Rice Price Hike: ప్రపంచ మార్కెట్లో 12ఏళ్ల గరిష్టానికి చేరుకున్న బియ్యం ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rice Price Hike: ద్రవ్యోల్బణానికి బ్రేక్ వేసేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై నిషేధం విధించిన కేంద్రం బాస్మతి బియ్యం ఎగుమతిపై కూడా షరతులతో నిషేధం విధించింది. దీంతో దేశంలో బియ్యం నిల్వలు పెరుగుతాయని.. దీని కారణంగా ధరలు తగ్గుతాయని ప్రభుత్వం భావిస్తోంది. కానీ, భారత ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య వల్ల గ్లోబల్ మార్కెట్లో బియ్యం ధర ఎక్కువైంది. చాలా దేశాల్లో బియ్యం ధరలు మండిపోతున్నాయి. భారతదేశం బియ్యం ఎగుమతిపై నిషేధం కారణంగా.. ప్రపంచ మార్కెట్లో బియ్యం ధర 12 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరుకుంది.
Read Also:Nag: తెలుగు సినిమా రాతని మార్చిన ఈయన్ని కింగ్ అనకుండా ఎలా ఉంటారు?
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
బాస్మతీయేతర అన్ని రకాల బియ్యం ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. బాస్మతియేతర బియ్యం పేరుతో భారీ కుంభకోణం జరుగుతోందని ప్రభుత్వం భావించింది. వ్యాపారులు బాస్మతి బియ్యం పేరుతో నాన్ బాస్మతి మాత్రమే ఎగుమతి చేస్తున్నారు. దీంతో కొన్ని షరతులతో బాస్మతి బియ్యం ఎగుమతిని నిషేధించాలని నిర్ణయించుకుంది. ఈ చర్యతో బాస్మతీయేతర బియ్యం ఎగుమతికి బ్రేక్ పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. విశేషమేమిటంటే ఈసారి ప్రభుత్వం నిషేధం విధించి టన్నుకు 1200 డాలర్ల కంటే తక్కువ ధర ఉన్న బాస్మతి బియ్యాన్ని ఎగుమతి చేయబోమని చెప్పింది. అంటే దీని నుంచి ఖరీదైన బాస్మతి బియ్యం ఎగుమతి అవుతాయి.
Read Also:Rohit Sharma: ప్రపంచకప్ జట్టులో చోటు దక్కకుంటే.. ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు: రోహిత్ శర్మ
ప్రపంచంలోనే అత్యధిక బియ్యం ఎగుమతి చేసే దేశం భారతదేశం. ఇది ఒక్కటే ప్రపంచ మార్కెట్లో 40 శాతం బియ్యాన్ని ఎగుమతి చేస్తోంది. ఇందులో ఒక్క బాస్మతి బియ్యం వాటా 40 లక్షల టన్నులు. భారతదేశం 177.9 లక్షల టన్నుల బాస్మతీయేతర బియ్యాన్ని ఎగుమతి చేసింది. దీని విలువ 6.36 బిలియన్ డాలర్లు. కాగా, 2022-2023 పంట సీజన్లో భారతదేశంలో మొత్తం 13.54 కోట్ల టన్నుల బియ్యం ఉత్పత్తి చేయబడింది. అంతకుముందు 2021-2022 సంవత్సరంలో 12.94 టన్నుల బియ్యం ఉత్పత్తి చేయబడింది. అంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది భారత్లో బియ్యం ఉత్పత్తి పెరిగింది. భారతదేశం టన్నుకు 1200డాలర్ల కంటే తక్కువ ధర ఉన్న 80 శాతం బియ్యాన్ని ఎగుమతి చేస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చౌక ధరకు విక్రయించే బియ్యాన్ని నిల్వ చేయడానికి ప్రోత్సాహాన్నిస్తుంది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..