంబ్లీ ‌పరిధిలో‌ అంబేద్కర్‌ నగర్ నుంచి కరీంనగర్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి బండి‌ సంజయ్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. నిన్నటి ర్యాలీ ఒక చరిత్ర సృష్టించినది.స్వచ్ఛందంగా తరలివచ్చారన్నారు. 30 తేదిన విజయానికి సంకేతమని, రాష్ట్ర ముఖ్యమంత్రి కరీంనగర్ లో బీజేపీ గెలుస్తదని డిసైడ్ చేసాడన్నారు. బండి‌సంజయ్ భూదందాలు చేయలేదని, ఖబ్జా లు చేయలేదన్నారు. కరీంనగర్ అభివృద్ధి కి‌ నిధులు తీసుకువచ్చింది ఎవరు,అభివృద్ధి అడ్డం‌ పడ్డది ఎవరూ అని ఆయన ప్రశ్నించారు. బండి‌సంజయ్ ని‌ అసెంబ్లీ లో అడుగు పెట్టవద్దంటూ వేల కోట్లు కరీంనగర్ కి పంపుతున్నారని, కరీంనగర్ బండి‌సంజయ్ మీద ఎవరూ పోటి చెయడానికి ముందుకు రాకపోతే గుడ్డిలో మెల్లలాగా గంగులకి టికెట్ ఇచ్చారన్నారు.

అంతేకాకుండా.. ‘కేటీఆర్ ముఖ్యమంత్రి కొడుకు కాకపోతే కుక్కలు కుడా దేకవు. కేటీఆర్ వి అహంకారం అహంకారం మాటలు. బీఆర్ఎస్ గెలిస్తే జాబ్ క్యాలెండర్‌ అనౌన్స్ చేస్తానని ఇప్పుడు ఇస్తానంటున్నారు. టీఎస్పీపీఎస్సీ సమస్య చిన్నది అని‌ కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నిరుద్యోగుల అశలు అడియాశలు అయినవి. నిరుద్యోగ సమస్యల కొసం బీజేపీ పొరాటం చేస్తే జైలుకు పంపారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. సంవత్సరం లో మోడి పది లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. యాభై లక్షల మంది నిరుద్యోగ యువత కదలి వచ్చి బిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడానికి చేతులు కలపాలి. నరేంద్ర మోడీ బీసీ అత్మగౌరవ సభకి వస్తున్నారు, బీసీ వర్గానికి చెందిన వ్యక్తి ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పాం. కేసీఆర్‌కి బీసీ ముఖ్యమంత్రి ని చెస్తానని చెప్పె దమ్ము ధైర్యం ఉందా? గతంలో చెప్పినట్లు ఎస్సిని ముఖ్యమంత్రిగా చేస్తావా. బంగారు తెలంగాణ అని బర్బాజ్ చేసాడు. కేసీఆర్ కుటుంబం అహంకారానికి,తెలంగాణ ప్రజలకి జరుగుతున్న పోరాటం. కేసీఆర్ రాజ్యాంగం కావాలా…అంబేద్కర్ రాజ్యాంగం కావాలా.. తెలంగాణ రాష్ట్రం లో దొంగలంతా బిఆర్ఎస్ లో చేరినారు. ఒకసారి బీజేపీ పార్టీకి అవకాశం ఇవ్వండి. ప్రశ్నించే గొంతుని అణచివేయకండి…. గెలిపించండి’ ‘ అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు.