Bandi Sanjay : నాలాంటి సామాన్య కార్యకర్తకు జాతీయ ప్రధాన కార్యదర్శి ఇచ్చినందుకు గర్వంగా ఉంది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్కు పదోన్నతి లభించింది. బీజేపీ అధిష్టానం ఆయనకు కీలక పదవిని కట్టబెట్టింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ను నియమిస్తూ జాతీయ నాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలోనే జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ కొనసాగనున్నట్లు వెల్లడించారు. ఏపీ బీజేపీ నేత సత్య కుమార్ కు జాతీయ కార్య దర్శిగా ఛాన్స్ ఇస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేసినప్పటి నుంచి ఆయన పదవిపై రకరకాల ఊహాగానాలు వచ్చాయి. బండి సంజయ్కు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించడం లేదా జాతీయ కార్యదర్శిగా నియమించి కొన్ని రాష్ట్రాలకు ఇన్ఛార్జ్గా పంపడం ద్వారా కేంద్ర నాయకత్వం బండి సంజయ్ సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
Also Read : Governor Convoy: గవర్నర్ కాన్వాయ్లోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు అరెస్ట్
Also Read
- AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం...
- Bathroom Cleaning Tips: కుళాయిలు, సింక్లు కొత్తవిగా మెరవాలంటే.. ఈ చిట్కాలతో నిమిషాల్లో కొత్త మెరుపు!
- Ayodhya Ram Temple Land Deal: అయోధ్య రామమందిర కేసులో కొత్త మలుపు.. భూ కొనుగోళ్లపై SIT దర్యాప్తు
- Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై ప్రభుత్వం కీలక నిర్ణయం..
కిషన్ రెడ్డి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.. ఒకరికి ఒకే పదవి.. ఆయన రాజీనామాతో కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణకు ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. దీంతో ఆయన స్థానంలో రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన బండి సంజయ్ కు అవకాశం కల్పిస్తారనే ప్రచారం సాగింది. అయితే తాజాగా బండి సంజయ్ని జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఆ పార్టీ జాతీయ నాయకత్వం ఉత్తర్వులు జారీ చేసింది బీజేపీ అధిష్టానం..
Also Read : Cinematography Bill: సినిమా చూస్తూ స్టేటస్ పెట్టడానికి వీడియో తీస్తున్నారా? దొరికితే మైండ్ బ్లాకయ్యే శిక్ష?
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. నాలాంటి సామాన్య కార్యకర్తకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇచ్చినందుకు గర్వంగా ఉందన్నారు. నాకు ఇంత పెద్ద అవకాశం ఇచ్చినందుకు ప్రధాని నరేంద్రమోడీ, అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ స్థాయికి ఎదగడానికి, ఏ బాధ్యతలో ఉన్న నేర్చుకోవడానికి నన్ను ప్రోత్సహిస్తున్న కార్యకర్తలకు నన్ను ఎల్లప్పుడూ ఆదరిస్తున్న కరీంనగర్ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు బండి సంజయ్. అత్యంత అంకితభావంతో, నేను నా పార్టీకి ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని, జై శ్రీ రామ్ భారత్ మాతాకు జై అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Gold & Silver Prices Today: ఇలా అయితే కొనేదెట్టా.. వరుసగా రెండో రోజు భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు..
-
Sanju Samson: వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం కోసం సంజూనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?
-
TheParadise : నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ప్రీమియర్స్ ఎప్పుడంటే?
-
AP Education Fee Hike: ఉన్నత విద్యా ఫీజులపై సర్కార్ కీలక నిర్ణయం…
-
Siya Goyal: పూణే లోహగడ్ కోట హ*త్య కేసు.. మీడియాకు మిడిల్ ఫింగర్ చూపించిన సియా గోయల్.. వీడియో వైరల్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!