Bandi Sanjay: వారణాసిలో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం.. తెలుగు సంఘాల ప్రతినిధులతో భేటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియోజకవర్గమైన వారణాసిలో తెలుగువారు అత్యధికంగా నివసించే పాండే హవేలీ, సోనార్ పుర తదితర ప్రాంతాల్లో బండి సంజయ్ డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. పలు తెలుగు సంఘాల ప్రతినిధులతో సంజయ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరో విడతలో భాగంగా జూన్ ఒకటిన వారణాసిలో జరిగే ఎన్నికల్లో వార్ వన్ సైడే ఉందని సంజయ్ అన్నారు. పోలయ్యే ఓట్లలో అత్యధిక శాతం శాతం మోడీకే పడటం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
READ MORE: KTM Mew Colour: బైక్ రంగులు మార్చిన కెటిఎమ్ ఇండియా.. కొత్త కలర్స్ లో అందుబాటులోకి..
Also Read
- Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
- Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
- Vijayawada Municipal Corporation: బెజవాడ కార్పొరేషన్లో డివిజన్ల పెంపు.. 64 నుంచి 86కు విస్తరణ.. నోటిఫికేషన్ విడుదల
- Fake Liquor Case: నకిలీ మద్యం కేసులో భారీ చార్జ్షీట్ దాఖలు.. 25 మందిపై అభియోగాలు
వారణాసిలో ఉన్న ప్రతి ఒక్కరూ మోడీ అభిమానులేనని, వారంతా కచ్చితంగా కమలం గుర్తుకే ఓటు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు. అయితే, పోలింగ్ శాతం పెరిగేలా చూడాలని తెలుగు సంఘాల ప్రతినిధులను కోరారు. మోడీకి భారతదేశంలోనే అత్యధిక మెజారిటీ రావాలంటే అత్యధిక పోలింగ్ నమోదు కావాలన్నారు. సోనార్పురలో మహిళా బృందంతో బండి సంజయ్ భేటీ సందర్భంగా కాశీలోని ప్రతి ఒక్క మహిళ మోడీకే ఓటు వేస్తారని బృందంలోని మహిళలు సంజయ్కు వివరించారు. అదే ధీమాతో కూర్చోకుండా ఇంట్లో వాళ్లతో పాటు ఇరుగు పొరుగు వారితోనూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాల్సిన బాధ్యత మహిళలదేనని సంజయ్ వారికి సూచించారు. శ్రీరామ తారక ఆంధ్రా ఆశ్రమంలో వారణాసి తెలుగు సమితి కార్యదర్శి వీవీ సుందరశాస్త్రితోనూ బండి భేటీ అయ్యారు. పలు మఠాలు, సత్రాల్లో తెలుగు సంఘాలతో జరిగిన సమావేశాల్లో స్థానిక కార్పొరేటర్ ముఖర్జీ, బీజేపీ నాయకులు గజానంద్ జోషి, మహేష్ బాబు, పాఠక్తో పాటు హైదరాబాద్ నుంచి వెళ్లిన బీజేపీ నాయకులు గీతా మూర్తి, బొమ్మ జయశ్రీ, ఉమారాణి, సంగప్ప, విక్రమ్ రెడ్డి, గడ్డం శ్రీనివాస్, పరిణిత తదితరులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రానికే పరిమితమైన సంజయ్ ప్రధాని మోడీ పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ప్రచారం చేయడంపై కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Dragon Glimpse: 4 నిమిషాల పైగా ఊచకోత.. బాక్సాఫీస్ వద్ద విధ్వంసానికి టైం ఫిక్స్.. అర్ధరాత్రి #NTRNeel బర్త్డే గిఫ్ట్!
-
Water Board Manager: జలమండలి మేనేజర్ ఇంట్లో ఏసీబీ దాడులు.. రూ.100 కోట్లకు పైగా ఆస్తులు గుర్తింపు!
-
Sorakaya Kadhi Recipe: నిమిషాల్లో రుచికరమైన, ఆరోగ్యకరమైన కర్రీ.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ అడుగుతారు..!
-
NTRNeel : సోషల్ మీడియాలో ఎన్టీఆర్ – నీల్ హంగామా మాములుగా లేదు
-
Russian Oil: అమెరికా ఆంక్షలు ఉంటే ఎంత? ఊడితే ఎంత! రష్యా చమురు కొనుగోలుపై భారత్ ‘మాస్’ స్టేట్మెంట్!
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!