Rice Price Hike: ప్రపంచ మార్కెట్లో 12ఏళ్ల గరిష్టానికి చేరుకున్న బియ్యం ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rice Price Hike: ద్రవ్యోల్బణానికి బ్రేక్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై నిషేధం విధించిన కేంద్రం బాస్మతి బియ్యం ఎగుమతిపై కూడా షరతులతో నిషేధం విధించింది. దీంతో దేశంలో బియ్యం నిల్వలు పెరుగుతాయని.. దీని కారణంగా ధరలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. కానీ, భారత ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల గ్లోబల్ మార్కెట్లో బియ్యం ధర ఎక్కువైంది. చాలా దేశాల్లో బియ్యం ధరలు మండిపోతున్నాయి. భారతదేశం బియ్యం ఎగుమతిపై నిషేధం కారణంగా.. ప్రపంచ మార్కెట్లో బియ్యం ధర 12 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది.
Read Also:Nag: తెలుగు సినిమా రాతని మార్చిన ఈయన్ని కింగ్ అనకుండా ఎలా ఉంటారు?
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
బాస్మతీయేతర అన్ని రకాల బియ్యం ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. బాస్మతియేతర బియ్యం పేరుతో భారీ కుంభకోణం జరుగుతోందని ప్రభుత్వం భావించింది. వ్యాపారులు బాస్మతి బియ్యం పేరుతో నాన్ బాస్మతి మాత్రమే ఎగుమతి చేస్తున్నారు. దీంతో కొన్ని షరతులతో బాస్మతి బియ్యం ఎగుమతిని నిషేధించాలని నిర్ణయించుకుంది. ఈ చర్యతో బాస్మతీయేతర బియ్యం ఎగుమతికి బ్రేక్ పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. విశేషమేమిటంటే ఈసారి ప్రభుత్వం నిషేధం విధించి టన్నుకు 1200 డాలర్ల కంటే తక్కువ ధర ఉన్న బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేయబోమని చెప్పింది. అంటే దీని నుంచి ఖరీదైన బాస్మతి బియ్యం ఎగుమతి అవుతాయి.
Read Also:Rohit Sharma: ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకుంటే.. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు: రోహిత్ శర్మ
ప్రపంచంలోనే అత్యధిక బియ్యం ఎగుమతి చేసే దేశం భారతదేశం. ఇది ఒక్కటే ప్రపంచ మార్కెట్లో 40 శాతం బియ్యాన్ని ఎగుమతి చేస్తోంది. ఇందులో ఒక్క బాస్మతి బియ్యం వాటా 40 లక్షల టన్నులు. భారతదేశం 177.9 లక్షల టన్నుల బాస్మతీయేతర బియ్యాన్ని ఎగుమతి చేసింది. దీని విలువ 6.36 బిలియన్ డాలర్లు. కాగా, 2022-2023 పంట సీజన్లో భారతదేశంలో మొత్తం 13.54 కోట్ల టన్నుల బియ్యం ఉత్పత్తి చేయబడింది. అంతకుముందు 2021-2022 సంవత్సరంలో 12.94 టన్నుల బియ్యం ఉత్పత్తి చేయబడింది. అంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారత్లో బియ్యం ఉత్పత్తి పెరిగింది. భారతదేశం టన్నుకు 1200డాలర్ల కంటే తక్కువ ధర ఉన్న 80 శాతం బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చౌక ధరకు విక్రయించే బియ్యాన్ని నిల్వ చేయడానికి ప్రోత్సాహాన్నిస్తుంది.
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్ఫ్లిక్స్లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!