Rice Price Hike: ప్రపంచ మార్కెట్లో 12ఏళ్ల గరిష్టానికి చేరుకున్న బియ్యం ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rice Price Hike: ద్రవ్యోల్బణానికి బ్రేక్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై నిషేధం విధించిన కేంద్రం బాస్మతి బియ్యం ఎగుమతిపై కూడా షరతులతో నిషేధం విధించింది. దీంతో దేశంలో బియ్యం నిల్వలు పెరుగుతాయని.. దీని కారణంగా ధరలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. కానీ, భారత ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల గ్లోబల్ మార్కెట్లో బియ్యం ధర ఎక్కువైంది. చాలా దేశాల్లో బియ్యం ధరలు మండిపోతున్నాయి. భారతదేశం బియ్యం ఎగుమతిపై నిషేధం కారణంగా.. ప్రపంచ మార్కెట్లో బియ్యం ధర 12 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది.
Read Also:Nag: తెలుగు సినిమా రాతని మార్చిన ఈయన్ని కింగ్ అనకుండా ఎలా ఉంటారు?
Also Read
- Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
- Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
- Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
- First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
బాస్మతీయేతర అన్ని రకాల బియ్యం ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. బాస్మతియేతర బియ్యం పేరుతో భారీ కుంభకోణం జరుగుతోందని ప్రభుత్వం భావించింది. వ్యాపారులు బాస్మతి బియ్యం పేరుతో నాన్ బాస్మతి మాత్రమే ఎగుమతి చేస్తున్నారు. దీంతో కొన్ని షరతులతో బాస్మతి బియ్యం ఎగుమతిని నిషేధించాలని నిర్ణయించుకుంది. ఈ చర్యతో బాస్మతీయేతర బియ్యం ఎగుమతికి బ్రేక్ పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. విశేషమేమిటంటే ఈసారి ప్రభుత్వం నిషేధం విధించి టన్నుకు 1200 డాలర్ల కంటే తక్కువ ధర ఉన్న బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేయబోమని చెప్పింది. అంటే దీని నుంచి ఖరీదైన బాస్మతి బియ్యం ఎగుమతి అవుతాయి.
Read Also:Rohit Sharma: ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకుంటే.. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు: రోహిత్ శర్మ
ప్రపంచంలోనే అత్యధిక బియ్యం ఎగుమతి చేసే దేశం భారతదేశం. ఇది ఒక్కటే ప్రపంచ మార్కెట్లో 40 శాతం బియ్యాన్ని ఎగుమతి చేస్తోంది. ఇందులో ఒక్క బాస్మతి బియ్యం వాటా 40 లక్షల టన్నులు. భారతదేశం 177.9 లక్షల టన్నుల బాస్మతీయేతర బియ్యాన్ని ఎగుమతి చేసింది. దీని విలువ 6.36 బిలియన్ డాలర్లు. కాగా, 2022-2023 పంట సీజన్లో భారతదేశంలో మొత్తం 13.54 కోట్ల టన్నుల బియ్యం ఉత్పత్తి చేయబడింది. అంతకుముందు 2021-2022 సంవత్సరంలో 12.94 టన్నుల బియ్యం ఉత్పత్తి చేయబడింది. అంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారత్లో బియ్యం ఉత్పత్తి పెరిగింది. భారతదేశం టన్నుకు 1200డాలర్ల కంటే తక్కువ ధర ఉన్న 80 శాతం బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చౌక ధరకు విక్రయించే బియ్యాన్ని నిల్వ చేయడానికి ప్రోత్సాహాన్నిస్తుంది.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ‘చాలా సంతోషంగా ఉంది.. ఈ సీక్రెట్ ప్లాన్తో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్కు వెళ్తాం’..
-
HYDRAA : హైదరాబాద్ చెరువులకు హైడ్రా టచ్.. రూ.107 కోట్ల భారీ ప్రాజెక్ట్.!
-
Kitchen Cleaning Tips: వంటగది లైట్ స్విచ్లపై జిగురు మరకలా? 5 నిమిషాల్లో క్లీనింగ్కు సూపర్ టిప్స్
-
Ind Vs Ban: బంగ్లాదేశ్పై భారత్ ఘన విజయం.. సెమీస్ రేసులో దూసుకెళ్లిన టీమిండియా..
-
First T20 Captain: ధోని కాదు.. భారత్కు తొలి టీ-20 కెప్టెన్ ఎవరో తెలుసా..?
ట్రెండింగ్
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!